WPL 2026: నేటి నుంచే డబ్ల్యూపీఎల్ సందడి మొదలు.. తొలి మ్యాచ్లో ముంబై vs బెంగళూరు! ప్రత్యేక ఆకర్షణగా జాక్వెలిన్
- నేటి నుంచే డబ్ల్యూపీఎల్ 2026
- తొలి మ్యాచ్లో ముంబై vs బెంగళూరు
- ప్రత్యేక ఆకర్షణగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్ 2026, ఐపీఎల్ 2026కు ముందు మరో పొట్టి టోర్నీ క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 నేటి నుంచి ఆరంభం కానుంది. తొలి మ్యాచ్లో మాజీ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఢీకొంటుంది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. మ్యాచ్కు ముందు ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. గాయకుడు యోయో హనీసింగ్, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
డబ్ల్యూపీఎల్ 2026లో ముంబై జట్టు పటిష్టంగా ఉంది. హర్మన్ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బ్రంట్, హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, అమన్జ్యోత్, గుణాలన్ కమలినితో బ్యాటింగ్ బలంగా ఉంది. ఫాస్ట్బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ బౌలింగ్కు నాయకత్వం వహించనుంది. సైకా ఇషాక్ లాంటి నాణ్యమైన స్పిన్నర్ జట్టులో ఉంది. మరోవైపు బెంగళూరు టీమ్ కూడా బలంగానే ఉంది. స్మృతి మంధాన, జార్జియా వోల్, గ్రేస్ హారిస్, నదైన్ డిక్లెర్క్, రిచా ఘోష్ బ్యాటింగ్ భారం మోయనున్నారు. అయితే ఎలిస్ పెర్రీ లేకపోవడం లోటే. లారెన్, పూజ వస్త్రాకర్, అరుంధతి, డిక్లెర్క్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్ స్పిన్ విభాగంలో ఆడనున్నారు.
Also Read
- Sakshi Chaudhary: కోహ్లీ వల్లే ఆటపై ఫోకస్ పెట్టా.. కామన్వెల్త్ స్వర్ణ విజేత సాక్షి చౌదరి ఎమోషనల్ కామెంట్స్
- Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
- Ajinkya Rahane New Innings: రిటైర్మెంట్ రోజే స్టీవ్ వా ఫోన్.. రహానే కెరీర్కు కొత్త మలుపు
- Cricket Player: బోర్డును బురిడీ కొట్టించాలనుకున్నాడు.. చివరికి కెరీర్ క్లోజ్..
డబ్ల్యూపీఎల్లో ఇప్పటివరకు మూడు సీజన్లు జరిగగా.. ముంబై రెండు సార్లు (2023, 2025) విజేతగా నిలిచింది. 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. టోర్నీ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతుంది. 5 జట్లు ఒకదానితో ఒకటి రెండేసి మ్యాచ్లు ఆడతాయి. లీగ్ దశలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్కు చేరుకుంటాయి. టేబుల్ టాపర్ నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. రెండు, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్లో తలపడతాయి.
తాజావార్తలు
-
OTR : నిజామాబాద్ గులాబీ కోటలో గందరగోళం.. నేతల తీరు చర్చనీయాంశం!
-
CM Revanth Reddy: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మార్చేలా వ్యూహం.. సీఎం రేవంత్, అరవింద్ సుబ్రమణియన్ చర్చలు..
-
AP IAS Transfers 2026: 22 మంది IAS అధికారుల బదిలీలు.. కీలక శాఖల్లో మార్పులు.. ఆమ్రపాలికి నో పోస్టింగ్..
-
God Of War : ‘డ్రాగన్’ తర్వాత కొత్త ప్రాజెక్ట్పై ఎన్టీఆర్ ఫోకస్
-
Iran: పాక్, టర్కీతో ఒప్పందాలు రక్షించలేవు.. సౌదీకి ఇరాన్ వార్నింగ్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!