Mohammed Siraj: నేడు హైదరాబాద్లో మహమ్మద్ సిరాజ్ రోడ్ షో.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
- అడుగడుగునా ఘనస్వాగతం
- వాంఖడేలో ఉద్వేగభరిత వాతావరణం
- హైదరాబాద్లో సిరాజ్ రోడ్ షో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mohammed Siraj Road Show in Hyderabad Today: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన భారత జట్టు.. కాస్త ఆలస్యంగా గురువారం (జులై 4) స్వదేశానికి చేరుకుంది. 13 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడి.. స్వదేశానికి తిరిగొచ్చిన భారత జట్టుకు ఢిల్లీ నుంచి ముంబై వరకు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన అనంతరం ముంబైకి వచ్చిన టీమిండియా.. ‘వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ మూవ్మెంట్’ను ఆస్వాదించింది. భారత విజయోత్సవ ర్యాలీకి అరేబియా తీరం జన సంద్రమైంది. అభిమానులు తమ క్రికెటర్లపై పూల వర్షం కురిపిస్తూ.. భారత్ మాతాకీ జై, జయహో భారత్, వందేమాతరం నినాదాలతో హోరెత్తించారు.
విజయయాత్ర అనంతరం భారత ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి చేరుకున్నారు. అభిమానులతో స్టేడియం మొత్తం నిండిపోగా.. వేలాది మంది బయట ఉండిపోయారు. వర్షం కురుస్తున్నా కూడా ఫ్యాన్స్ స్టేడియంలోనే ఉండి తమ ఆనందాన్ని పంచుకున్నారు. భారత జట్టు స్లేడియం చేరుకున్నాక జాతీయ గీతం ఆలపించారు. ఆ సమయంలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. తమకు మద్దతుగా నిలిచిన అభిమానులకు భారత జట్టు మొత్తం స్టేడియం చుట్టూ తిరుగుతూ అభినందనలు తెలిపింది. ఇక టీ20 ప్రపంచకప్ గెలిచిన రోహిత్ సేనకు బీసీసీఐ రూ.125 కోట్ల భారీ నజరానాను అందించింది.
Also Read
- Women's T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
- IND W vs PAK W: పాకిస్థాన్ ప్లేయర్లతో కరచాలనం చేస్తారా? భారత్ కెప్టెన్ హర్మన్ప్రీత్ షాకింగ్ కామెంట్స్!
- Ind Vs Pak: ‘ఎవరితోనైనా ఓడిపోండి కానీ.. పాకిస్తాన్తో మాత్రం’.. వాచ్మెన్ మాటలపై జెమిమా షాకింగ్ కామెంట్స్
- Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్ ఎంట్రీ ఇప్పట్లో లేనట్లే..
Also Read: Virat Kohli: ఇప్పుడు ఆ ఫీలింగ్ వస్తోంది: విరాట్ కోహ్లీ
భారత జట్టు విశ్వవిజేతగా నిలవడంలో తనవంతు పాత్ర పోషించిన హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఈరోజు తన ఇంటికి రానున్నాడు. ఈ నేపథ్యంలో సిరాజ్కు గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి భాగ్యనగర అభిమానులు సిద్ధమయ్యారు. గురువారం హైదరాబాద్లో భారీ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని సిరాజ్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. ‘ముంబైలో జరిగిన విజయోత్సవ ర్యాలీని హైదరాబాద్లో రీక్రియేట్ చేస్తున్నాం. జులై 5న సాయంత్రం 5.30 గంటలకు రోడ్ షో మొదలవుతుంది. మెహిదీపట్నంలోని సరోజని ఐ హాస్పటల్ నుంచి ఈద్గా మైదానం వరకు రోడ్ షో కొనసాగుతుంది. హైదరాబాద్లో కలుద్దాం’ అని సిరాజ్ పేర్కొన్నాడు. ప్రపంచకప్లో సిరాజ్ గ్రూప్ స్టేజ్ వరకు మాత్రమే తుది జట్టులో కొనసాగాడు. విండీస్ పిచెస్ స్పిన్కు అనుకూలంగా ఉండడంతో మనోడికి చోటు దక్కలేదు. దాయాది పాకిస్థాన్పై భారత్ విజయం సాధించడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించాడు.
తాజావార్తలు
-
Ship sink: ఒమన్ తీరంలో మునిగిన షిప్.. 14 మంది భారతీయులకు తప్పిన ప్రమాదం..
-
Child Safety Tips : స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి.. పిల్లలకు ఈ 5 ‘అబద్ధాలు’ నేర్పించండి..!
-
Madhya Pradesh: ప్రాణాలు తీసిన వదంతి.. రైలు నుంచి దూకిన ప్రయాణికుల్ని ఢీకొట్టిన మరో రైలు..
-
Women’s T20 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా జట్టులో కీలక మార్పులు..
-
PM Modi: భారత్ రండి, మాతో కలిసి పని చేయండి.. మోడీ పిలుపు..
ట్రెండింగ్
-
Cleaning Hacks : పరుపు, దిండు నుంచి వాసన వస్తోందా.? ఈ ఒక్క చిట్కాతో నిమిషాల్లో ఫ్రెష్.!
-
Kitchen Tips : బియ్యాన్ని ఇలా కడగకపోతే అన్నం రుచి, ఆరోగ్యం రెండూ దెబ్బే.!
-
Rahamathullah Gurbaj: నా సెంచరీకి కారణం గౌతమ్ గంభీర్.. అఫ్గాన్ ఓపెనర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Rahmanullah Gurbaz Record: జట్టు ఓడిపోయినప్పటికీ రహ్మనుల్లా గుర్బాజ్ చరిత్ర.. క్రికెట్లోనే సరికొత్త మైలురాయి!
-
Nitish Kumar Reddy: అమ్మతో అట్లుంటది మరి.. ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆపేసిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!