Virat Kohli: గంగూలీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్.. ఏం చేశాడో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Gives Return Gift To Sourav Ganguly: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు & ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ మధ్య చాలాకాలం నుంచి విభేదాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే! కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించినప్పుడు మొదలైన వీరి మధ్య గొడవ.. క్రమంగా ముదురుతూ వస్తోంది. రీసెంట్గా ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు వెలుగుచూసిన పరినామాల నేపథ్యంలో.. వీరి మధ్య వివాదం తారాస్థాయికి చేరుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గంగూలీకి కోహ్లీ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..
Yo Yo Honey Singh: హీరోయిన్తో డేటింగ్.. రెడ్హ్యాండెడ్గా బుక్.. వీడియో వైరల్
Also Read
- INDW Vs PAKW: పాక్ బౌలర్లను ఉతికి ఆరేసిన స్మృతి.. టీ20 వరల్డ్కప్లో అరుదైన రికార్డు..
- Women's T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
- Gurnoor Brar: ఒత్తిడి కాదు.. ఉత్సాహం.. ఎండలో పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కిందన్న యువ పేసర్..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగినప్పుడు.. గంగూలీ వైపు కోహ్లీ పలుమార్లు గుర్రుగా చూశాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్లందరూ షేక్ హ్యాండ్ ఇస్తున్న సమయంలో.. కోహ్లీకి గంగూలీ షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే ముందుకు దాటేశాడు. ఆ టైంలో కోహ్లీ మరో ప్లేయర్తో మాట్లాడుతున్నట్టుగా మనం గమనించవచ్చు. గంగూలీ తన కోసం వెయిట్ చేయకుండా అలా ముందుకు వెళ్లిపోవడంతో.. కోహ్లీ అతనివైపు మరోసారి గుర్రుగా చూసినట్టు చూసి వెళ్లిపోయాడు. బహుశా తనకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదనే కోపమో ఏమో తెలీదు కానీ.. లేటెస్ట్గా కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో గంగూలీని అన్ఫాలో చేశాడు. అయితే.. గంగూలీ మాత్రం కోహ్లీని ఇంకా ఫాలో అవుతూనే ఉన్నాడు. మరి, ఇందుకు గంగూలీ ఎలా సమాధానం ఇస్తాడా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Live-In Relationship: భర్తతో విడాకులు.. డ్రైవర్తో సహజీవనం.. కట్ చేస్తే..
ఇదిలావుండగా.. ఏప్రిల్ 15వ తేదీన డీసీ, ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే! తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ (50) అర్థశతకంతో చెలరేగాడు. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 151 పరుగులకే పరిమితం అయ్యింది. ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో, ఢిల్లీ బ్యాటర్లు చతికిలపడ్డారు. ఆర్సీబీ బౌలర్లలో వైశాక్ విజయ్ కుమార్ 4 ఓవర్లలో 20 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు తీశాడు.
తాజావార్తలు
-
INDW Vs PAKW: పాక్ బౌలర్లను ఉతికి ఆరేసిన స్మృతి.. టీ20 వరల్డ్కప్లో అరుదైన రికార్డు..
-
Healthy Protein Laddu: పిల్లల్లో జ్ఞాపకశక్తి, తెలివితేటలను పెంచే హెల్తీ ‘ప్రోటీన్ లడ్డు’.. ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసేయండి!
-
Ship sink: ఒమన్ తీరంలో మునిగిన షిప్.. 14 మంది భారతీయులకు తప్పిన ప్రమాదం..
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!