Pakistan vs West Indies: పాక్ను చిత్తుగా ఓడించిన వెస్టిండీస్.. 35 ఏళ్ల తర్వాత సిరీస్ కైవసం!
- రికార్డు సృష్టించిన వెస్టిండీస్ జట్టు..
- పాక్ను చిత్తుగా ఓడించిన 34 ఏళ్ల తర్వాత సిరీస్ కైవసం..
- 92 పరుగులకే పాక్ను ఆలౌట్ చేసిన విండీస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan vs West Indies: వెస్టిండీస్ జట్టు రికార్డు సృష్టించింది. వన్డే సిరీస్లో పాకిస్తాన్ను చిత్తు చిత్తుగా ఓడించి 34 ఏళ్ల పగను తీర్చుకుంది. 1991 తర్వాత పాక్ పై వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ప్రస్తుతం దాయాది జట్టు వెస్టిండీస్ టూర్ లో ఉంది. 3 వన్డేల సిరీస్లో చివరి మ్యాచ్ తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో జరగ్గా.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్, నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 294 రన్స్ చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని చేధించడానికి బరిలోకి దిగిన పాక్ జట్టు పూర్తిగా కుప్పకూలింది. కేవలం 92 పరుగులకే ఆలౌట్ అయింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ సల్మాన్ ఆఘా 30 రన్స్ తో టాప్ స్కోరర్గా నిలవగా, మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు.
Read Also: Team india Cricketers: మీరు హద్దు దాటొద్దు.. ప్రమాదం తెచ్చుకోవద్దు!
Also Read
- Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ 'వాటర్ బాయ్'గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
- 2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
- Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్కే నేరుగా హెచ్చరిక..
అయితే, ఒక దశలో 8 పరుగులకే కీలకమైన 3 వికెట్లు కోల్పోయిన పాకిస్తాన్, ఏకంగా ఐదుగురు బ్యాటర్లు సున్నా పరుగులకే ఔట్ అయ్యారు. ఓపెనర్లు సయీమ్ అయూబ్ (0), అబ్దుల్లా షఫిక్ (0), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (0), హసన్ అలీ (0), అబ్రార్ అహ్మద్ (0 – రనౌట్) అవుట్ అవ్వగా.. బాబర్ ఆజమ్ (9), హసన్ రజా (13), హుస్సేన్ తలత్ (1), మహ్మద్ నవాజ్ (23), నసీమ్ షా (6) విఫలమయ్యారు. ఇక, వెస్టిండీస్ బౌలర్లలో జేడెన్ సీల్స్ విరుచుకుపడటంతో.. 7.2 ఓవర్లలో 34 రన్స్ ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. గుడకేష్ మోతీ 2, రోస్టన్ ఛేజ్ ఒక వికెట్ తీసుకున్నారు. కాగా, బ్యాటింగ్లో వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. 94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 120 రన్స్ చేసి నాటౌట్గా నిలిచాడు. జస్టిన్ గ్రీవ్స్ 43 రన్స్ చేసి జట్టు భారీ స్కోర్ సాధించడంతో కీ రోల్ పోషించాడు. ఈ గెలుపుతో పాకిస్తాన్పై 34 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ ను గెలిచి చరిత్రలో తన పేరును వెస్టిండీస్ లఖించుకుంది.
తాజావార్తలు
-
Team India: బీసీసీఐ కార్యదర్శికి అస్వస్థత.. టీమిండియా ఫ్యూచర్ ప్లాన్ వాయిదా..
-
Hushar Pittalu : నిజమా కలా? అంటూ స్టేజ్ మీద లైవ్లో పొట్టు పొట్టు కొట్టుకున్న నటుడు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ ‘వాటర్ బాయ్’గానే.. మేనేజ్మెంట్ నిర్ణయాలపై తీవ్ర ఆగ్రహం..
-
2027 World Cup: స్టార్ ప్లేయర్లకు నో ఛాన్స్.. వరల్డ్ కప్ జట్టులో ఊహించని ట్విస్ట్..
-
Minister BC Janardhan Reddy: రూ.8,530 కోట్లతో రహదారుల అభివృద్ధి.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!