IND vs PAK Shake Hands: షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న భారత్, పాకిస్తాన్ క్రికెటర్లు
- పాక్ ప్లేయర్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చిన భారత క్రికెట్ జట్టు..
- ఐసీసీ అంధుల మహిళల టీ20 వరల్డ్ కప్-2025లో ఈ ఆసక్తికర ఘటన..
- అంధుల మహిళల జట్టు తీరు పై భిన్నాభిప్రాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IND vsPAK Shake Hands: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య పూర్తిస్థాయిలో సంబంధాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. క్రికెట్లో అయితే ఇరు దేశాల టీమ్స్ కనీసం షేక్ ఇచ్చుకునే పరిస్థితి కూడా కనిపించలేదు. ఈ ‘నో హ్యాండ్ షేక్’ ఆనవాయితీని టీమిండియా స్టార్ట్ చేసింది. ఆసియా కప్-2025లో పాక్తో తలపడిన మూడుసార్లు మన దేశ ఆటగాళ్లు దాయాది ప్లేయర్స్ కి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఇదే తంతు మహిళల వన్డే వరల్డ్ కప్, నిన్న జరిగిన ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీ వరకు కొనసాగింది. అయితే, టీమిండియా అంధుల మహిళా క్రికెట్ టీమ్ మాత్రం ఈ ఆనవాయితీకి పుల్స్టాప్ పెట్టేసింది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
ఇక, ఆదివారం నాడు కొలంబో (శ్రీలంక)లో జరిగిన ఐసీసీ అంధుల మహిళల టీ20 వరల్డ్ కప్-2025లో భారత్, పాక్ పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ పాక్ను 8 వికెట్ల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. మ్యాచ్ తర్వాత భారత ప్లేయర్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ విషయం టీమిండియా క్రికెట్ సర్కిల్స్లో హాట్ టాఫిక్ గా మారింది. అన్ని విభాగాలకు చెందిన భారత జట్లు దాయాదికి చెందిన ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరిస్తే.. అంధుల జట్టు మాత్రం ఇలా చేసిందేంటని అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇదే మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరు జట్లు కెప్టెన్లు హ్యాండ్ షేక్ ఇచ్చుకోలేదు.
Read Also: Nick Jonas: వారణాసి సినిమాపై ప్రియాంక చోప్రా భర్త ఫస్ట్ రియాక్షన్ ఇదే!
అయితే, తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 135 పరుగులకే ఆలౌట్ అయింది. మెహ్రీన్ అలీ(66), బుష్రా అష్రఫ్(44) రాణించడంతో పాక్ గౌరవప్రదమైన స్కోర్ చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఫీల్డర్లు చెలరేగిపోయారు. ఏకంగా ఏడుగురిని రనౌట్ చేశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన భారత్ దాయాది నిర్దేశించిన టార్గె్ట్ ను కేవలం 2 వికెట్ల నష్టానికి 10 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ దీపికా టీసీ (45), అనెఖా దేవి (64 నాటౌట్) అద్భుతంగా ఆడి ఆడి భారత్కు గెలుపును అందించారు. ఈ టోర్నమెంట్లో భారత్కు వరుసగా ఐదో విజయం ఇది. దీంతో టీమిండియా సెమీఫైనల్కు దూసుకెళ్లింది.
Women Blind Cricket World Cup Colombo:.India women Blind won against Pakistan
Good to see Blind teams Hand shake. pic.twitter.com/jpjfM0XxFW— Sohail Imran (@sohailimrangeo) November 16, 2025
తాజావార్తలు
-
Shraddha Kapoor: శ్రద్ధా కపూర్ ‘ఈత’ సినిమాకు ఊహించని చిక్కు.. కోర్టు మెట్లు ఎక్కనున్న కుటుంబం
-
Pawan Kalyan : ఓవర్ స్పీడ్లో దూసుకెళ్తున్న OG 2
-
Team India: పసికూన ఎంత పనిచేసే.. 1050 రోజుల తర్వాత టీమిండియాకు షాక్.. అజేయ పరంపరకు బ్రేక్!
-
NBK 111 : బాలయ్య సినిమా డిసెంబర్ లేదా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్
-
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!