భారత మహిళల జట్టు ఓపెనర్ షెఫాలీ వర్మ మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి వన్డేలో బరిలోకి దిగిన షెఫాలీ.. పిన్నవయసులోనే అన్ని ఫార్మాట్లు ఆడిన తొలి ఇండియన్ క్రికెటర్గా రికార్డు సృష్టించింది. 2019లో టీ20లలో అడుగుపెట్టిన ఈ ఎక్స్ప్లోజివ్ ఓపెనర్ ఇంగ్లండ్తో ఈ నెల 16-19 మధ్య జరిగిన ఏకైక టెస్టుతో ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసింది. అప్పటికి ఆమె వయసు 17 ఏళ్ల 150 రోజులు. ఈ టెస్టులో తొలి ఇన్సింగ్స్లో 96, రెండో ఇన్సింగ్స్లో 63 పరుగులు చేసి అరంగేట్ర టెస్టులో రెండు ఇన్సింగ్స్లలోనూ అర్ధ సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కింది. తాజాగా, జరుగుతున్న వన్డేలో బరిలోకి దిగడంతోనే మూడు ఫార్మాట్లు ఆడిన ఐదో అతిపిన్న క్రికెటర్గా రికార్డు సృష్టించింది.