Yashasvi Jaiswal: జైస్వాల్ వీరవిహారం.. దెబ్బకు ఐదు రికార్డులు మటాష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashasvi Jaiswal Created 5 Records With His 98 Knock: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో.. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎలా విధ్వంసం సృష్టించాడో అందరికీ తెలుసు. కేవలం 13 బంతుల్లోనే అర్థశతకం సాధించిన అతగాడు.. ఓవరాల్గా 47 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్ల సహకారంతో 98 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇతడు ఆడిన ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ వల్లే.. కేకేఆర్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని ఆర్ఆర్ 41 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఛేధించింది. జట్టు విజయంలో అత్యంత కీలకంగా నిలిచిన జైస్వాల్.. ఈ క్రమంలో పలు రికార్డులను నమోదు చేశాడు. అవేంటంటే..
Sudigali Sudheer: ఏయ్ .. ఏయ్.. సుధీర్ అన్నా.. ‘బ్యాచిలర్’ భామతో రొమాన్సా..
Also Read
- Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
- Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
- Joe Root: నాకు ఆడడం రాదా?.. 14 వేల పరుగులు ఎలా చేశాను.. విమర్శకులకు జో రూట్ గట్టి కౌంటర్!
- Babar Azam: బాబర్ అజామ్.. నీవల్ల జట్టుకు ఏం ఉపయోగం.. బాసిత్ అలీ ఫైర్!

* కేవలం 13 బంతుల్లో అర్థశతకం చేసిన జైస్వాల్.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్థశతకాన్ని నమోదు చేశాడు. ఇంతకుముందు కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశారు.
* టీమ్ ఓవర్స్తో పోలిస్తే, జైస్వాల్ చాలా త్వరగా ఈ అర్థశతకాన్ని సాధించాడు. కేవలం 2.5 (టీమ్) ఓవర్లలోనే ఈ మైల్స్టోన్ని సాధించాడు.
* నితీశ్ రానా వేసిన తొలి ఓవర్లో జైస్వాల్ 26 పరుగులు కొట్టి.. మొదటి ఓవర్లో ఇంత భారీ స్కోరు చేసిన రికార్డ్ని జైస్వాల్ తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు 2021లో పృథ్వీ షా 24 పరుగులు చేశాడు.
* తొలి ఓవర్లో 26 పరుగులు చేయడం.. ఐపీఎల్ చరిత్రలో జాయింట్-సెకండ్ హయ్యస్ట్. ఇంతకుముందు ఆర్సీబీ 2011లో ముంబై ఇండియన్స్పై తొలి ఓవర్లో 27 పరుగులు చేసింది.
* ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు నమోదు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా జైస్వాల్(575) నిలిచాడు. ఇంతకుముందు 2020లో ఇషాన్ కిషన్ 516 పరుగులు చేశాడు.
Virat – Rohit: రోహిత్, కోహ్లీల పని అయిపోయింది.. మాజీ సెలక్టర్ సంచలన ట్వీట్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులే చేసింది. వెంకటేశ్ అయ్యర్ ఒక్కడే (57) అర్థశతకంతో రాణించగా.. మిగతా బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. 13.1 ఓవర్లలోనే 151 పరుగులు చేసి, చారిత్రాత్మక విజయం సాధించింది. జైస్వాల్ (98), సంజూ శాంసన్ (48) వీరవిహారం చేయడం వల్లే.. ఆర్ఆర్ ఇంతటి ఘనవిజయాన్ని నమోదు చేయగలిగింది.
తాజావార్తలు
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్పైనే ఆశలు!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్లో అదరగొట్టిందిగా!
-
Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!