IPL 2023 : వాళ్లు మమ్మల్ని భయపెట్టారు.. అందుకే ఓడిపోయాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ సారి తీవ్ర నిరాశ పరుస్తుంది. ఈ మెగా టోర్నమెంట్ లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ముంబై ఓడిపోయింది. వరుసగా రెండు మ్యాచ్ ల్లో పరాజయం పాలైన ముంబై.. పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. ఇక చెన్న సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపై ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సీఎస్కే స్పిన్నర్లు తమను కోలుకోలేని దెబ్బ కొట్టారని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్ లో భాగంగా రోహిత్ మాట్లాడుతూ.. మాకు అద్భుతమైన ఆరంభం లభించింది. అయితే మేము దానిని సద్వినియోగం చేసుకోలేదు. పిచ్ బ్యాటింగ్ కు చక్కగా అనుకూలించింది. అయితే మా ఇన్సింగ్స్ మిడిల్ ఓవర్లలో మేము వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం అని రోహిత్ శర్మ అన్నాడు.
Also Read : Hyderabad Traffic : నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ దారుల్లో వెళ్తే అంతే సంగతి..
Also Read
- BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
- APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ ఆడటం చాలా కష్టం.. నాకు నమ్మకం లేదు’.. సంచలన వ్యాఖ్యలు..
- Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
అయితే 30-40 పరుగులు తక్కువగా చేశాం.. అదే మా కొంపముంచింది. నిజం చెప్పాలంటే చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.. వారు బాగా బౌలింగ్ చేసి మమ్మల్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అటువంటి బౌలర్లపై ఎదురుదాడికి దిగాలంటే చాలా ధైర్యం కావాలన్నాడు. కానీ మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు.. వారికి అంత అనుభవం లేదు.. వారు అద్భుతంగా రాణించాలంటే కొంత సమయం పడుతుంది. మా జట్టులో యంగ్ క్రికెటర్లకు చాలా ప్రతిభ ఉంది.. కాబట్టి మా జట్టు ఎల్లప్పడూ వారికి మద్దతుగా నిలుస్తుంది. అయితే కొంతమంది సీనియర్ ఆటగాళ్లు జట్టులో ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇక ఐపీఎల్ లో తొలి మ్యాచ్ లోవిజయం సాధించడం ఎంతో ముఖ్యమో నాకు బాగు తెలుసు అని రోహిత్ అన్నాడు. కానీ మా అదృష్టం బాగా లేదు కానుక మేము రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయాం.. అంతే కానీ మొత్తం టోర్నీ నుంచి వెళ్లిపోలేదు.. మేము తిరిగి మ్యాచ్ ల్లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచేందుకు ప్రయత్నం చేస్తామని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
Also Read : Eknath Shinde: నేడు మహా సీఎం అయోధ్య పర్యటన.. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి రాముడి దర్శనం..

తాజావార్తలు
-
BAN vs AUS: ఆసీస్కు ఊహించని షాక్.. 21 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై బంగ్లాదేశ్ ఘన విజయం..
-
Iran-US: బెదిరింపులకు భయపడం.. ట్రంప్కు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్ కౌంటర్
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Success Story: వయసు 23 ఏళ్లు.. ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆమె విజయ రహస్యం ఇదే..
-
APL 2026: బోణీ కొట్టిన అమరావతి రాయల్స్.. 6 వికెట్ల తేడాతో విజయం
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!