Virat Kohli: తాలిబాన్ లీడర్ నుంచి విరాట్ కోహ్లీకి అరుదైన అభ్యర్థన..
- విరాట్ కోహ్లీకి తాలిబాన్ లీడర్ నుంచి అరుదైన రిక్వెస్ట్..
- టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించడంపై అసంతృప్తి..
- 50 ఏళ్ల వచ్చే వరకు కోహ్లీ ఆడాలని కోరిన హనస్ హక్కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: ఆఫ్ఘనిస్తాన్ నేత, తాలిబాన్ ఉద్యమ నాయకుడు అనస్ హక్కానీ నుంచి భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అరుదైన అభ్యర్థన వచ్చింది. విద్య, క్రీడలు అంటేనే కోపగించుకునే తాలిబాన్లలో కూడా విరాట్ కోహ్లీకి ఫ్యాన్స్ ఉన్నారని ఈ ఘటన రుజువు చేస్తోంది. అనాస్ హక్కానీ కూడా క్రికెట్కు, కోహ్లీకి అభిమాని. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆకస్మిక టెస్ట్ రిటైర్మెంట్లపై హక్కానీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరిద్దరు మే 2025లో రిటైర్మెంట్ ప్రకటించారు.
Read Also: Boycott IND vs PAK: సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండింగ్లోకి బాయ్కాట్ భారత్- పాక్ మ్యాచ్
Also Read
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- T20 World Cup: గెలిస్తేనే సెమీస్ రేసులో.. లేదంటే లగేజ్ సర్దేసుకోవడమే.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..
- Team India: 94 ఏళ్ల టెస్ట్ క్రికెట్ ప్రయాణం.. నాడు లార్డ్స్ మైదానంలో ఓటమి.. నేడు ప్రపంచ నంబర్ 1 స్థానం..
- Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. 'బేబీ బాస్'ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ ప్రకటించడం తనను ఆశ్చర్యపరిచిందని, కోహ్లీ 50 ఏళ్లు వచ్చే వరకు ఆడాలని తాను కోరుకుంటున్నట్లు హక్కానీ అన్నారు. ‘‘రోహిత్ టెస్ట్ల నుండి రిటైర్మెంట్ సమర్థనీయమే. కోహ్లీ రిటైర్మెంట్ వెనుక కారణం నాకు తెలియదు. ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మంది మాత్రమే అంత ప్రత్యేకమైనవారు. అతను 50 ఏళ్లు వచ్చే వరకు ఆడటానికి ప్రయత్నించాలని నా కోరిక’’ అని హక్కానీ శుభంకర్ మిశ్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. కోహ్లీ భారత మీడియాతో నిరాశ చెందవచ్చని, అతడికి ఇంకా ఆడే సమయం ఉందని, సచిన్ టెండూల్కర్ టెస్ట్ పరుగులను జో రూట్ వెంబడించడం మీరు చూడొచ్చు అని హక్కానీ అన్నారు.
36 ఏళ్ల కోహ్లీ తన టెస్ట్ కెరీర్ను మే 12, 2025న ముగించాడు, 10,000 టెస్ట్ పరుగుల మైలురాయిని కేవలం 770 పరుగుల తేడాతో చేరుకోలేకపోయాడు. రోహిత్ శర్మ కోహ్లీకి 5 రోజుల ముందు మే7, 2025న టెస్ట్ ఫార్మాట్కు గుడ్ బై చెప్పారు. వీరిద్దరి రిటైర్మెంట్ తర్వాత టెస్ట్ కెప్టెన్సీని 25 ఏళ్ శుభమాన్గిల్కు అప్పగించారు. ప్రస్తుతం, కోహ్లీ, రోహిత్ శర్మలు కేవలం వన్డే క్రికెట్లో మాత్రమే ఆడనున్నారు. అక్టోబర్ లో భారత్ మూడు వన్డేల కోసం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తోంది. ఆ సమయంలో ఈ ఇద్దరు లెజెండరీ ప్లేయర్స్ మరోసారి మైదానంలో కనిపించనున్నారు.
Virat Kohli retired far too early, should have played till 50
Anas Haqqani@AnasHaqqani313 pic.twitter.com/MEhm63VP5o— 𝙈𝙐𝙃𝘼𝙈𝙈𝘼𝘿 𝙆𝙃𝘼𝙉 (@khan13ifad) September 13, 2025
తాజావార్తలు
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
-
Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
DOST : డిగ్రీ సీట్లకు డిమాండ్ డౌన్.. ప్రభుత్వ కాలేజీలకే క్రేజ్.!
-
Ketan Agarwal Case: సియా తండ్రికి గుండెపోటు.. కూతురిని ఉరితీయాలని ప్రకటన
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!