ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ సారి తీవ్ర నిరాశ పరుస్తుంది. ఈ మెగా టోర్నమెంట్ లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ముంబై ఓడిపోయింది. వరుసగా రెండు మ్యాచ్ ల్లో పరాజయం పాలైన ముంబై.. పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. ఇక చెన్న సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపై ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సీఎస్కే స్పిన్నర్లు తమను కోలుకోలేని దెబ్బ కొట్టారని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్ లో భాగంగా రోహిత్ మాట్లాడుతూ.. మాకు అద్భుతమైన ఆరంభం లభించింది. అయితే మేము దానిని సద్వినియోగం చేసుకోలేదు. పిచ్ బ్యాటింగ్ కు చక్కగా అనుకూలించింది. అయితే మా ఇన్సింగ్స్ మిడిల్ ఓవర్లలో మేము వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం అని రోహిత్ శర్మ అన్నాడు.
Also Read : Hyderabad Traffic : నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ దారుల్లో వెళ్తే అంతే సంగతి..
అయితే 30-40 పరుగులు తక్కువగా చేశాం.. అదే మా కొంపముంచింది. నిజం చెప్పాలంటే చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.. వారు బాగా బౌలింగ్ చేసి మమ్మల్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అటువంటి బౌలర్లపై ఎదురుదాడికి దిగాలంటే చాలా ధైర్యం కావాలన్నాడు. కానీ మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు.. వారికి అంత అనుభవం లేదు.. వారు అద్భుతంగా రాణించాలంటే కొంత సమయం పడుతుంది. మా జట్టులో యంగ్ క్రికెటర్లకు చాలా ప్రతిభ ఉంది.. కాబట్టి మా జట్టు ఎల్లప్పడూ వారికి మద్దతుగా నిలుస్తుంది. అయితే కొంతమంది సీనియర్ ఆటగాళ్లు జట్టులో ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇక ఐపీఎల్ లో తొలి మ్యాచ్ లోవిజయం సాధించడం ఎంతో ముఖ్యమో నాకు బాగు తెలుసు అని రోహిత్ అన్నాడు. కానీ మా అదృష్టం బాగా లేదు కానుక మేము రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయాం.. అంతే కానీ మొత్తం టోర్నీ నుంచి వెళ్లిపోలేదు.. మేము తిరిగి మ్యాచ్ ల్లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచేందుకు ప్రయత్నం చేస్తామని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
Also Read : Eknath Shinde: నేడు మహా సీఎం అయోధ్య పర్యటన.. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి రాముడి దర్శనం..