2019 వన్డే ప్రపంచ కప్ జట్టులో భారత ఆటగాడు అంబటి రాయుడిని తీసుకొనేందుకు చాలా విమర్శలు వచ్చాయి. టీం ఇండియా సెమీస్ లో ఓడిన తర్వాత రాయుడు ఉంటె గెలిచే వాళ్ళం అని కూడా వార్తలు వచ్చాయి. ఇక తాజాగా భారత మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి ఈ విషయం పై స్పందించారు. జట్టులోకి రాయుడిని ఎందుకు తీసుకోలేదు అనేది తనకు తెలియదు అన్నారు. అయితే ఆ సమయంలో భారత జట్టులో నాలుగో స్థానం పెద్ద ప్రశ్నగా ఉండేది. అక్కడ చాలా మందిని మేము ప్రయతించాము. అందులో రాయుడు పై చేయి సాధించాడు.
కానీ ప్రపంచ కప్ ముందు అతను న్యూజిలాండ్ సిరీస్ లో రాణించలేదు అంతే. అయితే ప్రపంచ కప్ లో రాయుడు లేదా శ్రేయాస్ అయ్యారు మిడిల్ ఆర్డర్ లో ఉంటారు అనుకున్నాను. కానీ విజయ్ శంకర్ జట్టులోకి వచ్చాడు. అలాగే ధోని, పంత్, దినేష్ కార్తీక్ రూపంలో ముగ్గురు వికెట్ కీపర్ లను జట్టులోకి తీసుకున్నారు. అలా ఎందుకు చేసారో నాకు అర్ధం కాలేదు. పంత్ స్థానంలో రాయుడిని జట్టులోకి తీసుకుంటే బాగుండు అని రవిశాస్త్రి అన్నారు.అప్పుడు రాయుడిని తీసుకుంటే బాగుండేది : రవిశాస్త్రి