T20 WC 2024 Super 8: సూపర్-8లో భారత్ వ్యూహం ఇదే: జడేజా
- జూన్ 20న అఫ్గాన్తో భారత్
- స్పిన్ను ఎదుర్కోవడం కష్టం
- తుది జట్టులో నలుగురు స్పిన్నర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravindra Jadeja About India Plans for Super Eight: టీ20 ప్రపంచకప్ 2024 సూపర్-8కు భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు యూఎస్ఏలోని డ్రాప్-ఇన్ పిచ్లపై మ్యాచ్లను ఆడిన టీమిండియా.. ఇక నుంచి బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే విండీస్లో ఆడనుంది. విండీస్ పిచ్లు బ్యాటర్లకు మాత్రమే కాదు స్పిన్నర్లకూ మంచి సహకారం అందిస్తాయి. ఇదే విషయాన్ని భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ అంగీకరించారు. మిడిల్, డెత్ ఓవర్లలో స్పిన్ ఎటాక్తో ప్రత్యర్థులను కట్టడి చేస్తాం అని వారు వెల్లడించారు.
సూపర్-8కు ముందు స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్తో రవీంద్ర జడేజా మాట్లాడుతూ… ‘విండీస్లో పిచ్లు చాలా నెమ్మదిగా, మందకొడిగా ఉంటాయి. మ్యాచ్లు అన్ని ఉదయం కావడంతో స్పిన్నర్లకు అక్కడ మంచి సహకారం లభిస్తుంది. భారత్లో మాదిరిగానే విండీస్ పిచ్లు స్పిన్ ఫ్రెండ్లీ. మిడిల్ ఓవర్లలో స్పిన్ను ఎదుర్కోవడం చాలా కష్టం. స్పిన్నర్లతో డెత్ ఓవర్లలోనూ బౌలింగ్ చేయించే అవకాశం లేకపోలేదు’ అని తెలిపాడు. భారత్ నలుగురు స్పిన్నర్లు, ఇద్దరు పెసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది.
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
Also Read: Pakistan Team: టీ20 ప్రపంచకప్ కోసం చెత్త జట్టును ఎంపిక చేశారు: పాక్ మాజీ క్రికెటర్
కుల్దీప్ యాదవ్ మాట్లాడుతూ… ‘విండీస్ పిచ్లు స్పిన్కు అనుకూలంగా ఉంటాయి. భారత్ తుది జట్టులో తప్పకుండా నలుగురు స్పిన్నర్లు ఉంటారనుకుంటున్నా. టీ20 ఫార్మాట్లో బౌలర్లకు లైన్ అండ్ లెంగ్త్ చాలా కీలకం. ఏమాత్రం గతి తప్పినా.. బ్యాటర్లు షాట్స్ ఆడేస్తారు. గతేడాది విండీస్తో టీ20 సిరీస్ ఆడిన అనుభవం నాకు కలిసొస్తుంది. అప్పటికీ, ఇప్పటికీ పిచ్ల్లో పెద్దగా తేడా లేదని అనుకుంటున్నా’ అని చెప్పాడు. గ్రూప్ దశలో ఆడని కుల్దీప్.. సూపర్-8లో ఆడే అవకాశాలు ఉన్నాయి. జూన్ 20న అఫ్గాన్తో భారత్ తలపడనుంది.
తాజావార్తలు
-
Irummudi Collections: ఒక్క అడుగు దూరంలో ‘ఇరుముడి’.. ఆ మార్క్ సాధ్యమేనా?
-
Rs 50 Lakh Bribe: రూ.50 లక్షల లంచం.. రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన తహసీల్దార్..
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!