Australia Cricket: మాకు విరాట్ కోహ్లీ లాంటి బ్యాటర్ లేడు.. కమిన్స్ సంచలన వ్యాఖ్యలు!
- శ్రీలంక, జింబాబ్వేపై దారుణ ఓటమి
- టీ20 ప్రపంచకప్ 2026 నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమణ
- ఆసీస్ నిష్క్రమణపై కమిన్స్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pat Cummins About Australia Elimination in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 నుంచి మాజీ ఛాంపియన్, క్రికెట్ను కొన్నేళ్ల పాటు శాసించిన ఆస్ట్రేలియా నిష్కమించింది. లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండు ఓడిన ఆసీస్.. ఎవరూ ఊహించని రీతిలో మెగా టోర్నీ నుంచి ఇంటిదారి పట్టింది. చివరి మ్యాచ్లో ఒమన్పై గెలిచినా ఆస్ట్రేలియాకు పెద్దగా ఉపయోగం లేదు. పసికూన ఐర్లాండ్పై గెలిచిన ఆసీస్.. శ్రీలంక, జింబాబ్వేపై దారుణంగా ఓడింది. ముఖ్యంగా పసికూన జింబాబ్వేపై ఓటమితో ఆస్ట్రేలియాపై విమర్శలు ఎక్కువయ్యాయి. టీ20 ప్రపంచకప్లో ఆసీస్ వైఫల్యంపై ఆ దేశ మాజీలు, క్రికెటర్లు కారణాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
టీ20 ప్రపంచకప్లో ఆస్ట్రేలియా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన నేపథ్యంలో కెప్టెన్ పాట్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టోర్నీలో మంచి ఆరంభాలు లేకపోవడమే ప్రధాన లోపమని స్పష్టం చేశాడు. ‘పాట్.. ఆస్ట్రేలియాకు ఇది గొప్ప టోర్నమెంట్ కాదు. కానీ జింబాబ్వే మ్యాచ్ను ఛేదించవచ్చని మీరు అనుకుంటున్నారా?’ అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించగా.. ‘నిజాయితీగా చెప్పాలంటే.. టీ20 క్రికెట్లో ఓపెనింగే మ్యాచ్ విజయంను శాసిస్తుంది. ఓపెనర్లు రాణిస్తే మ్యాచ్ దాదాపు పూర్తవుతుంది. మా ఓపెనర్లు ఈ టోర్నమెంట్లో రాణించలేదు. బలమైన ఆరంభ భాగస్వామ్యం లేకపోవడమే మా కూటములకు కారణం’ అని కమిన్స్ బదులిచ్చాడు.
Also Read
- Shresta Iyer: శ్రేయస్ అయ్యర్ సోదరికి అత్యాచార బెదిరింపులు.. శ్రేష్ఠ అయ్యర్ ఆవేదన
- Vaibhav Sooryavanshi: "ఆ బుడ్డోడిని ఎలా దెబ్బకొట్టాలో మాకు తెలుసు".. ఇంగ్లాండ్ దిగ్గజాల సంచలన కామెంట్స్!
- Shreyas Iyer: "ఆ ప్లేయర్స్ మళ్లీ మళ్లీ తప్పులు చేస్తున్నారు".. ఘోర ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ ఆవేదన!
- IND vs ENG: తీరుమారని భారత్.. 12 ఏళ్ల తర్వాత టీమిండియాపై ఇంగ్లాండ్ టీ20 సిరీస్ విజయం.!
Also Read: Gautam Gambhir-BCCI: గౌతమ్ గంభీర్ భవిష్యత్తుపై బీసీసీఐ కీలక నిర్ణయం!
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుతూ… ‘జింబాబ్వే మ్యాచ్లో త్వరగా వికెట్లు కోల్పోవడం వల్ల ఒత్తిడి పెరిగింది. పవర్ ప్లేలోనే కీలక వికెట్స్ పడ్డాయి. ఒక దశలో మాకు 18 బంతుల్లో 48 పరుగులు అవసరం. ఆ లక్ష్యాన్ని సాధించడం సాధారణ బ్యాటర్కు సాధ్యం కాదు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ తప్ప ఏ బ్యాట్స్మన్ కూడా సాధించలేడు. మాకు కోహ్లీ లాంటి బ్యాటర్ లేడు’ అని పాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు. 2022 అక్టోబర్ 22న పాకిస్థాన్పై కోహ్లీ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ను కమిన్స్ గుర్తుచేశాడు. ఆ మ్యాచ్లో కోహ్లీ ప్రదర్శన క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేనిదని, అలాంటి ఆటను మరో ఆటగాడు పునరావృతం చేయడం చాలా కష్టం అని అభిప్రాయపడ్డాడు. వెన్ను గాయం కారణంగా కమిన్స్ టీ20 వరల్డ్కప్ 2026కు దూరమైన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Prabhas : షూటింగ్కు స్మాల్ బ్రేక్ ఇచ్చి యూరప్ వెళ్తున్న ‘డార్లింగ్’
-
Rose Plant Care: గులాబీ మొక్కకు మొగ్గలు రావట్లేదా? ఈ సులభమైన చిట్కాలు పాటిస్తే పూలతో నిండిపోతది
-
Shresta Iyer: శ్రేయస్ అయ్యర్ సోదరికి అత్యాచార బెదిరింపులు.. శ్రేష్ఠ అయ్యర్ ఆవేదన
-
Meher Ramesh : నటుడుగా రీ – ఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ మెహర్ రమేష్
-
FSSAI Liquor Notices: బీర్, విస్కీ, రమ్, తాగుతున్నారా?.. ఇది మీకోసమే..!
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!