Ind vs SA: మొదటి వన్డే సఫారీలదే.. సంజు శాంసన్ పోరాటం వృథా
Ind vs SA: లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. తొలి వన్డేలోని సఫారీలు విజయాన్ని నమోదు చేసుకున్నారు. భారత జట్టుపై దక్షిణాఫ్రికా 9 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. మొదట టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాట్తో బరిలోకి దిగిన ప్రొటీస్ జట్టు 40 ఓవర్లకు 4 వికెట్లను కోల్పోయి 249 పరుగులు చేసి.. 250 పరుగుల భారీ లక్ష్యాన్ని టీమిండియా ముంగిట నిలిపింది. వర్షం కారణంగా మ్యాచ్ను 40 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. డేవిడ్ మిల్లర్ (75), హెన్రిచ్ క్లాసెన్ (74) అజేయ అర్ధ సెంచరీలతో దక్షిణాఫ్రికా స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఐదో వికెట్ భాగస్వామ్యానికి డేవిడ్ మిల్లర్, హెన్రిచ్ క్లాసిన్ 139 పరుగులు జత చేశారు. డికాక్ ఔటైన తర్వాత దూకుడుగా ఆడిన క్లాసెన్ పరుగుల వేగం పెంచాడు. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులను సంధించినా క్యాచ్లను చేజార్చడం టీమ్ఇండియా పాలిట శాపమైంది. ఫలితంగా మిల్లర్, క్లాసెన్లకు పలు దఫాలు లైఫ్లైన్లు లభించాయి.
Ind vs SA: భారత్ లక్ష్యం 250.. అర్థశతకాలు బాదిన మిల్లర్, క్లాసెన్
Also Read
- RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
- IPL 2026: ఐపీఎల్లో ఈ కెప్టెన్ల విఫలం.. నిర్ణయాలలో తడబాటు.. కుంగిపోతున్న ట్లు..!
- RCB vs GT: మొదటి ఓవర్లోనే ట్విస్ట్.. ఆ ఒక్క క్యాచ్.. మ్యాచ్నే మార్చేసింది!
- Virat Kohli: "ఆ ఇన్నింగ్స్ వల్లే నాపై ఒత్తిడి తగ్గింది.. నాకంటే చాలా బాగా ఆడాడు".. కోహ్లీ ప్రశంసల వర్షం!
250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 8 పరుగులకే శుభ్మన్ గిల్, శిఖర్ ధావన్ రెండు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్(19), ఇషాన్ కిషన్(20) నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినా.. సఫారీ బౌలర్ల ధాటికి నిలబడలేకపోయారు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్(50) దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 37 బంతుల్లోనే అర్థశతకం బాది కొంచెం ఒత్తిడిని తగ్గించే యత్నం చేశాడు. కానీ ఎంగిడి బౌలింగ్లో వెనుదిరగక తప్పలేదు. వికెట్ కీపర్ సంజు శాంసన్ ఎంత పోరాడినా ఫలితం లేకపోయింది. సంజు శాంసన్ 63 బంతుల్లో 86 పరుగులతో రాణించాడు. శాంసన్కు తోడుగా శార్దుల్ ఠాకూర్(33) భారత అభిమానుల్లో ఆశలు చిగురించేలా చేశాడు. అనంతరం వచ్చిన కుల్దీప్ యాదవ్ వెంటనే వెనుదిరిగాడు. ఒకానొక దశలో భారత్ గెలుస్తుందనే ఆశలు చిగురించినా వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో విజయం దక్షిణాఫ్రికాను వరించింది. చివరికి దక్షిణాఫ్రికా 9పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లు లుంగి ఎంగిడి మూడు వికెట్లు, కాగిసో రబాడ 2 వికెట్ల చొప్పున తీయగా.. పార్నెల్, కేశవ్ మహరాజ్, తబ్రేజ్ షమ్సి తలో వికెట్ తీశారు.
తాజావార్తలు
-
Swati Maliwal: ఆప్కు స్వాతి మాలివాల్ గుడ్బై.. రాజీనామా చేసినట్లు ప్రకటన
-
RCB: మ్యాచ్ గెలిచినా ఆర్బీబీ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్లోనే తొలి టీమ్గా..
-
Iran-US Talks: ఇస్లామాబాద్లో అసిమ్ మునీర్తో ఇరాన్ బృందం భేటీ
-
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!