Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
- ధోనీ నిర్ణయంపై సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- చెన్నై తరఫున ధోనీ నాయకత్వంలో రహానే
- స్ట్రైక్ రొటేషన్లో రహానే ఇబ్బంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virender Sehwag on MS Dhoni: భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తీసుకున్న ఓ కీలక నిర్ణయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత వన్డే జట్టులో అజింక్య రహానేకు అవకాశాలు తగ్గిపోవడానికి ధోనీ ఆలోచనలే కారణమని వెల్లడించాడు. అయితే అదే రహానే తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోనీ నాయకత్వంలో కీలక ఆటగాడిగా ఎదగడం ఆశ్చర్యకర విషయమని వీరూ పేర్కొన్నాడు.
‘భారత వన్డే జట్టులో మిడిల్ ఓవర్లలో పరుగుల వేగం పెంచడం, స్ట్రైక్ను రొటేట్ చేయడం చాలా కీలకమని ఎంఎస్ ధోనీ భావించేవాడు. అయితే అజింక్య రహానే ఆ సమయంలో స్ట్రైక్ రొటేషన్లో ఇబ్బంది పడుతున్నాడని, నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్నాడని ధోనీ భావించాడు. అందుకే అతడిని వన్డే జట్టు నుంచి తప్పించాడు’ అని వీరేంద్ర సెహ్వాగ్ వెల్లడించాడు. అయితే క్రికెట్లో పరిస్థితులు ఎంత వేగంగా మారతాయో రహానే ఉదాహరణగా నిలిచాడని వీరూ అభిప్రాయపడ్డాడు. భారత జట్టులో తన స్థానాన్ని కోల్పోయిన రహానే.. తర్వాత ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ అద్భుత ప్రదర్శనలు చేశాడు. ముఖ్యంగా 2023 సీజన్లో సీఎస్కేకు ఆడిన రహానే దూకుడైన బ్యాటింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Also Read
- Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
- Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు నమ్మకం లేదు.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
- Ben Stokes: చిరకాల సలహాదారుడిని కలుస్తున్న బెన్ స్టోక్స్.. బయపడిపోతున్న ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు!
- APL-5లో కాకినాడ కింగ్స్ శుభారంభం.. 71 పరుగుల తేడాతో వైజాగ్ లయన్స్పై భారీ విజయం.!
ఒకప్పుడు వన్డే జట్టులో నుంచి తప్పించిన ఆటగాడినే తర్వాత సీఎస్కేలో కీలక బ్యాటర్గా ఎంఎస్ ధోనీ ఉపయోగించుకోవడం ఆసక్తికర అంశమని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఇది ఆటగాడి సామర్థ్యం, పరిస్థితులకు అనుగుణంగా మారే పాత్రలపై క్రికెట్లోని ప్రత్యేకతను చూపిస్తుందని చెప్పాడు. రహానే కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ.. తన అనుభవం, నైపుణ్యంతో తిరిగి నిలదొక్కుకున్నాడు. ధోనీ నాయకత్వంలో సీఎస్కేలో అతడు చేసిన ప్రదర్శనలు అభిమానుల ప్రశంసలు అందుకున్నాయి. సెహ్వాగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ధోనీ నిర్ణయం సరైందా? లేదా రహానేకు మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిందా? అనే అంశంపై అభిమానులు చర్చిస్తున్నారు.
తాజావార్తలు
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
-
Narendra Modi : 12 ఏళ్ల పాలనపై కేంద్ర కేబినెట్ ప్రత్యేక తీర్మానం
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
ట్రెండింగ్
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!
-
Ceiling Fan Speed: సీలింగ్ ఫ్యాన్ స్పీడ్ తగ్గిందా.? కారణం ఇదే కావచ్చు.! కొత్తది కొనేముందు ఈ విషయాలు తప్పక చెక్ చేయండి.!