IPL 2022: ఢిల్లీ-రాజస్థాన్ మ్యాచ్లో నోబాల్ వివాదం.. బ్యాటింగ్ ఆపేయాలని పంత్ సైగలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుక్రవారం రాత్రి జరిగిన ఢిల్లీ-రాజస్థాన్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగింది. అయితే చివరి ఓవర్లో హైడ్రామా నడిచింది. ఢిల్లీ విజయానికి 36 పరుగులు కావాల్సిన తరుణంలో రోవ్మెన్ పావెల్ చెలరేగి ఆడాడు. రాజస్థాన్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ వేసిన 20వ ఓవర్లో తొలి మూడు బంతులకు పావెల్ 3 సిక్సర్లు కొట్టాడు. అయితే మూడో బంతికి మెకాయ్ వేసిన ఫుల్ టాస్ బంతిని అంపైర్ సరైన బాల్గానే ప్రకటించడంతో ఢిల్లీ జట్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అది నోబాల్ అని వాదించింది. చెస్ట్ వరకు బాల్ ఫుల్టాస్ వచ్చిందంటూ పావెల్ వాదించగా అంపైర్ ఒప్పుకోలేదు.
దీంతో డగౌట్లో కూర్చున్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు. బ్యాటింగ్ చేయకుండా డగౌట్కు వచ్చేయాలంటూ క్రీజులో ఉన్న తమ ఆటగాళ్లకు సైగలతో సందేశాన్ని పంపాడు. దీంతో పావెల్, కుల్దీప్ యాదవ్ వెళ్లిపోవడానికి రెండు అడుగులు ముందుకు వేశారు. వెంటనే అంపైర్ నితిన్ మీనన్ వాళ్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. మరోవైపు ఢిల్లీ కెప్టెన్ పంత్ తమ టీమ్ అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేను బలవంతంగా మైదానంలోకి పంపాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం ఇతర వ్యక్తులు ఆట జరిగేటప్పుడు మైదానంలోకి రాకూడదు. దీంతో అంపైర్ నితిన్ మీనన్ ఆమ్రేను బయటకు వెళ్లిపోవాలని ఆదేశించాడు.
Also Read
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- IPL Team: కొత్త ఐపీఎల్ జట్టులో దిగ్గజాలు.. CSK, MI, RCB తట్టుకునేనా..?
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
అయితే కాసేపటికి ఈ వివాదం సద్దుమణిగింది. కానీ రిప్లేలో కూడా కాస్త నోబాల్లాగే కనిపించిందని కామేంటేటర్లు అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికి మ్యాచ్ మళ్లీ ప్రారంభం కావడంతో మెకాయ్ చివరి మూడు బంతులను కట్టుదిట్టంగా వేయడంతో రాజస్థాన్ 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ కెప్టెన్ పంత్ మ్యాచ్ జరిగే సమయంలో వేరే వ్యక్తిని మైదానంలోకి పంపడంతో అతడికి జరిమానా పడే అవకాశాలున్నాయి.
https://twitter.com/VinayShu1998/status/1517568521601175552
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!