BCCI Trolls: పర్ఫామెన్స్కు విలువ లేదా?.. సిఫార్సుల ద్వారానే ఛాన్స్లు.. టీమిండియా ఎంపికలపై విమర్శలు!
- టీ20ల్లో టీమిండియా వరుస పరాజయాలు
- ఐర్లాండ్పై రెండు, ఇంగ్లండ్పై మూడు టీ20ల్లో ఓటమి
- టీమిండియా ఎంపికలపై విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Selection Debate: టీమిండియా గత 5-6 టీ20ల్లో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఐర్లాండ్పై రెండు, ఇంగ్లండ్పై మూడు టీ20ల్లో భారత్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఎంపికపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఆటగాళ్ల ఎంపికలో ప్రతిభ కంటే వ్యక్తిగత అనుబంధాలు, లాబీయింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నారంటూ అభిమానులు, నెటిజన్లు.. బీసీసీఐ, సెలెక్టర్లపై విమర్శలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వైరల్ పోస్టులో టీమిండియా ఆటగాళ్ల ఎంపికపై నెటిజెన్స్ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ మద్దతు కారణంగా అవకాశం దక్కిందని, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అతని వయస్సు కారణంగా ప్రత్యేక ప్రాధాన్యం లభించిందని నెటిజెన్స్ పేర్కొన్నారు. ఇషాన్ కిషన్ మాత్రం దేశవాళీ క్రికెట్లో రాణించి తిరిగి భారత జట్టులోకి వచ్చిన ఏకైక ఆటగాడని అభిప్రాయపడ్డారు. శ్రేయస్ అయ్యర్ దేశవాళీ క్రికెట్తో పాటు ఐపీఎల్లో అద్భుత ప్రదర్శన కనబర్చి జట్టులో చోటు సంపాదించాడని పేర్కొన్నారు. శివమ్ దూబేను స్పిన్ బౌలర్లపై భారీ షాట్లు ఆడగలడనే ఉద్దేశంతో ఎంపిక చేసినా.. స్పిన్ బౌలింగ్కే బలవుతున్నాడని విమర్శించారు. తిలక్ వర్మ ఎంపిక వెనుక రోహిత్ శర్మ మద్దతు, ముంబై లాబీ ప్రభావం ఉందని ఆరోపించారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
- SKY: సూర్యకుమార్ యాదవ్ 36వ పుట్టినరోజు.. 'మిస్టర్ 360' అరుదైన రికార్డుల ప్రయాణం ఇలా..
- Asia Cup Trophy Row: అది ప్లేయర్స్ నిర్ణయం కాదు.. బీసీసీఐది!
- Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
అక్షర్ పటేల్కు 2024 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆడిన కీలక ఇన్నింగ్స్, ఫీల్డింగ్ కారణంగా అవకాశాలు కొనసాగుతున్నాయని.. వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతు కారణమని ఆ పోస్టులో నెటిజెన్స్ పేర్కొన్నారు. భారత క్రికెట్లో ప్రస్తుతం ప్రదర్శన కంటే ఇతర అంశాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. రజత్ పాటీదార్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ ప్రస్తుత టీ20 జట్టులోని చాలా మంది ఆటగాళ్ల కంటే మెరుగైన ప్రదర్శన చేయగలరని అభిప్రాయపడ్డారు. ఇషాన్, శ్రేయాస్ మాత్రమే అద్భుత ప్రదర్శనతో జట్టులో చోటు సంపాదించారని ఫాన్స్ పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!