IND Vs WI: రెండో టీ20లో వెస్టిండీస్ విజయం.. 1-1తో సిరీస్ సమం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND Vs WI: సెయింట్ కిట్స్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ అదరగొట్టింది. ఎట్టకేలకు ఆ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లు కూడా ఆడకుండానే 19.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (11) కూడా విఫలమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (10) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. రిషబ్ పంత్ (24) కొన్ని మెరుపులకే పరిమితం అయ్యాడు. ఈ దశలో హార్డిక్ పాండ్యా (31 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సర్లతో 31), రవీంద్ర జడేజా(30 బంతుల్లో ఒక సిక్సర్తో 27) రాణించారు. అయితే స్వల్ప తేడాతో వీరిద్దరూ అవుటయ్యారు. అనంతరం వచ్చిన దినేష్ కార్తీక్ (7), అశ్విన్ (10) కూడా క్రీజులో ఉండలేక పెవిలియన్ బాట పట్టారు. ముఖ్యంగా వెస్టిండీస్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ 4 ఓవర్లు వేసి ఒక మెయిడెన్ సహా 6 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బతీశాడు. జాసన్ హోల్డర్ రెండు వికెట్లు పడగొట్టాడు. హోస్సెన్, జోసెఫ్ తలో వికెట్ పడగొట్టారు.
139 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన వెస్టిండీస్కు ఓపెనర్ బ్రెండన్ కింగ్ శుభారంభం అందించాడు. అతడు 52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు. కైల్ మేయర్స్(8), నికోలస్ పూరన్(14), షిమ్రాన్ హెట్మెయిర్ (6), రోవ్మన్ పొవెల్(5) విఫలమయ్యారు. అయితే చివర్లో థామస్ 19 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 31 పరుగులతో నాటౌట్గా నిలిచి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. చివరి మూడు ఓవర్లలో విండీస్ విజయానికి 27 పరుగులు అవసరం అయ్యాయి. 18వ ఓవర్ వేసిన పాండ్యా 11 పరుగులిచ్చాడు. 19వ ఓవర్ వేసిన అర్షదీప్ పావెల్ను ఔట్ చేయడంతో పాటు 6 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఆశలు రేకెత్తాయి.
Also Read
- APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
- Vaibhav's Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి... నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
- Shreyas Iyer: ఇంటి అద్దె రూ. 7.14 కోట్లు.. ముంబైలో హాట్ టాపిక్గా మారిన శ్రేయస్ అయ్యర్ కొత్త నివాసం..
- Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
Read Also: యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు
చివరి ఓవర్లో విండీస్ విజయానికి 10 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో బంతిని అందుకున్న అవేష్ ఖాన్ తొలి బంతినే నోబాల్ వేశాడు. దాంతో ఫ్రీ హిట్ అవకాశాన్ని అందుకున్న థామస్ భారీ సిక్సర్ బాదాడు. అదే జోరులో మరో బౌండరీ బాది మ్యాచ్ను ముగించాడు. దీంతో 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించడంతో ఐదు టీ20ల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. ఈ సిరీస్లో మూడో మ్యాచ్ మంగళవారం రాత్రి 8 గంటలకు జరుగుతుంది. అంతకుముందు రెండో టీ20 మ్యాచ్ లగేజీ ఆలస్యంగా గ్రౌండ్కు చేరుకున్న కారణంగా మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.
తాజావార్తలు
-
Story Board: ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ఎందుకు తగ్గుతుంది.. ప్రధాని పిలుపు పని చేసిందా?
-
APL 2026: ఉత్కంఠ పోరులో అమరావతి అద్భుత విజయం
-
Vaibhav’s Father: ‘నేల తల్లిని తాకట్టు పెట్టి… నెత్తురు పంచుకుపుట్టిన బిడ్డను క్రికెట్ శిఖరాలకు చేర్చిన నాన్న’..
-
Pentagon Lockdown: పెంటగాన్లో హై అలర్ట్.. ప్రమాదకర పదార్థాల హెచ్చరికతో లాక్డౌన్.. తరలింపు
-
Off The Record: బోధన్లో బీఆర్ఎస్కు షాక్! షకీల్ ఎక్కడ?.. క్యాడర్ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తోంది?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!