Yashasvi Jaiswal: జైస్వాల్ వీరవిహారం.. దెబ్బకు ఐదు రికార్డులు మటాష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yashasvi Jaiswal Created 5 Records With His 98 Knock: ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో.. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎలా విధ్వంసం సృష్టించాడో అందరికీ తెలుసు. కేవలం 13 బంతుల్లోనే అర్థశతకం సాధించిన అతగాడు.. ఓవరాల్గా 47 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్ల సహకారంతో 98 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇతడు ఆడిన ఈ విధ్వంసకర ఇన్నింగ్స్ వల్లే.. కేకేఆర్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని ఆర్ఆర్ 41 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో ఛేధించింది. జట్టు విజయంలో అత్యంత కీలకంగా నిలిచిన జైస్వాల్.. ఈ క్రమంలో పలు రికార్డులను నమోదు చేశాడు. అవేంటంటే..
Sudigali Sudheer: ఏయ్ .. ఏయ్.. సుధీర్ అన్నా.. ‘బ్యాచిలర్’ భామతో రొమాన్సా..
Also Read
- Jasprit Bumrah: "ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!".. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..

* కేవలం 13 బంతుల్లో అర్థశతకం చేసిన జైస్వాల్.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్థశతకాన్ని నమోదు చేశాడు. ఇంతకుముందు కేఎల్ రాహుల్, పాట్ కమిన్స్ 14 బంతుల్లో హాఫ్ సెంచరీలు చేశారు.
* టీమ్ ఓవర్స్తో పోలిస్తే, జైస్వాల్ చాలా త్వరగా ఈ అర్థశతకాన్ని సాధించాడు. కేవలం 2.5 (టీమ్) ఓవర్లలోనే ఈ మైల్స్టోన్ని సాధించాడు.
* నితీశ్ రానా వేసిన తొలి ఓవర్లో జైస్వాల్ 26 పరుగులు కొట్టి.. మొదటి ఓవర్లో ఇంత భారీ స్కోరు చేసిన రికార్డ్ని జైస్వాల్ తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు 2021లో పృథ్వీ షా 24 పరుగులు చేశాడు.
* తొలి ఓవర్లో 26 పరుగులు చేయడం.. ఐపీఎల్ చరిత్రలో జాయింట్-సెకండ్ హయ్యస్ట్. ఇంతకుముందు ఆర్సీబీ 2011లో ముంబై ఇండియన్స్పై తొలి ఓవర్లో 27 పరుగులు చేసింది.
* ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు నమోదు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా జైస్వాల్(575) నిలిచాడు. ఇంతకుముందు 2020లో ఇషాన్ కిషన్ 516 పరుగులు చేశాడు.
Virat – Rohit: రోహిత్, కోహ్లీల పని అయిపోయింది.. మాజీ సెలక్టర్ సంచలన ట్వీట్
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులే చేసింది. వెంకటేశ్ అయ్యర్ ఒక్కడే (57) అర్థశతకంతో రాణించగా.. మిగతా బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. అనంతరం 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. 13.1 ఓవర్లలోనే 151 పరుగులు చేసి, చారిత్రాత్మక విజయం సాధించింది. జైస్వాల్ (98), సంజూ శాంసన్ (48) వీరవిహారం చేయడం వల్లే.. ఆర్ఆర్ ఇంతటి ఘనవిజయాన్ని నమోదు చేయగలిగింది.
తాజావార్తలు
-
Karuppu : ఫైనాన్స్ అడ్డంకులు తొలగి థియేటర్లలోకి వచ్చిన సూర్య ‘కరుప్పు’
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!