Team India: పంత్కు పంచ్.. శిఖర్ ధావన్ కెరీర్ ముగిసినట్లేనా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: కొత్త ఏడాది ఆరంభంలో శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు టీమిండియా సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో రెండు సిరీస్లకు వేర్వేరు జట్లను మంగళవారం రాత్రి సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. శ్రీలంకతో టీ20 సిరీస్కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్, డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో సీనియర్లంతా టెస్టు, వన్డే ఫార్మాట్లపై ఫోకస్ పెడతారని గతంలోనే బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలో టీ20 సిరీస్కు సీనియర్ ఆటగాళ్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది.
Read Also: Largest Number of Languages: ఈ చిన్నదేశంలో 840 భాషలు మాట్లాడేస్తున్నారు
Also Read
- Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్మన్ గిల్ వరకు ఇలా..
- Team India: టీమిండియా జట్టులోకి ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లు..! ఎల్లుండే బరిలోకి..
- Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
- Saransh Jain: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో మజా లేదు.. సారాంశ్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అయితే కొంతకాలంగా టీ20లు, టెస్టులకు కాకుండా కేవలం వన్డేలకు మాత్రమే ఎంపికవుతూ సారథిగా ఆడుతున్న శిఖర్ ధావన్కు శ్రీలంకతో వన్డే సిరీస్లో చోటు దక్కలేదు. దీనికి కారణం ధావన్ ఫామ్ అనే చెప్పాలి. బంగ్లాదేశ్తో మూడు వన్డేల సిరీస్లో ధావన్ పేలవ ప్రదర్శన చేశాడు. దీంతో అతడిని సెలక్టర్లు పక్కనపెట్టారు. అసలే ఓపెనింగ్కు రోహిత్, రాహుల్, ఇషాన్ కిషన్, శుభ్మన్గిల్ వంటి ప్రతిభావంతులు పోటీలో ఉండగా ధావన్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో కూడా అతడు లేనట్లేనని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో అతడి కెరీర్కు చరమగీతం పడినట్లే భావించాలని పలువురు భావిస్తున్నారు.
అటు పరిమిత ఓవర్ల క్రికెట్లో కొన్నాళ్లుగా ఆకట్టుకోని వికెట్ కీపర్ రిషబ్ పంత్పైనా సెలక్టర్లు వేటు వేశారు. టెస్టుల్లో బాగానే ఆడుతున్నా టీ20 ప్రపంచకప్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ సిరీస్లలో రిషబ్ పంత్ పెద్దగా ఆడిందేమీ లేదు. దీంతో అతడి స్థానంలో ఫామ్లో ఉన్న ఇషాన్ కిషన్, సంజు శాంసన్లకు అవకాశం కల్పించారు. అయితే వీళ్లిద్దరిలో ఒకరికే జట్టులో చోటు దక్కే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే ఎవరిని ఆడిస్తారనేది అనుమానంగా ఉంది.
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!