BCCI: హెడ్ కోచ్పై ముగ్గురు సీనియర్ ప్లేయర్స్ దాడి, నుదిటిపై 20 కుట్లు.. చర్యలకు సిద్దమైన బీసీసీఐ!
- హెడ్ కోచ్ ఎస్.వెంకటరామన్పై దాడి
- కోచ్పై ముగ్గురు స్థానిక క్రికెటర్లు దాడి
- ఆటగాళ్లపై చర్యలకు సిద్దమైన బీసీసీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాండిచ్చేరి క్రికెట్ అసోసియేషన్ (సీఏపీ) అండర్-19 హెడ్ కోచ్ ఎస్.వెంకటరామన్పై దాడి జరిగింది. సోమవారం ముగ్గురు స్థానిక క్రికెటర్లు కోచ్పై దాడి చేశారు. దాడిలో కోచ్ వెంకటరామన్ తలకు గాయం కాగా.. భుజం విరిగిందని సేదరపేట పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ ఎస్.రాజేష్ ధ్రువీకరించారు. వెంకటరామన్ నుదిటిపై 20 కుట్లు పడ్డాయని, ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న జాతీయ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ నుంచి ఆటగాళ్లను తొలగించడమే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.
ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. పుదుచ్చేరి స్థానిక క్రికెటర్లకు దేశీయ మ్యాచ్లలో సీఏపీ అధికారులు తగిన అవకాశాలను ఇవ్వడం లేదు. నకిలీ జనన, విద్య ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్ చిరునామాలతో బయటి క్రికెటర్లను స్థానికులుగా ఆడిస్తున్నారు. 2021 నుంచి రంజీ ట్రోఫీలో కేవలం ఐదుగురు స్థానిక ప్లేయర్స్ మాత్రమే పుదుచ్చేరికి ప్రాతినిధ్యం వహించారు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ 2025లో అవకాశం ఇవ్వకపోవడంతో ముగ్గురు సీనియర్ ఆటగాళ్లు వెంకటరామన్పై బ్యాట్తో దాడి చేశారు. ఈ దాడిపై బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా మాట్లాడుతూ.. ‘పాండిచ్చేరి కోచ్పై దాడి జరిగినట్లు తెలిసింది. బీసీసీఐ త్వరలో దర్యాప్తు చేస్తుంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు.
Also Read
- Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
- India vs Ireland T20: అరంగేట్రంలోనే టీమిండియాకు షాకిచ్చిన ఐర్లాండ్ బౌలర్.. ఎవరీ మాథ్యూ హోలార్డ్..?
- Abhishek Sharma: మ్యాచ్ ఓడినా వరల్డ్ రికార్డ్ సృష్టించిన కాటేరమ్మకొడుకు.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్గా ఘనత..
తనపై జరిగిన దాడిపై కోచ్ వెంకటరామన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘డిసెంబర్ 8న, ఉదయం 11 గంటలకు నేను సీఏపీ క్యాంపస్లో ఇండోర్ నెట్స్లో ఉన్నాను. పాండిచ్చేరి సీనియర్ క్రికెటర్లు కార్తికేయన్ జయసుందరం, ఎ.అరవిందరాజ్, ఎస్.సంతోష్ కుమరన్ వచ్చి నాతో దుర్భాషలాడడం ప్రారంభించారు. సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీ జట్టుకు ఎందుకు ఎంపిక చేయలేదని వాగ్వాదం పెట్టుకున్నారు. అరవిందరాజ్ నన్ను పట్టుకున్నాడు. కార్తికేయన్, సంతోష్ బ్యాట్తో నాపై దాడి చేశారు. జట్టులో అవకాశం రావాలంటే తనను కొట్టమని భారతీదాసన్ పాండిచ్చేరి క్రికెటర్స్ ఫోరం కార్యదర్శి జి. చంద్రన్ చెప్పాడని వారు నాతో చెప్పారు’ అని ఫిర్యాదులో కోచ్ వెంకటరామన్ పేర్కొన్నారు. ఈ సంఘటనపై స్పందించడానికి సీఏపీ నిరాకరించింది.
తాజావార్తలు
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
-
CM Chandrababu : మార్కాపురం జిల్లా హామీని నిలబెట్టుకున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసమే కూటమి ఏర్పాటు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!