నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, కళాభినేత్రి వాణిశ్రీ జంటగా నటించిన అనేక చిత్రాలు తెలుగువారిని పులకింప చేశాయి. ఏయన్నార్ హిట్ పెయిర్ గా వాణిశ్రీ జేజేలు అందుకున్నారు. వారిద్దరూ జోడీగా నటించిన ‘ఆలుమగలు’ చిత్రం కూడా తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా 1977 మార్చి 17న విడుదలయి, విజయఢంకా మోగించింది. అక్కినేనితో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఎ.వి.సుబ్బారావు ‘ఆలుమగలు’ సినిమాను తాతినేని రామారావు దర్శకత్వంలో తెరకెక్కించారు. ‘ఆలుమగలు’ కథ ఏమిటంటే-…
నటభూషణ శోభన్ బాబు హీరోగా కొన్ని నవలా చిత్రాలు తెలుగువారిని అలరించాయి. మాదిరెడ్డి సులోచన రాసిన ‘మిస్టర్ సంపత్ ఎమ్.ఎ.’ నవల ఆధారంగా తెరకెక్కిన శోభన్ బాబు చిత్రం ‘ఈతరం మనిషి’. పల్లవి ఆర్ట్ పిక్చర్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ యస్.వెంకటరత్నం, అతని మిత్రుడు కె.రవీంద్రనాథ్ కలసి ఈ చిత్రాన్నినిర్మించారు. వి.మధుసూదనరావు దర్శకత్వంలో ‘ఈతరం మనిషి’ తెరకెక్కింది. 1977 ఫిబ్రవరి 10న ‘ఈతరం మనిషి’ జనం ముందు నిలచింది. ‘ఈతరం మనిషి’ కథ ఏమిటంటే – రవి…
నవతరం వేగానికి తాము తట్టుకోలేమని చాలామంది పెద్దవారు అంటూ ఉంటారు. నిజమే! ప్రస్తుతం అన్నిటా వేగం పెరిగిపోతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘ప్రియదర్శని’ని చేతిలో పట్టుకు తిరుగుతున్న రోజులివి. సాంకేతికత పేరుతో ఏళ్ళ తరబడి చలనచిత్రాలను రూపొందిస్తున్న రోజులు కూడా ఇవే! ఓ భారీ జానపదం తెరకెక్కించడానికే రెండు, మూడేళ్ళు తీసుకుంటున్నారు దర్శకులు, నిర్మాతలు. నవీన సాంకేతికతతో వేగం పెరిగిన రోజుల్లోనే ఇన్ని రోజులు అయితే, నలభై ఐదేళ్ళ క్రితం ఓ భారీ పౌరాణిక చిత్రాన్ని రూపొందించడానికి…