Fakes Kidnapping: పరీక్షల్లో ఫెయిల్ అయింది.. కిడ్నాప్ డ్రామాకు తెర లేపింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fakes Kidnapping: ఇటీవల కాలంలో ఎగ్జామ్ రిజల్ట్స్ లో ఫెయిల్ అవుతామో అని, ఫెయిలైన తర్వాత పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అయితే మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన అందుకు రివర్స్ లో ఉంది. అండర్ గ్యాడ్యుయేషన్ పరీక్షల్లో ఫెయిలైనందుకు ఏకంగా ఓ బాలిక కిడ్నాప్ డ్రామాకే తెరతీసింది. తల్లిదండ్రులు తిట్టకుండా ఉండాలని ఫేక్ కిడ్నాపింగ్ కు పాల్పడింది.
వివరాల్లోకి వెళితే 17 ఏళ్ల బాలిక బీఏ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ లో ఫేయిల్ అయింది. ఈ విషయం తెలిస్తే తల్లిదండ్రులు తిడతారనే భయంతో తాను కిడ్నాప్ అయినట్లు కథ అల్లింది. ఇండోర్ కు చెందిన బాలిక పక్కనే ఉన్న ఉజ్జయినికి పారిపోయింది. పరీక్ష ఫలితాలు వెలువడిన కొన్ని గంటల తర్వాత, కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా.. ఇండోర్ లోని ఓ ఆలయం సమీపంలో తన కుమార్తె అపహరణకు గురైందని బాలిక తండ్రి శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశారని, ఇండోర్ బంగంగా పోలీస్ స్టేషన్ అధికారి రాజేంద్ర సోని తెలిపారు.
Also Read
- Tamil Nadu: నవోదయ స్కూళ్లపై టీవీకే సర్కార్ కీలక నిర్ణయం.. డీఎంకే కూడా మద్దతు.. ముదురుతున్న కేంద్రం-రాష్ట్ర వివాదం
- PM Modi: పర్యావరణ పరిరక్షణతోనే ఆర్థిక ప్రగతి.. ప్రపంచానికి భారత్ ఆదర్శం
- West Bengal Bypolls: మమతా బెనర్జీకి మరో షాక్.. రేజీనగర్ అభ్యర్థి కూడా బరి నుంచి ఔట్
- Petrol Pump UPI Payments: పెట్రోల్ పంపుల్లో UPI చెల్లింపులకు బ్రేక్..? డీలర్ల కీలక ప్రకటన
Read Also: Dulquer: మలయాళ సూపర్ స్టార్ మరో తెలుగు సినిమా…
తన కుమార్తె ఫోన్ చేసి తాను కిడ్నాప్ కు గురైనట్లు చెప్పిందని అధికారులకు తెలియజేశాడు. కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్ తను ఆలయ సమీపంలో డ్రాప్ చేసినట్లు చెప్పింది. ఆ తరువాత ఒక ఆటో రిక్షాలో ఎక్కానని, ఆటో డ్రైవర్ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి నోటిలో గుడ్డలు పెట్టిన తర్వాత స్పృహ కోల్పోయానని సదరు బాలిక తండ్రికి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. బాలిక చెప్పిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తే అదంతా తేలిందని పోలీసులు తెలిపారు.
ఉజ్జయినిలో ఓ రెస్టారెంట్ లో ఒంటరిగా కూర్చున్న బాలిక గురించి అక్కడి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఆమె ఫోటోను పంపించడంతో ఆమె ఉజ్జయినిలో ఉందని తెలుసుకుని పోలీసులు బాలికను ఇండోర్ తీసుకువచ్చారు. పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబసభ్యులకు అప్పగించారు. పరీక్షల్లో ఫెయిలై తల్లిదండ్రులను ఎదుర్కొనే పరిస్థితి లేకపోవడం వల్లే కిడ్నాప్ డ్రామా ఆడినట్లు విచారణలో తేలింది.
తాజావార్తలు
-
Gondhal Oscars 2027: రూ.84 లక్షలే వసూలు చేసిన ‘గోంధల్’.. రూ.3000 కోట్ల ‘ధురంధర్’ను దాటి ఆస్కార్ రేసులోకి ఎలా వెళ్లిందంటే?
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Abhishek Sharma: కోహ్లీ, రోహిత్ కాదు.. ‘అభిషేక్ శర్మను కిడ్నాప్ చేస్తా’.. ఆఫ్ఘనిస్థాన్ ఫ్యాన్ షాకింగ్ కామెంట్..
-
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
-
Ashwagandha: ఆయుర్వేద మందు వాడింది.. తర్వాత బ్రెయిన్ డ్యామేజ్.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!