Team India: జట్టులో అతడు మెజిషీయన్ లాంటోడు.. రోహిత్ శర్మ ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్ను క్లీన్ స్వీప్ చేసిన భారత్ వన్డే ర్యాంకుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే తాము ర్యాంకులను పెద్దగా పట్టించుకోబోమని.. మైదానంలో ఎలా రాణించాలనేదానిపైనే చర్చిస్తామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. చివరి వన్డేలో తాను సెంచరీ చేయడం సంతోషంగా ఉందని.. కొంతకాలంగా రాణిస్తున్న తనకు ఈ సెంచరీ అదనపు మైలురాయి లాంటిదని తెలిపాడు. బోర్డుపై పరుగులు ఉన్నా ఇండోర్ లాంటి పిచ్పై ఎంతటి లక్ష్యం ఉన్నా సరిపోదని.. కానీ తాము ప్రణాళికలకు తగ్గట్లు ఆడి రాణించామని రోహిత్ చెప్పాడు. ప్రణాళికలకు తగ్గట్లు రాణించడం వన్డే క్రికెట్లో చాలా ముఖ్యమని.. తాము వ్యూహాలను సరిగ్గా అమలు చేయడంతోనే గత 6 మ్యాచ్ల్లో విజయం సాధించామని పేర్కొన్నాడు.
Read Also: Uttar Pradesh: ఇద్దరు అమ్మాయిల ప్రేమ.. లింగమార్పిడి.. చివరకు ట్విస్ట్ ఏంటంటే..?
Also Read
- KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
- KKR Vs MI: పాపం పాండ్యా.. కెప్టెన్సీ చేపట్టిన ప్రతీసారి ఇలానే.. మళ్లీ టార్గెట్ అవుతున్న హార్దిక్..
- KKR Vs MI: ఈడెన్ గార్డెన్స్లో హైవోల్టేజ్ పోరు.. టాస్ గెలిచిన కేకేఆర్.. ముంబై బ్యాటింగ్..
- Mohammad Amir: బ్రిటిష్ పౌరుడిగా మహ్మద్ ఆమీర్.. ఇక IPLలో ఆడే ఛాన్స్.!
సిరాజ్, షమీ లేకుండా రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనుకున్నామని.. అందుకే చివరి వన్డేలో చాహల్, ఉమ్రాన్ మాలిక్లను తుది జట్టులోకి తీసుకుని తీవ్ర ఒత్తిడిలో ఎలా రాణిస్తారో పరీక్షించాలని భావించామని రోహిత్ వెల్లడించాడు. చాలా రోజులుగా శార్దూల్ ఠాకూర్ సత్తా చాటుతున్నాడని.. జట్టులో అతడిని అందరూ మెజిషియన్ అంటారని రోహిత్ అన్నాడు. అవసరమైనప్పుడల్లా శార్దూల్ బ్యాట్, బంతితో మెరుస్తాడని.. అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. ఆస్ట్రేలియా చాలా నాణ్యమైన జట్టు అని.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆ జట్టుపై గెలవడం అంత సులువు కాదన్నాడు. కానీ తాము పైచేయి సాధిస్తామన్న నమ్మకం ఉందని రోహిత్ స్పష్టం చేశాడు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!