Ind vs Wi: మెరిసిన సూర్యకుమార్ యాదవ్.. మూడో టీ20లో భారత్ ఘన విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs Wi: మంగళవారం సెయింట్ కిట్స్లోని వార్నర్ పార్క్లో జరిగిన ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా జరిగిన మూడో టీ20లో సూర్య కుమార్ యాదవ్(44 బంతుల్లో 76 పరుగులు) మెరుపు హాఫ్ సెంచరీతో పాటు రిషభ్ పంత్ అజేయంగా 33 పరుగులు చేయడంతో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియాకు.. ఓపెనర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడుతూ తమ ఆటను ప్రారంభించడంతో గొప్ప ఆరంభాన్ని పొందారు. రోహిత్ భారత్కు గొప్ప ప్రారంభాన్ని అందించినా.. రెండో ఓవర్లో కండరాలు పట్టేయడంతో రిటైర్హర్ట్గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ ఓపెనర్ సూర్యకుమార్తో కలిసి ఇన్నింగ్స్ను పరుగులు పెట్టించేందుకు ప్రయత్నించాడు. భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ 26 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తమ జట్టు స్కోరును 100 పరుగుల మార్కుకు మించి తీసుకెళ్లారు. 27 బంతుల్లో 24 పరుగులు చేసిన తర్వాత అయ్యర్ను అకేల్ హోసేన్ ఔట్ చేయడంతో ఈ అద్భుతమైన భాగస్వామ్యం ఎక్కువసేపు కొనసాగలేదు. అనంతరం రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. ఇన్నింగ్స్ 14.3 ఓవర్లో, డొమినిక్ డ్రేక్స్ 44 బంతుల్లో 76 పరుగులు చేసిన సూర్యకుమార్ను ఔట్ చేయడంతో విండీస్ జట్టుకు అవసరమైన పురోగతిని అందించాడు.
135 పరుగుల వద్ద సూర్యకుమార్ యాదవ్ రెండో వికెట్ రూపంలో ఔటయ్యేసరికే భారత్ విజయం ఖరారైపోయింది. తర్వాత హార్దిక్ (4) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవకపోయినా.. దీపక్ హుడా (10 నాటౌట్)తో కలిసి పంత్ మిగతా పని పూర్తి చేశాడు. మొదట టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన విండీస్ 5 వికెట్లకు 164 పరుగులు చేసింది. కైల్ మేయర్స్ (73; 50 బంతుల్లో 8×4, 4×6) సత్తా చాటాడు. పూరన్ (22), రోమన్ పావెల్ (23), హెట్మయర్ (20) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ (2/35), హార్దిక్ పాండ్య (1/19) రాణించారు.
Also Read
- IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
- FIFA World Cup 2026 Final: స్పెయిన్ VS అర్జెంటీనా.. గెలిచేది ఎవరో చెప్పిన రొనాల్డో
- ROKO: చరిత్ర స్పష్టించిన రోహిత్, విరాట్ కోహ్లీ.. ఇంకా ఎన్ని రికార్డులు అందుకుంటారో..
- Team India: జస్ప్రీత్ బుమ్రాకు ఏమైంది.. టీమిండియాలో మూడు మార్పులు..
Common Wealth Games 2022: ఐదో రోజు అదరగొట్టిన భారత్.. ఖాతాలో 2 స్వర్ణాలు, 2 రజతాలు
అంతకుముందు వెస్టిండీస్ భారత్కు 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కైల్ మేయర్స్ అద్భుత అర్ధ సెంచరీ, చివరి ఓవర్లలో పావెల్, హెట్మయర్ కొన్ని భారీ షాట్లు ఆడి స్కోరును 160 దాటించారు. మొదట బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్కు ఓపెనింగ్ ద్వయం బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్ తమ జట్టుకు మంచి స్కోరు అందించడంతో శుభారంభం లభించింది. తర్వాత 20 పరుగుల వద్ద కింగ్ను పాండ్యా అవుట్ చేశాడు. పూరన్ అండతో మేయర్స్ ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. బౌలర్లు ఎక్కువ పరుగులు ఇవ్వకున్నా వికెట్ మాత్రం పడగొట్టలేకపోయారు. 15వ ఓవర్లో భువి తిరిగి బౌలింగ్కు వచ్చాక పూరన్ను ఔట్ చేశాడు. సెంచరీ దిశగా అడుగులేస్తున్న మేయర్స్ను కూడా అతను పెవిలియన్ చేర్చాడు. చివరిలో పావెల్, హెట్మేయర్ భారీ షాట్లు ఆడి తమ జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించారు. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ 2, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ చెరో వికెట్ తీశారు. తొలి టీ20లో భారత్ ఘనవిజయం సాధించగా.. సోమవారం రాత్రి ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో విండీస్ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ప్రస్తుతం ఈ సిరీస్లో 2-1 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది.
తాజావార్తలు
-
IND vs ENG 3rd ODI: ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత.. లార్డ్స్లో 51 ఏళ్ల రికార్డు బద్దలు..
-
Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
-
AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం.. ఆగస్టు 1 నుంచి ప్రారంభం..
-
Dreaming: మీరు చనిపోయినట్లు కల వస్తుందా? షాక్ అయ్యే నిజం ఇదే!
-
Se*xual Harassment : పోలీస్ అకాడమీలో పోకిరి.. లేడీ ట్రైనీ IPSపై లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!