IND vs NZ Final: భారత్ విక్టరీ కొట్టిన పిచ్ పైనే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్..
- భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మార్చి 9 ఆదివారం ఫైనల్
- భారత్ విక్టరీ కొట్టిన పిచ్ పైనే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్
- భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కోసం సెంటర్-వికెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ డిసైడర్ కు సర్వం సిద్ధమవుతోంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మార్చి 9 ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది. టైటిల్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. వరుస విజయాలతో దూకుడుమీదున్న టీమిండియా ఫైనల్ లో గెలిచి టైటిల్ సాధించాలనే పట్టుదలతో ఉంది. సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించి ఫైనల్స్ లో అడుగుపెట్టిన కివీస్ ఛాంపియన్ ట్రోఫీపై కన్నేసింది. కాగా ఫైనల్ మ్యాచ్ కోసం పిచ్ను ఎంపిక చేశారు. భారత్ విక్టరీ కొట్టిన పిచ్ పైనే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగబోతోంది.
Also Read:NTV Exclusive: శ్రీకాంత్ మళ్ళీ భయ పెడతాడట!
Also Read
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
భారత్, న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ కోసం సెంటర్-వికెట్ను ఉపయోగించనున్నారు. టోర్నమెంట్ గ్రూప్ దశలో హై ప్రొఫైల్ ఇండియా vs పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఉపయోగించిన వికెట్ ఇదే. భారత్- న్యూజిలాండ్ మధ్య ఫైనల్ ఈ పిచ్పై జరుగబోతోంది. ఇదే గ్రౌండ్ లో గ్రూప్-దశ మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో మెన్ ఇన్ బ్లూ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుందని సమాచారం. ఈ పిచ్పై భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారు. స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కలిసి ఐదు వికెట్లు పడగొట్టారు.
Also Read:RK Roja: చంద్రబాబు, పవన్పై రోజా ఫైర్.. మీకు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే హక్కు లేదు..!
ప్రస్తుత టోర్నమెంట్లో దుబాయ్లోని పిచ్లు బ్యాట్స్మెన్ కంటే బౌలర్లకే ఎక్కువ అనుకూలిస్తున్నాయి. దుబాయ్లో ఆడిన నాలుగు మ్యాచ్లలో సగటు స్కోరు 246. ఇందులో భారత్తో జరిగిన సెమీఫైనల్లో ఆస్ట్రేలియా 264 పరుగులు చేసింది. 265 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 49వ ఓవర్లోనే ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్లో నాలుగు వేర్వేరు పిచ్లను ఉపయోగించింది. మధ్యలో ఉన్న నాలుగు పిచ్లలో ఒకదాన్ని ఫైనల్ కోసం ఉపయోగిస్తారు.
Also Read:Air Force chief: ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ లాగా F-35 జెట్లను కొనలేము..
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్ (వైస్-కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్.
Also Read:Vimal pan masala: విమల్ పాన్ మసాలా యాడ్.. షారూఖ్, అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్లకు నోటీసులు..
న్యూజిలాండ్ జట్టు: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), మైఖేల్ బ్రేస్వెల్, మార్క్ చాప్మన్, డెవాన్ కాన్వే, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), డారిల్ మిచెల్, విల్ ఓ’రూర్కే, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్, కేన్ విలియమ్సన్, విల్ యంగ్.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!