IND Vs WI: రెండో టీ20లో వెస్టిండీస్ విజయం.. 1-1తో సిరీస్ సమం
IND Vs WI: సెయింట్ కిట్స్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ అదరగొట్టింది. ఎట్టకేలకు ఆ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి వెస్టిండీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లు కూడా ఆడకుండానే 19.4 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్ (11) కూడా విఫలమయ్యాడు. శ్రేయస్ అయ్యర్ (10) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. రిషబ్ పంత్ (24) కొన్ని మెరుపులకే పరిమితం అయ్యాడు. ఈ దశలో హార్డిక్ పాండ్యా (31 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సర్లతో 31), రవీంద్ర జడేజా(30 బంతుల్లో ఒక సిక్సర్తో 27) రాణించారు. అయితే స్వల్ప తేడాతో వీరిద్దరూ అవుటయ్యారు. అనంతరం వచ్చిన దినేష్ కార్తీక్ (7), అశ్విన్ (10) కూడా క్రీజులో ఉండలేక పెవిలియన్ బాట పట్టారు. ముఖ్యంగా వెస్టిండీస్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ 4 ఓవర్లు వేసి ఒక మెయిడెన్ సహా 6 వికెట్లు తీసి టీమిండియాను దెబ్బతీశాడు. జాసన్ హోల్డర్ రెండు వికెట్లు పడగొట్టాడు. హోస్సెన్, జోసెఫ్ తలో వికెట్ పడగొట్టారు.
139 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన వెస్టిండీస్కు ఓపెనర్ బ్రెండన్ కింగ్ శుభారంభం అందించాడు. అతడు 52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో రాణించాడు. కైల్ మేయర్స్(8), నికోలస్ పూరన్(14), షిమ్రాన్ హెట్మెయిర్ (6), రోవ్మన్ పొవెల్(5) విఫలమయ్యారు. అయితే చివర్లో థామస్ 19 బంతుల్లో ఫోర్, 2 సిక్సర్లతో 31 పరుగులతో నాటౌట్గా నిలిచి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. చివరి మూడు ఓవర్లలో విండీస్ విజయానికి 27 పరుగులు అవసరం అయ్యాయి. 18వ ఓవర్ వేసిన పాండ్యా 11 పరుగులిచ్చాడు. 19వ ఓవర్ వేసిన అర్షదీప్ పావెల్ను ఔట్ చేయడంతో పాటు 6 పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఆశలు రేకెత్తాయి.
Also Read
- PSL: చివరి ఓవర్ థ్రిల్లర్.. 2 పరుగుల తేడాతో విజయం.. ఫైనల్లోకి అగుడు పెట్టిన హైదరాబాద్ జట్టు..
- Cricket Love Storie: 22 ఏళ్ల ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్.. 29 ఏళ్ల ఆ స్పోర్ట్స్ యాంకర్ మధ్య ఏం జరుగుతోంది.?
- Kyle Jamieson: 15 ఏళ్ల కుర్రాడిపై అంత ఆవేశమేంటి భయ్యా.. వైభవ్ను అవుట్ చేసి జేమీసన్ అతి.. నెటిజన్ల ఫైర్!
- RR vs DC: జస్ట్ మిస్! బ్యాట్తో కుల్దీప్ ముఖం పగులగొట్టబోయిన జడేజా.. ఒక్క క్షణం అంతా గందరగోళం!(వీడియో)
Read Also: యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు
చివరి ఓవర్లో విండీస్ విజయానికి 10 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో బంతిని అందుకున్న అవేష్ ఖాన్ తొలి బంతినే నోబాల్ వేశాడు. దాంతో ఫ్రీ హిట్ అవకాశాన్ని అందుకున్న థామస్ భారీ సిక్సర్ బాదాడు. అదే జోరులో మరో బౌండరీ బాది మ్యాచ్ను ముగించాడు. దీంతో 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ విజయం సాధించడంతో ఐదు టీ20ల సిరీస్ 1-1తో సమంగా నిలిచింది. ఈ సిరీస్లో మూడో మ్యాచ్ మంగళవారం రాత్రి 8 గంటలకు జరుగుతుంది. అంతకుముందు రెండో టీ20 మ్యాచ్ లగేజీ ఆలస్యంగా గ్రౌండ్కు చేరుకున్న కారణంగా మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది.
తాజావార్తలు
-
PSL: చివరి ఓవర్ థ్రిల్లర్.. 2 పరుగుల తేడాతో విజయం.. ఫైనల్లోకి అగుడు పెట్టిన హైదరాబాద్ జట్టు..
-
School Holidays: 2026-27 విద్యాసంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ విడుదల.. స్కూళ్లకు 87 సెలవులు
-
Nizamabad: పోలీస్ స్టేషన్ భవనం పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం.. కారణం ఏంటంటే?
-
Nitin Gadkari: “కులం గురించి మాట్లాడితే తన్నులు పడతాయ్”.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు!
-
Heinrich Klaasen: ఇకపై నాకు ఆడాలనే ఆసక్తి లేదు.. హెన్రిచ్ క్లాసెన్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!