IND vs USA: టీమిండియాకు అదనంగా ఐదు పరుగులు.. అమెరికా కొంపముంచిన ఐసీసీ కొత్త రూల్!
- ఐసీసీ కొత్త రూల్
- 60 సెకన్లలోపు మరో ఓవర్
- భారత్ ఖాతాలో అదనంగా 5 రన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Do You Know Why USA Fined 5 Runs vs India: టీ20 ప్రపంచకప్ 2024లో అసాధారణ ప్రదర్శన చేస్తున్న అమెరికా.. భారత్తో జరిగిన మ్యాచ్లోనూ అదే జోరును కొనసాగించింది. కఠినమైన న్యూయార్క్ పిచ్పై ముందుగా బ్యాటింగ్తో అదరగొట్టిన యూఎస్ఏ.. ఆపై సువర్ బౌలింగ్తో టీమిండియాని వణికించింది. ఓ దశలో అయితే మ్యాచ్పై పట్టు సాధించి.. గెలిచేలా కనిపించింది. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కొత్తగా ప్రవేశపెట్టిన ‘స్టాప్ క్లాక్’ రూల్ అమెరికా కొంపముంచింది. కొత్త రూల్ కారణంగా భారత్ ఖాతాలో 5 రన్స్ అదనంగా చేరాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..
అంతర్జాతీయ మ్యాచ్లను సకాలంలో పూర్తి చేయడం కోసం ఐసీసీ ‘స్టాప్ క్లాక్’ రూల్ను తీసుకొచ్చింది. ఓవర్ ఓవర్కు మధ్య నిమిషం మాత్రమే విరామం ఉంటుంది. అంటే.. ఒక ఓవర్ ముగిశాక తదుపరి ఓవర్ వేసేందుకు బౌలర్ 60 సెకన్ల లోపే సిద్ధమవ్వాలి. ఇన్నింగ్స్లో ఫీల్డింగ్ జట్టు మూడు సార్లు ఇలా చేయడంలో విఫలమైతే.. 5 పరుగులు పెనాల్టీ విధిస్తారు. దాంతో బ్యాటింగ్ జట్టు ఖాతాలో 5 రన్స్ చేరుతాయి. ఈ సమయాన్ని థర్డ్ అంపైర్ స్టాప్ క్లాక్ సాయంతో లెక్కిస్తారు.
Also Read
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
- World Cup: కేవలం 30 సెకన్ల మీటింగ్.. వరల్డ్ కప్ కొట్టిన భారత్.. సంచలన రహస్యం చెప్పిన కెప్టెన్..
- T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
Also Read: IND vs USA: అమెరికాపై చెమటోడ్చి నెగ్గిన భారత్.. సూపర్-8కు రోహిత్ సేన!
భారత్తో మ్యాచ్లో అమెరికా బౌలర్లు మూడుసార్లు 60 సెకన్లలోపు మరో ఓవర్ను ప్రారంభించలేదు. అప్పటికే రెండు సార్లు హెచ్చరించిన అంపైర్.. మూడోసారి 5 రన్స్ పెనాల్టీగా విధించాడు. ఛేదనలో రోహిత్ సేనకు 30 బంతుల్లో 35 పరుగులు కావాల్సి రావడంతో కాస్త ఉత్కంఠ రేగింది. కానీ 16వ ఓవర్ ఆరంభానికి ముందు.. అమెరికాకు అంపైర్ పెనాల్టీ విధించాడు. దాంతో ఒక్కసారి సమీకరణం 30 బంతుల్లో 30 పరుగులుగా మారింది. ఈ ఐదు పరుగులు టీమిండియాపై ఒత్తిడిని తగ్గించాయి. ఆపై సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే మిగతా పని పూర్తి చేశారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!