Virat Kohli: సచిన్ రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ.. తొలి వన్డేలో సాధిస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: శ్రీలంకతో టీ20 సిరీస్కు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ వన్డే సిరీస్కు అందుబాటులోకి వచ్చాడు. ఈ నేపథ్యంలో అతడిని కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి. ముఖ్యంగా సచిన్ సెంచరీల రికార్డుపై కోహ్లీ కన్నేశాడు. సొంతగడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ప్రపంచ రికార్డు ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ సొంతగడ్డపై 164 వన్డేలలో 20 సెంచరీలు చేశాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ సచిన్ రికార్డుకు కేవలం ఒక్క సెంచరీ దూరంలో ఉన్నాడు. కోహ్లీ స్వదేశంలో 101 వన్డేల్లో 19 సెంచరీలు చేశాడు. మరో సెంచరీ చేస్తే సచిన్ వరల్డ్ రికార్డును కోహ్లీ సమం చేస్తాడు.
Read Also: Nabha Natesh: అమ్మడు వెనకపడింది అందుకేనట!
Also Read
- India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
- Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
శ్రీలంకతో వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ మరో రెండు శతకాలు బాదితే 50 ఓవర్ల ఫార్మాట్లో స్వదేశంలో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా సచిన్ను దాటిపోతాడు. అటు శ్రీలంకపై 84 మ్యాచ్లు ఆడిన సచిన్ 8 సెంచరీలు చేశాడు. అయితే విరాట్ కోహ్లి 60 మ్యాచ్లలోనే ఆ టీమ్పై 8 సెంచరీలు చేయడం విశేషం. శ్రీలంకపై విరాట్ కోహ్లీ 2220 పరుగులు చేయగా సచిన్ 3113 పరుగులతో టాప్లో ఉన్నాడు. మరోవైపు వన్డేల్లో ఆల్టైమ్ అత్యధిక పరుగులు చేసిన టాప్-5లో చేరే అవకాశం కూడా విరాట్ కోహ్లీకి ఉంది. ఇందుకోసం విరాట్ ఇంకా 180 పరుగులు చేయాల్సి ఉంది. ఈ జాబితాలో సచిన్ 18,426 పరుగులతో టాప్లో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో కుమార సంగక్కర (14,234), రికీ పాంటింగ్ (13,704), సనత్ జయసూర్య (13,430), మహేల జయవర్దనె (12,650) ఉన్నారు.
తాజావార్తలు
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
-
Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!