Virat Kohli: గంగూలీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్.. ఏం చేశాడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Gives Return Gift To Sourav Ganguly: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు & ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మధ్య చాలాకాలం నుంచి విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే! కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించినప్పుడు మొదలైన వీరి మధ్య గొడవ.. క్రమంగా ముదురుతూ వస్తోంది. రీసెంట్గా ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు వెలుగుచూసిన పరినామాల నేపథ్యంలో.. వీరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గంగూలీకి కోహ్లీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..
Yo Yo Honey Singh: హీరోయిన్తో డేటింగ్.. రెడ్హ్యాండెడ్గా బుక్.. వీడియో వైరల్
Also Read
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- IND Vs ENG: తిలక్ వర్మ మెరుపులు.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్..
- Tilak Varma: తిలక్ వర్మ అవుటా..? నాటవుటా..? పెవిలియన్ వైపు వెళ్లిన తిలక్ వర్మ మళ్లీ బ్యాటింగ్కు ఎందుకు వచ్చాడు..?
చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగినప్పుడు.. గంగూలీ వైపు కోహ్లీ పలుమార్లు గుర్రుగా చూశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్లందరూ షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలో.. కోహ్లీకి గంగూలీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే ముందుకు దాటేశాడు. ఆ టైంలో కోహ్లీ మరో ప్లేయర్తో మాట్లాడుతున్నట్టుగా మనం గమనించవచ్చు. గంగూలీ తన కోసం వెయిట్ చేయకుండా అలా ముందుకు వెళ్లిపోవడంతో.. కోహ్లీ అతనివైపు మరోసారి గుర్రుగా చూసినట్టు చూసి వెళ్లిపోయాడు. బహుశా తనకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదనే కోపమో ఏమో తెలీదు కానీ.. లేటెస్ట్గా కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో గంగూలీని అన్ఫాలో చేశాడు. అయితే.. గంగూలీ మాత్రం కోహ్లీని ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాడు. మరి, ఇందుకు గంగూలీ ఎలా సమాధానం ఇస్తాడా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Live-In Relationship: భర్తతో విడాకులు.. డ్రైవర్తో సహజీవనం.. కట్ చేస్తే..
ఇదిలావుండగా.. ఏప్రిల్ 15వ తేదీన డీసీ, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే! తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ (50) అర్థశతకంతో చెలరేగాడు. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులకే పరిమితం అయ్యింది. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో, ఢిల్లీ బ్యాటర్లు చతికిలపడ్డారు. ఆర్సీబీ బౌలర్లలో వైశాక్ విజయ్ కుమార్ 4 ఓవర్లలో 20 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!