Team India: టీమిండియాలో భారీ మార్పులు.. సూర్యకు వీడ్కోలు, అయ్యర్కు నిరాశ!
- టీ20 ప్రపంచ కప్ 2026 తర్వాత టీమిండియాలో భారీ మార్పులు
- అంతర్జాతీయ క్రికెట్కు సూర్యకుమార్ వీడ్కోలు
- శుభ్మన్ గిల్కు కెప్టెన్సీ బాధ్యతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Major changes expected in Team India after the T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 ముగిసిన తర్వాత భారత క్రికెట్ జట్టులో కీలక మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. యువ స్టార్ బ్యాటర్ శుభ్మన్ గిల్ టీమిండియా కొత్త టీ20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం గిల్ టెస్ట్, వన్డే జట్లకు కెప్టెన్గా ఉన్నాడు. ఇప్పుడు టీ20 ఫార్మాట్ బాధ్యతలు కూడా అతనికే అప్పగించే ఆలోచనలో భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ ముందునుంచి మూడు ఫార్మాట్లలో ఒకరినే కెప్టెన్గా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం టీమిండియా టీ20 కెప్టెన్గా ఉన్న సూర్యకుమార్ యాదవ్ టీ20 ప్రపంచ కప్ 2026 అనంతరం అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే టీ20 ఫార్మాట్కు కొత్త నాయకత్వం అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ శుభ్మన్ గిల్కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ను అన్ని ఫార్మాట్లకు వైస్ కెప్టెన్గా నియమించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. జైస్వాల్ ఇప్పటికే టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదుగుతున్న నేపథ్యంలో భవిష్యత్ నాయకత్వానికి సిద్ధం చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read
- CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ
- Daniel Vettori: "పక్కా ప్లాన్తో దిగుతున్నాం".. పంజాబ్ జోరుకు బ్రేక్ వేసేందుకు SRH కోచ్ మాస్టార్ ప్లాన్!
- Axar Patel: కెప్టెన్ అక్షర్ పటెల్ బిగ్ మిస్టెక్స్.. ఏకంగా 2 పాయింట్స్ కోల్పోయిన ఢిల్లీ!
- IPL Ticket Scam Hyderabad: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ టికెట్ల స్కామ్ బట్టబయలు.. అభిమానులకు పోలీసులు హెచ్చరికలు!
మరోవైపు టీ20 కెప్టెన్ రేసులో శ్రేయాస్ అయ్యర్ పేరు కూడా వినిపించింది. ఫిట్నెస్ సమస్యలు తరచూ ఎదురవుతుండటం, ప్రధానంగా వన్డే ఫార్మాట్కే పరిమితమవుతున్న పరిస్థితి కారణంగా అతనికి కెప్టెన్సీ అవకాశాలు తగ్గినట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే టీ20 ప్రపంచ కప్ తర్వాత టీమిండియా నాయకత్వంలో పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువ ఆటగాళ్లకు బాధ్యతలు అప్పగిస్తూ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కొత్త వ్యూహం అమలు చేయాలని భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
తాజావార్తలు
-
Jana Nayagan: ‘జననాయగన్’ టైటిల్ కార్డ్తో సోషల్ మీడియా షేక్! దళపతి విజయ్ కాదు.. ఇకపై ‘తమిళనాడు సీఎం’
-
Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
-
Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
-
Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
-
Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!