Ind vs SA: మొదటి వన్డే సఫారీలదే.. సంజు శాంసన్ పోరాటం వృథా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ind vs SA: లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. తొలి వన్డేలోని సఫారీలు విజయాన్ని నమోదు చేసుకున్నారు. భారత జట్టుపై దక్షిణాఫ్రికా 9 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. మొదట టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాట్తో బరిలోకి దిగిన ప్రొటీస్ జట్టు 40 ఓవర్లకు 4 వికెట్లను కోల్పోయి 249 పరుగులు చేసి.. 250 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ముంగిట నిలిపింది. వర్షం కారణంగా మ్యాచ్ను 40 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. డేవిడ్ మిల్లర్ (75), హెన్రిచ్ క్లాసెన్ (74) అజేయ అర్ధ సెంచరీలతో దక్షిణాఫ్రికా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఐదో వికెట్ భాగస్వామ్యానికి డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసిన్ 139 పరుగులు జత చేశారు. డికాక్ ఔటైన తర్వాత దూకుడుగా ఆడిన క్లాసెన్ పరుగుల వేగం పెంచాడు. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించినా క్యాచ్లను చేజార్చడం టీమ్ఇండియా పాలిట శాపమైంది. ఫలితంగా మిల్లర్, క్లాసెన్లకు పలు దఫాలు లైఫ్లైన్లు లభించాయి.
Ind vs SA: భారత్ లక్ష్యం 250.. అర్థశతకాలు బాదిన మిల్లర్, క్లాసెన్
Also Read
- India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
- ICC: స్టార్ క్రికెటర్కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
- MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
- India U19 Squad: వారసులు వచ్చేసారు.. ఆస్ట్రేలియాతో U19 సిరీస్కు వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారులకు చోటు..!
250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 8 పరుగులకే శుభ్మన్ గిల్, శిఖర్ ధావన్ రెండు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్(19), ఇషాన్ కిషన్(20) నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినా.. సఫారీ బౌలర్ల ధాటికి నిలబడలేకపోయారు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(50) దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 37 బంతుల్లోనే అర్థశతకం బాది కొంచెం ఒత్తిడిని తగ్గించే యత్నం చేశాడు. కానీ ఎంగిడి బౌలింగ్లో వెనుదిరగక తప్పలేదు. వికెట్ కీపర్ సంజు శాంసన్ ఎంత పోరాడినా ఫలితం లేకపోయింది. సంజు శాంసన్ 63 బంతుల్లో 86 పరుగులతో రాణించాడు. శాంసన్కు తోడుగా శార్దుల్ ఠాకూర్(33) భారత అభిమానుల్లో ఆశలు చిగురించేలా చేశాడు. అనంతరం వచ్చిన కుల్దీప్ యాదవ్ వెంటనే వెనుదిరిగాడు. ఒకానొక దశలో భారత్ గెలుస్తుందనే ఆశలు చిగురించినా వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో విజయం దక్షిణాఫ్రికాను వరించింది. చివరికి దక్షిణాఫ్రికా 9పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లు లుంగి ఎంగిడి మూడు వికెట్లు, కాగిసో రబాడ 2 వికెట్ల చొప్పున తీయగా.. పార్నెల్, కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షమ్సి తలో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
Operation Sindoor: S-400లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచారులు.. ఆపరేషన్ సిందూర్పై కీలక విషయాలు
-
Nepal Floods: నేపాల్ ప్రళయంలో మాజీ కేంద్ర మంత్రి కోడలు గల్లంతు
-
Toxic First Day Collection: ‘టాక్సిక్’ బాక్సాఫీస్ బ్లాస్ట్.. ఫస్ట్ డే రూ.150 కోట్లు
-
India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
-
Nepal Floods: నేపాల్లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!