Kedar Jadhav : ఎంఎస్ ధోనికి ఇదే చివరి ఐపీఎల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత రెండుమూడు ఏళ్ల నుంచి ఎంఎస్ ధోని ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు కొత్త కాదు. 41 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ, వికెట్ కీపర్-బ్యాటర్ ఇప్పటికీ తను సత్తా చాటుతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో చురుకుగా ఆడుతున్నాడు. గత రెండు సంవత్సరాలుగా, ప్రతి సీజన్ అతనికి ఇదే చివరి సీజన్ అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇప్పటికే 2010, 2011, 2018 మరియు 2021లో నాలుగు IPL టైటిళ్లకు అందించాడు. కొన్ని సంచలనాత్మక బ్యాటింగ్- స్టంప్స్ వెనుక అద్భుతమైన గ్లోవ్వర్క్తో తన మనోజ్ఞతను మహేంద్ర సింగ్ ధోని చాటుతూనే ఉన్నాడు. అతను లేకుండా సీఎస్కే IPL ఆడటానికి సిద్ధంగా ఉందా అనే ప్రశ్నకు భిన్నమైన సమాధానాలు వస్తున్నాయి.
Read Also : China: రష్యా, ఉక్రెయిన్లలో ఎవరికీ ఆయుధాలు విక్రయించబోం.. చైనా కీలక ప్రకటన
Also Read
- Babar Azam: ఫామ్లోకి వచ్చిన పాకిస్థాన్ జట్టు.. బాబర్ ఆజమ్ వీర విహారం.. 191 పరుగులతో రికార్డు..
- Gautam Gambhir: మన హద్దులు దాటాలి.. శ్రీలంక టెస్ట్ సిరీస్కు ముందు టీమిండియాకు గంభీర్ వార్నింగ్
- Ajinkya Rahane: రూమ్కు రూల్.. ఎంఎస్ ధోనీ తలుపు మూసి ఉంటే అంతే..!
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
తాజాగా ఇదే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ స్పందించాడు. ఎంఎస్ ధోని వయస్సు పై బడుతుండటంతో అతనిపై ఒత్తిడి పెరుగుతుందని ఆయన వ్యాఖ్యనించారు. అయితే అతను లేకుండా సీఎస్కే జట్టు ఆడేందుకు సిద్దంగా లేదని కామెంట్స్ చేశాడు. ధోని రిటైర్మెంట్ గురించి వస్తున్న ఊహాగానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. అయితే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పడం అభిమానులకు ఇష్టం లేదని జాదవ్ అన్నాడు.
Read Also : Twitter: ట్విట్టర్ యూజర్లకు మస్క్ బంపరాఫర్.. ఇలా సంపాదించుకోండి..!
అయితే మహేంద్ర సింగ్ వయస్సు పెరుగుతుండంతో అతను శరీరం సహకరించకపోవచ్చు.. ఐపీఎల్లో ధోనికి ఇది చివరి సంవత్సరం అని నేను భావిస్తున్నాను అని కేదార్ జాదవ్ అన్నాడు. ధోనికి కొన్ని నెలల్లో ( జూలై 7కి ) 42 ఏళ్లు నిండుతాయి అని కేదార్ జాదవ్ అన్నారు. అందుకోసం తన నిర్ణయం తొందరలోనే ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. ధోని లేని సీఎస్కే జట్టు ఎలా ఉండబోతుంది అనేది వేచి చూడాలని కేదార్ జాదవ్ పేర్కొన్నాడు. 2008లో IPL ప్రారంభ సీజన్లో ధోని CSK ఫ్రాంచైజీలో చేరాడు. అప్పటి నుండి, అతను జట్టు నిషేధించబడిన 2016 మరియు 2017లో రెండు ఎడిషన్లను మినహాయించి, IPLలో ఎల్లప్పుడూ జట్టులో భాగంగా ఉన్నాడు. IPL 2020 నుండి తన బ్యాటింగ్ ఆర్డర్ను తగ్గించుకున్నాడు.. ఇప్పటివరకు ధోని ఈ సీజన్ లో నాలుగు మ్యాచ్లలో అతని సగటు బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 214.81గా ఉంది.

తాజావార్తలు
-
Varanasi: ఇంత పకడ్బందీగా ప్లాన్ చేసినా ఎలా లీక్ అవుతున్నాయి మైక్?
-
Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
-
Perni Nani: పోలీసులను ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటున్నారు.. ప్రభుత్వంపై పేర్ని నాని విమర్శలు
-
Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
-
Air India New CEO: దాదాపుగా పాకిస్తాన్ వెళ్లాల్సినవాడే, ఇప్పుడు ఎయిర్ ఇండియా కొత్త సీఈఓ..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!