WPL 2026: నేటి నుంచే డబ్ల్యూపీఎల్ సందడి మొదలు.. తొలి మ్యాచ్లో ముంబై vs బెంగళూరు! ప్రత్యేక ఆకర్షణగా జాక్వెలిన్
- నేటి నుంచే డబ్ల్యూపీఎల్ 2026
- తొలి మ్యాచ్లో ముంబై vs బెంగళూరు
- ప్రత్యేక ఆకర్షణగా జాక్వెలిన్ ఫెర్నాండెజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 ప్రపంచకప్ 2026, ఐపీఎల్ 2026కు ముందు మరో పొట్టి టోర్నీ క్రికెట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమైంది. మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 నేటి నుంచి ఆరంభం కానుంది. తొలి మ్యాచ్లో మాజీ విజేత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఢీకొంటుంది. నవీ ముంబైలోని డాక్టర్ డివై పాటిల్ స్పోర్ట్స్ అకాడమీలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. మ్యాచ్కు ముందు ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. గాయకుడు యోయో హనీసింగ్, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు.
డబ్ల్యూపీఎల్ 2026లో ముంబై జట్టు పటిష్టంగా ఉంది. హర్మన్ప్రీత్ కౌర్, నాట్ సీవర్ బ్రంట్, హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, అమన్జ్యోత్, గుణాలన్ కమలినితో బ్యాటింగ్ బలంగా ఉంది. ఫాస్ట్బౌలర్ షబ్నిమ్ ఇస్మాయిల్ బౌలింగ్కు నాయకత్వం వహించనుంది. సైకా ఇషాక్ లాంటి నాణ్యమైన స్పిన్నర్ జట్టులో ఉంది. మరోవైపు బెంగళూరు టీమ్ కూడా బలంగానే ఉంది. స్మృతి మంధాన, జార్జియా వోల్, గ్రేస్ హారిస్, నదైన్ డిక్లెర్క్, రిచా ఘోష్ బ్యాటింగ్ భారం మోయనున్నారు. అయితే ఎలిస్ పెర్రీ లేకపోవడం లోటే. లారెన్, పూజ వస్త్రాకర్, అరుంధతి, డిక్లెర్క్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా.. రాధ యాదవ్, శ్రేయాంక పాటిల్ స్పిన్ విభాగంలో ఆడనున్నారు.
Also Read
- Pat Cummins: ఎస్ఆర్హెచ్ కెప్టెన్కు బీసీసీఐ బిగ్ షాక్.. ప్యాట్ కమిన్స్కు పీడకలగా మారిన అహ్మదాబాద్ మ్యాచ్!
- Ban vs Pak: బంగ్లాదేశ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన పాకిస్థాన్..
- SRH Playoff Chances: ఎస్ఆర్హెచ్ ప్లే-ఆఫ్ ఆశలు సజీవమేనా? గుజరాత్ ఓటమి తర్వాత మారిన సమీకరణాలు..
- బీచ్ లో స్థానిక ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడిన Sanju Samson.. వీడియో వైరల్
డబ్ల్యూపీఎల్లో ఇప్పటివరకు మూడు సీజన్లు జరిగగా.. ముంబై రెండు సార్లు (2023, 2025) విజేతగా నిలిచింది. 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. టోర్నీ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతుంది. 5 జట్లు ఒకదానితో ఒకటి రెండేసి మ్యాచ్లు ఆడతాయి. లీగ్ దశలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్కు చేరుకుంటాయి. టేబుల్ టాపర్ నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. రెండు, మూడో స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్లో తలపడతాయి.
తాజావార్తలు
-
RCB vs KKR: మాపై కోహ్లీ దూకుడుగా ఆడాలని కోరుకుంటున్నా.. కేకేఆర్ కోచ్ వాట్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rangasamy: ఐదవసారి పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం..!
-
Gold Sales Decline: పడిపోయిన బంగారం అమ్మకాలు.. కళకళలాడాల్సిన సమయంలో వెలవెలబోతున్న షాపులు
-
Prateek Yadav: అఖిలేష్ యాదవ్ తమ్మడు ‘ప్రతీక్ యాదవ్’ మృతి..!
-
Bomb Threat: ఆ సీఎం కార్యాలయాన్ని పేల్చేస్తాం.. ఏకంగా ముఖ్యమంత్రికే బాంబు బెదిరింపు!
ట్రెండింగ్
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!