T20 World Cup: పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ను బహిష్కరిస్తుందా? పీసీబీ చీఫ్ మోహ్సీన్ నఖ్వీ స్పందన..
- బంగ్లాకు మద్దతుగా టీ20 ప్రపంచకప్ను పాక్ బహిష్కరిస్తుందా?
- కీలక వ్యాఖ్యలు చేసిన పీసీబీ చీఫ్ మోహ్సీన్ నఖ్వీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: బంగ్లాదేశ్కు ఐసీసీ(ICC) షాక్ ఇచ్చింది. భద్రతా కారణాలు చూపుతూ భారత్లో టీ20 వరల్డ్ కప్-2026(T20 World Cup 2026) ఆడేందుకు నిరాకరించినందుకు టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్ నుంచి తమ వేదికను శ్రీలంకకు మార్చాలని, లేదంటే టోర్నీలో పాల్గొనమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీసీ) చెప్పింది. ఈ నేపథ్యంలో, ఐసీసీ బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను తీసుకుంది. అయితే, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి అవుట్ అయిన నేపథ్యంలో, పాకిస్తాన్ టోర్నీలో పాల్గొంటుందా? అనే దానిపై స్పందించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ.. దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. బంగ్లాదేశ్పై ఐసీసీ వ్యవహరించిన తీరును విమర్శించారు.
Read Also: CM Nitish Kumar: సీఎం నితీష్ కుమార్ కాన్వాయ్ కోసం గంట పాటు నిలిచిన రైళ్లు..
Also Read
- Team India Injuries: టీమిండియాకు వరుస షాక్లు.. కోహ్లీ ఔట్.. రోహిత్కు గాయం..! హార్దిక్ కూడా అనుమానమేనా..?
- Shubman Gill: ఆ ఒక్క మార్పుతోనే శుభ్మన్ గిల్ పరుగుల వరద.. సీక్రెట్ బయటపెట్టిన అశ్విన్..
- Krunal Pandya: హార్దిక్ పాండ్యాకు కృనాల్కు మధ్య విభేదాలు.. ఎట్టకేలకు ఏం జరిగిందో చెప్పిన కృనాల్ పాండ్య..
- Lalit Modi: నా కొడుకును కిడ్నాప్ చేశారు.. బెదిరింపుల వల్లే పారిపోయా.. లలిత్ మోడీ సంచలన ఆరోపణలు
బంగ్లాదేశ్ నిష్క్రమణపై నఖ్వీ స్పందిస్తూ.. ఐసీసీకి ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని, బంగ్లాదేశ్ను టోర్నమెంట్లో పాల్గొనడానికి అనుమతించాలని నఖ్వీ అన్నారు. “బంగ్లాదేశ్కు అన్యాయం జరిగింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బోర్డు సమావేశంలో కూడా నేను ఇదే విషయం చెప్పాను. మీరు ద్వంద్వ ప్రమాణాలను పాటించలేరు, ఒక దేశం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు, కానీ మరో దేశం విషయంలో దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించడం సరికాదు. అందుకే బంగ్లాదేశ్కు అన్యాయం జరుగుతోందని, ఏదేమైనా వారిని ప్రపంచ కప్లో ఆడేందుకు అనుమతించాలని మేము వైఖరి తీసుకున్నాము. వారు ఒక ప్రధాన వాటాదారులు, వారికి ఈ అన్యాయం జరగకూడదు’’ అని అన్నారు.
బంగ్లాదేశ్ లాగే పాకిస్తాన్ కూడా టీ20 ప్రపంచకప్ను బహిష్కరిస్తుందా? అనే ప్రశ్నకు సమాధానంగా పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చే సూచనల్ని పాటిస్తామని చెప్పారు. పాక్ ప్రధాని పాకిస్తాన్లో లేరని, ఆయన వచ్చాక తుది నిర్ణయాన్ని చెబుతామని, తాము ప్రభుత్వ నిర్ణయాన్ని పాటిస్తామని, ఐసీసీని కాదు అని చెప్పారు. భారత్లో జరిగే ఈ ఐసీసీ ఈవెంట్ల విషయానికి వస్తే పాకిస్తాన్ హైబ్రీడ్ మోడల్లో ఆడుతోంది. దాని మ్యాచ్లన్నీ శ్రీలంకలో జరుగనున్నాయి. బంగ్లాదేశ్కు కూడా ఇలాంటి సహాయమే చేయాలని చెప్పారు.
తాజావార్తలు
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
-
INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్కాట్..
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
-
Sonam Raghuvanshi: హనీమూన్ మర్డర్ కేసులో సోనమ్ బెయిల్ పిటిషన్ రద్దుపై కీలక పరిణామం.. సర్వత్రా ఉత్కంఠ
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!