‘మళ్ళీ రావా, ఈ నగరానికి ఏమైంది, మీకు మాత్రమే చెప్తా, ఇచ్చట వాహనములు నిలపరాదు’ వంటి సినిమాలతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకుని, ఇటీవల ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీతో తెలుగు ప్రేక్షక లోకానికి మరింత దగ్గరైన అభినవ్ గోమఠం హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఓ కొత్త దర్శకుడి దర్శకత్వంలో కాసుల క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో ఈ సినిమా నిర్మితమవుతోంది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్రయూనిట్.…
అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున మేనల్లుడుగా చిత్రసీమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్… నిజానికి ప్రముఖ నిర్మాత ఎ.వి. సుబ్బారావు మనవడు కూడా. ఆ రకంగా అటు తండ్రి, ఇటు తల్లి నుండి అతనికి సినిమా రంగంతో గాఢానుబంధమే ఉంది. తొలి చిత్రాల సంగతి ఎలా ఉన్నా, ఆ మధ్య వచ్చిన ‘చి.ల.సౌ.’ చిత్రం డీసెంట్ హిట్ అయ్యి, సుశాంత్ కు నటుడిగా మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా…