RCB vs CSK: ధోనీ చేసిన పెద్ద తప్పు.. థర్డ్ అంపైర్ నిర్లక్ష్యం.. ఆర్సీబీకి అన్యాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Third Umpire Ignore MS Dhoni Big Mistake in RCB vs CSK Match: టీమిండియా మాజీ సారథి, ప్రస్తుత సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ కీపింగ్ విషయంలో ఎంత ప్రావీణ్యుడో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. బ్యాటర్ను దాటి బంతి తన చేతికి దొరికిందంటే చాలు.. కనురెప్పపాటులోనే బెయిల్స్ ఎగిరిపోతాయి. తన కీపింగ్ స్కిల్స్తో ధోనీ ఎన్నో మ్యాచెస్ని మలుపు తిప్పాడు. అలాంటి ధోనీ.. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో చాలా పెద్ద తప్పు చేశాడు. దాన్ని థర్డ్ అంపైర్ కూడా గుర్తించకపోవడంతో.. నెట్టింట్లో అది చర్చకు దారితీసింది. ఆర్సీబీకి తీవ్ర అన్యాయం జరిగిందంటూ.. అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ తప్పేంటంటే..
పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయిన హీరోయిన్లు ఎవరో తెలుసా..?
Also Read
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
- Surya Kumar Yadav: పరుగులు లేవు కానీ 'స్టాండప్ కామెడీ'.. మాటలతో కాలం వెళ్లదీసి టీమిండియాకు దూరమైన సూర్య..
- FIFA 2026 Last Chance: మెస్సీ, రొనాల్డోతో పాటు.. ఆ 14 మంది దిగ్గజాలకు ఇదే ఆఖరి వరల్డ్ కప్..
- IND Vs AFG: అదరగొట్టిన భారత బ్యాటర్లు.. తొలిరోజే రెండు సెంచరీలు..

15వ ఓవర్లో జడేజా వేసిన ఐదో బంతిని ఆర్సీబీ బ్యాటర్ కార్తిక్ ఆడేందుకు ప్రయత్నించగా.. అది మిస్ అయి, వెనుక ఉన్న ధోనీ చేతిలోకి వెళ్లింది. అప్పుడు ధోనీ వెంటనే బెయిల్స్ ఎగరగొట్టాడు. ఇది ఔటో, కాదో తేల్చేందుకు.. థర్డ్ అంపైర్ను ఫీల్డ్ అంపైర్ ఆశ్రయించగా, అది నాటౌట్గా తేలింది. ఇక్కడే థర్ట్ అంపైర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ధోనీ చేసిన అది పెద్ద తప్పును వదిలేశాడు. ఇంతకీ ఆ తప్పేంటంటే.. ధోనీ ఆ బంతిని ‘స్టంప్ లైన్’కి ముందే అందుకోవడం. నిబంధనల ప్రకారం.. స్టంప్ లైన్ని పాస్ అయిన తర్వాతే బంతిని కీపర్ అందుకోవాలి. ఒకవేళ ఈ నిబంధనని ఉల్లంఘిస్తే.. దానిని నో-బాల్గా పరిగణిస్తారు. ఇక్కడ ధోనీ ఆ బంతిని స్టంప్లైన్ ముందే తీసుకోవడం చాలా స్పష్టంగా కనిపించింది. కానీ.. థర్డ్ అంపైర్ మాత్రం ఈ విషయాన్ని గమనించలేదు. దీంతో.. ఆర్సీబీకి నోబాల్ అవకాశం మిస్ అయింది.
Heatwave in India: దేశంలో అత్యంత వేడిగా ఉండే నగరాలు ఇవే !
ఒకవేళ థర్ట్ అంపైర్ ఆ విషయాన్ని గమనించి ఉంటే.. ఆర్సీబీ ఖాతాలోకి నో-బాల్ వచ్చి ఉండేది. అప్పుడు పరిస్థితులు తప్పకుండా వేరేలా ఉండేవి. ఎందుకంటే.. అప్పటికే కార్తిక్ మంచి జోష్లో ఉన్నాడు. పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. అలాంటప్పుడు నో-బాల్ ఛాన్స్ వచ్చి ఉంటే.. ఒక బంతి ఎక్స్ట్రాగా వచ్చేది. తద్వారా ఫలితాల్లో మార్పులు వచ్చి ఉండేవి. కానీ.. థర్ట్ అంపైర్ ధోనీ చేసిన తప్పును గమనించకపోవడంతో ఆర్సీబీ అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. ‘‘థర్డ్ అంపైర్ సీఎస్కే తరపున అనుకూలంగా ఉన్నట్టున్నాడు.. అందుకే నోబాల్ ఇవ్వలేదు. ఒకవేళ ఇచ్చుంటే కచ్చితంగా ఆర్సీబీ గెలిచి ఉండేది’’ అంటూ మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
Off The Record : కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
-
Vignesh Shivan : నయనతార భర్త విఘ్నేశ్ శివన్ నా ఆఫీసులో మూడేళ్లు పనిచేశాడు.. ఆ రూమర్లపై నటి సోనా షాకింగ్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!