RCB vs RR: ముగిసిన ఆర్సీబీ బ్యాటింగ్.. ఆర్ఆర్ లక్ష్యం ఎంతంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan Royals Need To Score 172 Runs To Win Against RCB: జైపూర్లోని సవాయి మాన్సింగ్ ఇండోర్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (55), మ్యాక్స్వెల్ (54) అర్థశతకాలతో రాణించడం.. చివర్లో అనూజ్ రావత్ (29) మెరుపులు మెరిపించడంతో.. ఆర్సీబీ అంత స్కోరు చేయగలిగింది. వీళ్లు ముగ్గురు మినహాయించి.. ఆర్సీబీ బ్యాటర్లలో ఏ ఒక్కరూ ఆశాజనకమైన ఇన్నింగ్స్ ఆడలేదు. కోహ్లీ మరోసారి టెస్ట్ ఇన్నింగ్స్తో నిరాశపరిచాడు. 19 బంతుల్లో కేవలం 18 పరుగులే చేశాడు. పవర్ హిట్టర్ లామ్రోర్ 1 పరుగు చేసి ఔట్ అవ్వగా.. దినేశ్ కార్తిక్ డకౌట్గా వెనుదిరిగాడు. రాజస్థాన్ రాయల్స్ ఈ మ్యాచ్ గెలుపొందాలంటే.. 172 పరుగుల లక్ష్యాన్ని ఛేధించాలి.
Samyuktha Menon: పాడు పని చేసిన వ్యక్తి.. చెంప పగలగొట్టిన సంయుక్త
Also Read
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
- Mithali Raj: 'సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..' పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
- Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
- Dhananjaya de Silva: అదే మాకు పెద్ద తలనొప్పి.. శ్రీలంక కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

తొలుత ఆర్సీబీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే, ఆర్సీబీకి ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. దీంతో.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్నారు కాబట్టి, దుమ్ముదులిపేస్తారని అనుకున్నారు. ఓపెనర్లుగా వచ్చే కోహ్లీ, డు ప్లెసిస్ ఊచకోత కోస్తారని భావించారు. కానీ.. అందుకు భిన్నంగా ఆ ఇద్దరు నిదానంగా ఇన్నింగ్స్ ఆడారు. డు ప్లెసిస్ అప్పుడప్పుడైనా బౌండరీలతో సంతోషపరిచాడు కానీ, కోహ్లీ మాత్రం టోటల్గా డిజప్పాయింట్ చేశాడు. పరుగుల సునామీ సృష్టించాల్సిన పవర్ ప్లేలో అతడు సింగిల్స్, డబుల్స్తోనే సర్దుబాటు చేసుకున్నాడు. పవర్ప్లేలో ఈ జోడీ కేవలం 42 పరుగులే చేసింది. ఇక కోహ్లీ ఖాతా తెరవాలని అనుకున్న సమయంలో.. క్యాచ్ ఔట్ అయ్యాడు. అతని తర్వాత వచ్చిన మ్యాక్స్వెల్.. వచ్చి రావడంతోనే ఆర్ఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తన 360 డిగ్రీ ఆటతో మైదానంలో కాసేపు పరుగుల వర్షం కురిపించాడు. డు ప్లెసిస్, మ్యాక్స్వెల్ కలిసి రెండో వికెట్కి 69 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.
Fakes Kidnapping: పరీక్షల్లో ఫెయిల్ అయింది.. కిడ్నాప్ డ్రామాకు తెర లేపింది..
అయితే.. అర్థశతకం చేసుకున్నాక డు ప్లెసిస్ క్యాచ్ ఔట్ అయ్యాడు. అనంతరం లామ్రోర్, దినేశ్ కార్తిక్ అతని వెంటే పెవిలియన్ బాట పట్టారు. ఆ కొద్దిసేపటికే మ్యాక్స్వెల్ రివర్స్ స్వీప్ షాట్ ప్రయత్నించి, సందీప్ శర్మ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. చివర్లో అనూజ్ రావత్ మెరుపులు మెరిపించాడు. తద్వారా ఆర్సీబీ స్కోరు 171/5గా నమోదైంది. ఆర్ఆర్ బౌలర్ల విషయానికొస్తే.. అసిఫ్, జంపా చెరో రెండు వికెట్లు తీయగా, సందీప్ శర్మ ఒక వికెట్ పడగొట్టాడు.
తాజావార్తలు
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Rakhi Special: రక్షా బంధన్ పండుగకి ఇంట్లోనే ఓటీటీలో ఫ్యామిలీతో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు
-
China Earthquake: చైనాలో భారీ భూకంపం.. సిచువాన్లో 5.1 తీవ్రతతో ప్రకంపనలు, నేపాల్లో మరోసారి వరద భయం!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
Suryakumar Yadav: ‘నా వంతు కృషి చేస్తున్నా’.. టీమిండియాలోకి రీఎంట్రీపై కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
ఏడేళ్ల సాఫ్ట్వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!