ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ప్రపంచ వ్యాప్తంగా క్రీడాభిమానులు ఉన్నారు. వరల్డ్లోనే బెస్ట్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ, డివిలియర్స్, మ్యాక్స్వెల్, డుప్లెసిస్ వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉండటంతో ఆ జట్టుకు క్రేజ్ విపరీతంగా ఉంటోంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవకపోయినా ఆ జట్టుకు క్రేజ్ అయితే తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా సోషల్ మీడియాలో అభిమానులు చర్చించుకుంటున్న టాప్-3 క్రీడా జట్టుల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్కు చోటు దక్కింది. ఏప్రిల్ 2022లో అత్యంత ప్రజాదరణ పొంది 190 మిలియన్ల సోషల్ మీడియాఎంగేజ్మెంట్తో 2వ స్థానాన్ని దక్కించుకుంది. ఈ జాబితాలో 321 మిలియన్స్ ఎంగేజ్మెంట్తో ఫుట్బాల్ దిగ్గజ జట్టు రియల్ మాడ్రిడ్ మొదటి స్థానంలో ఉంది. అటు 179 మిలియన్స్ ఎంగేజ్మెంట్తో ఎఫ్సి బార్సిలోనా జట్టు మూడో స్థానంలో ఉంది.
కాగా ఈ సీజన్ ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ప్లే ఆఫ్స్కు చేరుకున్న విషయం తెలిసిందే. ఓవరాల్ ఐపీఎల్లో చూసుకుంటే ఇప్పటివరకు అత్యధిక సార్లు ప్లే ఆఫ్స్ చేరిన జట్లలో ఆర్సీబీ మూడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు ఇప్పటివరకు 11 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. రెండో స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంది. ఈ జట్టు 9 సార్లు ప్లే ఆఫ్స్ చేరగా.. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు 8 సార్లు ప్లే ఆఫ్స్ చేరింది. అయితే ఆర్సీబీతో సమానంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా 8 సార్లు ప్లే ఆఫ్స్కు అర్హత సాధించడం విశేషం.
📲💥 TOP 3 most popular sports teams in the world with the highest social media engagement during april 2022! (total interactions)
1.@realmadrid 321M ⚽
2.@RCBTweets 190M 🏏
3.@FCBarcelona 179M ⚽#instagram #twitter #facebook #youtube #tiktok pic.twitter.com/lDoqBtfkdj
— Deportes&Finanzas® (@DeporFinanzas) May 20, 2022