మూడో టెస్టుకు జట్టు కూర్పుపై కోహ్లీ క్లారిటీ
దక్షిణాఫ్రికాతో కేప్టౌన్ వేదికగా మంగళవారం నుంచి జరగనున్న మూడో టెస్టులో టీమిండియా తలపడనుంది. ఇరు జట్లకు ఇది కీలకమైన టెస్ట్ మ్యాచ్. ఇందులో గెలిచిన జట్టుకు సిరీస్ సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టు కూర్పుపై క్లారిటీ ఇచ్చాడు. కేప్టౌన్ టెస్టుకు తాను సిద్ధంగా ఉన్నానని… ఫిట్నెస్ కూడా ఉందని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. అయితే రెండో టెస్టులో గాయపడ్డ సిరాజ్… మూడో టెస్టుకు సిద్ధంగా లేడని కోహ్లీ స్పష్టం చేశాడు.
Read Also: సంచలన నిర్ణయం తీసుకున్న సచిన్.. నిరాశలో అభిమానులు
Also Read
- Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
- Virat Kohli: ఆకాశమే హద్దుగా కోహ్లీ రికార్డుల వేట.. ఐపీఎల్లో ఈ ఘనత సాధించిన ఏకైక ప్లేయర్ విరాట్..
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
మరోవైపు పేలవ ఫామ్లో ఉన్న రిషబ్ పంత్తో తాము మాట్లాడామని.. పంత్ తన తప్పులు తెలుసుకుంటాడని కోహ్లీ విశ్వాసం వ్యక్తం చేశాడు. కెరీర్లో ఎదుగుతున్న దశలో ప్రతి ఒక్కరూ తప్పుచేసిన వాళ్లమేనని… పంత్ కూడా తన తప్పు తెలుసుకుని సరిదిద్దుకుంటాడన్నారు. అటు సీనియర్లు పుజారా-రహానే జట్టుకు కీలకమని వ్యాఖ్యానించాడు. శతకాల నిరీక్షణ గురించి కూడా విరాట్ కోహ్లీ నోరువిప్పాడు. తన కెరీర్లో ఇలాంటి దశను ఎదుర్కోవడం ఇదేమీ కొత్త కాదన్నాడు. 2014లో ఇంగ్లండ్ పర్యటనలోనూ తనకు చేదు అనుభవం ఎదురైందని… ఆటలో కొన్నిసార్లు తాము ఆశించినట్లు జరగదన్నాడు. జట్టుకు అవసరమైనప్పుడు ఓ బ్యాట్స్మెన్గా తాను ఎన్ని భాగస్వామ్యాలు నెలకొల్పానన్నదే ముఖ్యమని విరాట్ కోహ్లీ వివరించాడు. కాగా విరాట్ కోహ్లీ చివరగా 2019లో సెంచరీ చేశాడు. 2020, 2021 సంవత్సరాల్లో కోహ్లీ ఒక్క సెంచరీ కూడా కొట్టలేదు.
తాజావార్తలు
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
-
PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
-
CM Revanth Reddy: కాళేశ్వరం ప్రాజెక్ట్పై సీబీఐ విచారణకు ఒత్తిడి పెంచాలి.. మంత్రులకు సీఎం సూచన..
-
Bhuvneshwar Kumar: విమర్శకులకు వికెట్లతో సమాధానం.. భువనేశ్వర్ గణాంకాలు చూస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే..
-
Mohini: దర్శకుడి బలవంతం.. భర్తే చేతబడి చేయించాడు ‘ఆదిత్య 369’ నటి మోహిని కన్నీటి గాథ!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!