Team India: వెస్టిండీస్ చేరుకున్న టీమిండియా.. ఎల్లుండి నుంచి వన్డే సిరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India Reached West indies: టీమిండియా వరుసబెట్టి సిరీస్ల మీద సిరీస్లు ఆడుతోంది. ఇటీవల ఇంగ్లండ్తో టెస్ట్, వన్డే, టీ20 సిరీస్లు ఆడిన టీమిండియా వచ్చే శుక్రవారం నుంచి వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్లో తలపడనుంది. ఈ మేరకు బుధవారం సాయంత్రం భారత జట్టు వెస్టిండీస్ చేరుకుంది. పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో జరిగే తొలి వన్డే కోసం జట్టు ట్రినిడాడ్ చేరిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. సీనియర్ క్రికెటర్లంతా ఈ సిరీస్కు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ పర్యటనలో వన్డే జట్టుకు శిఖర్ ధావన్ నాయకత్వం వహించనున్నాడు.
Read Also: అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్మన్లు
Also Read
- WTC Final 2027: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ వేదిక, తేదీలు ఖరారు.!
- Yuvraj Singh: 2027 వరల్డ్కప్కు యువరాజ్ జట్టు ఇదే.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లకు దక్కని చోటు!
- Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
- Yuvraj Singh: "శాంతియుత పరిష్కారమే మార్గం".. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
ఈనెల 22న భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. ఈనెల 24న రెండో వన్డే, ఈ నెల 27న మూడో వన్డే జరగనున్నాయి. వన్డేలన్నీ పోర్ట్ ఆఫ్ స్పెయిన్లోనే జరుగుతాయి. అనంతరం రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ సారథ్యంలో వెస్టిండీస్తో టీమిండియా ఐదు టీ20లు ఆడనుంది. వన్డే సిరీస్లో రోహిత్, కేఎల్ రాహుల్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడంతో టీమిండియా కెప్టెన్ శిఖర్ ధావన్కు జతగా రుతురాజ్ గైక్వాడ్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. అయితే రుతురాజ్కు ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్ నుంచి తీవ్ర పోటీ ఉండనుంది. వికెట్ కీపర్గా ఇషాన్కు జట్టులో చోటు ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ మరో వికెట్ కీపర్ సంజూ శాంసన్ను జట్టులోకి తీసుకుంటే మాత్రం ఇషాన్ కిషన్ బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుంది.
BCCI Latest Tweet:
Trinidad – WE ARE HERE! 👋😃#TeamIndia | #WIvIND pic.twitter.com/f855iUr9Lq
— BCCI (@BCCI) July 20, 2022
తాజావార్తలు
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
-
CM Chandrababu : భూములకు బ్లాక్చెయిన్ రక్షణ.. ఏపీలో కొత్త వ్యవస్థ ప్రారంభం
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?