Commonwealth Games 2002: గేమ్స్ కోసం వెళ్లి.. మాయమైన 10 మంది లంక అథ్లెట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ten Sri Lankan Athletes Missing From Commonwealth Games 2022: బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఓ అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. పతకాలు తీసుకురావాల్సిన 10 మంది శ్రీలంకన్ ఆటగాళ్లు.. గేమ్స్ మధ్యలోనే అదృశ్యమయ్యారు. ఈ క్రీడల్లో పాల్గొనేందుకు శ్రీలంక నుంచి మొత్తం 110 మంది (50 మంది పురుషులు, 60 మంది మహిళలు) వెళ్లగా.. అందులో నుంచి నలుగురు కనిపించకుండా పోయారని శ్రీలంక ప్రతినిధులు తెలిపారు. అథ్లెట్లతో పాటు పలువురు అధికారులు కూడా తప్పిపోయినట్లు తెలిసింది.
ఈ సమాచారం అందుకున్న బర్మింగ్హామ్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే ముగ్గురు అథ్లెట్లను వెతికి పట్టుకున్నారు. అయితే.. వాళ్లను ఎక్కడ ఉంచారన్న విషయం మాత్రం ఇంకా వెల్లడించలేదని లంక ప్రతినిధులు పేర్కొన్నారు. మాయమైన అథ్లెట్లకు ఆరు నెలల పాటు వీసాలున్నాయి. వీళ్లంతా తమ బ్యాగుల్ని క్రీడా రంగంలోనే వదిలి వెళ్లిపోయారు. తాము ఎక్కడికి వెళ్లిపోయామన్న ఆనవాళ్లు కనిపించకుండా ఉండేందుకే, ఆ అథ్లెట్లు ఇలా బ్యాగుల్ని సైతం వదిలి వెళ్లినట్లు అర్థమవుతోంది. అయినా.. పతకాల కోసం వెళ్లిన ఆటగాళ్లు, ఎందుకిలా చేశారు? శ్రీలంకలో నెలకొన్న సంక్షోభమే అందుకు కారణం.
Also Read
- IND vs ENG 2nd ODI: వన్డే సిరీస్పై కన్నేసిన టీమిండియా.. నేడు రెండో వన్డే.! పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ XI, మ్యాచ్ వివరాలు ఇవే..!
- Lionel Messi: 39 ఏళ్ల మెస్సీ.. మరో చరిత్రకు అడుగు దూరంలో.. గోల్డెన్ బూట్ గెలుస్తాడా?
- Lionel Messi:19ఏళ్ల క్రితం మెస్సీ చేతుల్లో పెరిగిన బుడతడు.. ఇప్పుడు ప్రపంచకప్ ఫైనల్లో అతడికే సవాల్ విసురుతున్న చిచ్చరపిడుగు!
- Argentina vs England 2026: ఇంగ్లాండ్పై అర్జెంటీనా సంచలన విజయం.. వరుసగా రెండోసారి ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లోకి
ప్రస్తుతం శ్రీలంక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలిసిందే! రాజకీయ, ఆర్థిక సంక్షోభాల కారణంగా.. అక్కడి ప్రజలు ఒక్కపూట తిండి దొరక్క నానా అవస్థలు పడుతున్నారు. ఈ కారణంగానే.. స్వదేశానికి వెళ్లి తిండి కోసం తిప్పలు పడటం కన్నా, యూకేలోనే ఉండిపోయి ఏదో ఒక పని చేసుకోవడం మిన్న అనుకొని మాయమైనట్టు తెలుస్తోంది. అయితే.. అదృశ్యమైన ఆ పది మంది ఆటగాళ్ల జాబితా ఎక్కడుందనేది ఆసక్తిగా మారింది. కాగా.. కామన్వెల్త్ గేమ్స్లో శ్రీలంక ఒక రజతం, మూడు కాంస్యాలతో మొత్తంగా 4 పతకాలు సాధించింది. గత నెల 28న ప్రారంభమైన కామన్వెల్త్ గేమ్స్.. ఆగస్టు 8వ తేదీన ముగిశాయి.
తాజావార్తలు
-
Guntur: కన్న కొడుకును చంపిన తల్లిదండ్రులు.!
-
Windfall Tax: పెట్రోల్-డీజిల్, ఏటీఎఫ్పై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈ పన్ను అకస్మాత్తుగా పెంపు
-
The Paradise Rights : ప్యారడైజ్ రైట్స్ కోసం రూ. 110 కోట్లు అఫర్ చేసిన దిల్ రాజు.. పుకార్లు నమ్మొద్దన్న నిర్మాత
-
Bonalu: నేటి నుంచి ఆషాఢ బోనాల సందడి షురూ.. గోల్కొండ జగదాంబిక అమ్మవారితో వైభవంగా బోనాల ఆరంభం..!
-
Dhanush – Anirudh : ధనుష్ – అనిరుధ్ మధ్య ఫ్రెండ్షిప్ చెడిందా..?
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!