IND vs SA 1st ODI: రేపే సౌతాఫ్రికాతో భారత్ తొలి వన్డే.. తుది జట్టు ఇదే!
- రేపే దక్షిణాఫ్రికాతో భారత్ తొలి వన్డే మ్యాచ్..
- రాంచీ వేదికగా సఫారీ టీంతో టీమిండియా ఫైట్..
- వన్డే సిరీస్ గెలిచి పరువు నిలబెట్టుకోవాలని చూస్తున్న టీమిండియా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vs SA 1st ODI: స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్ను 2-0 తేడాతో టీమిండియా కోల్పోయింది. ఇప్పుడు అదే జట్టుతో 3 వన్డేల సిరీస్కు భారత్ సిద్ధం అవుతోంది. రేపు (నవంబర్ 30న) రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియంలో మొదటి వన్డే జరగనుంది. అయితే, గాయంతో శుభ్మన్ గిల్ ఈ సిరీస్కు దూరం కావడంతో కెప్టెన్ గా కేఎల్ రాహుల్ను టీం యాజమాన్యం ఎంపిక చేసింది. అయితే, గిల్ స్థానంలో ఎవరు ఓపెనింగ్ చేస్తారన్నది ఇప్పుడు పెద్ద చర్చ కొనసాగుతుంది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ లలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్తో పోలిస్తే జైస్వాల్ కు మెరుగైన అవకాశాలు కనిపిస్తున్నాయి. యశస్వి ఇప్పటి వరకు ఒక్క వన్డే మాత్రమే ఆడాడు.. ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన సిరీస్లో ఎంపికైనప్పటికీ ఫ్లేయింగ్ ఎలెవన్లో స్థానం లభించలేదు.
Read Also: Pakistan: పాకిస్తాన్కు ఫిన్లాండ్ షాక్.. రాయబార కార్యాలయం మూసివేత..
Also Read
- Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
- Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
అయితే, విరాట్ కొహ్లీ ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్లో తొలి రెండు మ్యాచుల్లో వరుసగా సున్నా పరుగులకే పెవిలియన్ కు చేరుకున్నప్పటికీ, మూడో వన్డేలో అర్థ శతకంతో తిరిగి ఫామ్లోకి వచ్చాడు. అతడు మూడో స్థానంలోనే బ్యాటింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది. శ్రేయస్ అయ్యార్ లేకపోవడంతో నాలుగో స్థానానికి రిషబ్ పంత్, తిలక్ వర్మ మధ్య పోటీ కొనసాగుతుంది. కెప్టెన్ రాహుల్ వికెట్ కీపర్ కావడంతో పాటు టీమ్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన తిలక్ వర్మను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాగా, 5వ స్థానంలో కెప్టెన్ రాహుల్ బ్యాటింగ్కు వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డిలలో ఎవరిని ప్లేయింగ్ ఎలెవన్లోకి తీసుకుంటారో అనేది చూడాలి.. కాగా, ఆసీస్తో సిరీస్లో కేవలం ఒక్క మ్యాచ్ ఆడిన కుల్దీప్ యాదవ్ ఈసారి సఫారీతో జరిగే 3 వన్డేలలో ఆడే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్ పేస్ దళానికి నాయకత్వం వహించనున్నారు. ప్రసిద్ధ్ కృష్ణ జట్టులో ఉన్నప్పటికీ అతడు ఫ్లేయింగ్ ఎలెవన్లో స్థానం దక్కించుకోకపోవచ్చు..
Read Also: Smriti and Palash: స్మృతి మంధాన, పలాశ్ ముచ్చల్ ఒకే ఎమోజీ.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చినట్టేనా..?
టీమిండియా ఫ్లేయింగ్ ఎలెవన్
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, కేఎల్ రాహుల్ (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్
Lights 💡
Camera 📸
Action 🎬A fun BTS sneak peek as #TeamIndia gets ready for the #INDvSA ODI series opener in Ranchi 🥳@IDFCFIRSTBank pic.twitter.com/JK2IdsxnJ8
— BCCI (@BCCI) November 29, 2025
తాజావార్తలు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
-
INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!