Kane Willamson : ఐపీఎల్ కోసం వన్డే సిరీస్ కు కివీస్ కెప్టెన్ దూరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ మెగాటోర్నీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని చిన్న క్రికెటర్ల నుంచి మేటి క్రికెటర్ల వరకు ఈ మెగగాలీగ్ లో ఆడేందుకు ఇష్టపడతారు. ఈ లీగ్ లో తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ ఈవెంట్ నిర్వహించే సమయంలో సొంత దేశంలో సిరీస్ లు ఉన్నా.. ఇందులో ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఇప్పుడు న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ కూడా అదే చేశాడు. ఐపీఎల్ కోసం ఆ దేశ క్రికెట్ బోర్డు ముందే విడిచిపెట్టనుంది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఆడుతున్న విలియమ్సన్ వన్డేలకు అందుబాటులో ఉండట్లేదు.. దీంతో ఆ వన్డే సిరీస్ లో కివీస్ టీమ్ కు టామ్ లాథమ్ కెప్టెన్ గా వ్యవహించానున్నాడు.
Also Read : Pawan Kalyan Varahi Live: జనసేన వారాహి ర్యాలీ లైవ్
Also Read
- IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
- Virat Kohli: "నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు".. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
- Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
- Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
గతేడాది జరిగిన ఐపీఎల్ ఆక్షన్లో విలియమ్సన్ ను.. గుజరాత్ టైటాన్స్ జట్టు.. రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో మంచి ఫామ్ లోఉన్న అతడు.. ఇక ఐపీఎల్ లో సత్తా చాటేందుకు ఎంతో ఆత్రుతగా ఉన్నాడు. న్యూజిలాండ్ జట్టు ఐపీఎల్ కోసం విలియమ్సన్ తో పాటు డేవాన్ కాన్వే( సీఎస్కే), టీమ్ సౌథీ(కేకేఆర్), మిచెల్ సాంట్నర్ను( సీఎస్కే)ను కూడా వదిలిపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక వీరి స్థానంలో న్యూజిలాండ్ జట్టులో కొత్త యంగ్ ప్లేయర్లు ఆడనున్నారు. ఇప్పటికే లంకతో మూడు వన్డేల సిరీస్ కోసం చాడ్ బోవాస్, బెన్ లిస్టర్ ను న్యూజిలాండ్ బోర్డు సెలెక్ట్ చేసింది. అలాగే మార్చి 25న జరగనున్న తొలి వన్డే తర్వాత లోకీ ఫెర్గ్యూసన్( కేకేఆర్), ఫిన్ అలెన్(ఆర్సీబీ), గ్లెన్ ఫిలిప్(ఎస్ఆర్హెచ్) కూడా ఐపీఎల్ కోసం భారత్ కు చేరుకోనున్నారు.
Also Read : Puvvada Ajay Kumar: నీ పప్పులు కేసీఆర్ ముందు ఉడకవు.. పొంగులేటి పై పువ్వాడ అజయ్ విసుర్లు..
ఈ విషయంలో న్యూజిలాండ్ జట్టులో కొత్త ప్లేయర్స్ ఎప్పుడూ ఉండటం మంచి వాతావరణాన్ని సృష్టిస్తుందని కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపారు. అలాగే నిర్థిష్ట ఫార్మాట్ లో ఆటగాళ్లకు అవకాశాలిచ్చి తీర్చిదిద్దడం ఎప్పుడూ ఉత్తేజకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా, లంకతో జరిగిన తొలి టెస్టులో విలియమ్సన్ (121 నాటౌట్, 194 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ ) అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఆఖరి బంతి వరకు పోరాడి న్యూజిలాండ్ ను విజయతీరాలకు చేర్చాడు. అతడు అద్భుత సెంచరీ కొట్టడంతో ఈ మ్యాచ్ లో శ్రీలంక రెండె వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో కివీస్ రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్ లో కివీస్ గెలవడంతో.. లంక ఓడిపోవడంతో భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరేందుకు మార్గం క్లీయరైంది.
తాజావార్తలు
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..