Kane Willamson : ఐపీఎల్ కోసం వన్డే సిరీస్ కు కివీస్ కెప్టెన్ దూరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ మెగాటోర్నీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచంలోని చిన్న క్రికెటర్ల నుంచి మేటి క్రికెటర్ల వరకు ఈ మెగగాలీగ్ లో ఆడేందుకు ఇష్టపడతారు. ఈ లీగ్ లో తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతుంటారు. ఈ ఈవెంట్ నిర్వహించే సమయంలో సొంత దేశంలో సిరీస్ లు ఉన్నా.. ఇందులో ఆడేందుకు ఇంట్రెస్ట్ చూపుతుంటారు. ఇప్పుడు న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ కూడా అదే చేశాడు. ఐపీఎల్ కోసం ఆ దేశ క్రికెట్ బోర్డు ముందే విడిచిపెట్టనుంది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టెస్టు సిరీస్ లో ఆడుతున్న విలియమ్సన్ వన్డేలకు అందుబాటులో ఉండట్లేదు.. దీంతో ఆ వన్డే సిరీస్ లో కివీస్ టీమ్ కు టామ్ లాథమ్ కెప్టెన్ గా వ్యవహించానున్నాడు.
Also Read : Pawan Kalyan Varahi Live: జనసేన వారాహి ర్యాలీ లైవ్
Also Read
- Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
- Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
- Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
- IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
గతేడాది జరిగిన ఐపీఎల్ ఆక్షన్లో విలియమ్సన్ ను.. గుజరాత్ టైటాన్స్ జట్టు.. రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో మంచి ఫామ్ లోఉన్న అతడు.. ఇక ఐపీఎల్ లో సత్తా చాటేందుకు ఎంతో ఆత్రుతగా ఉన్నాడు. న్యూజిలాండ్ జట్టు ఐపీఎల్ కోసం విలియమ్సన్ తో పాటు డేవాన్ కాన్వే( సీఎస్కే), టీమ్ సౌథీ(కేకేఆర్), మిచెల్ సాంట్నర్ను( సీఎస్కే)ను కూడా వదిలిపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక వీరి స్థానంలో న్యూజిలాండ్ జట్టులో కొత్త యంగ్ ప్లేయర్లు ఆడనున్నారు. ఇప్పటికే లంకతో మూడు వన్డేల సిరీస్ కోసం చాడ్ బోవాస్, బెన్ లిస్టర్ ను న్యూజిలాండ్ బోర్డు సెలెక్ట్ చేసింది. అలాగే మార్చి 25న జరగనున్న తొలి వన్డే తర్వాత లోకీ ఫెర్గ్యూసన్( కేకేఆర్), ఫిన్ అలెన్(ఆర్సీబీ), గ్లెన్ ఫిలిప్(ఎస్ఆర్హెచ్) కూడా ఐపీఎల్ కోసం భారత్ కు చేరుకోనున్నారు.
Also Read : Puvvada Ajay Kumar: నీ పప్పులు కేసీఆర్ ముందు ఉడకవు.. పొంగులేటి పై పువ్వాడ అజయ్ విసుర్లు..
ఈ విషయంలో న్యూజిలాండ్ జట్టులో కొత్త ప్లేయర్స్ ఎప్పుడూ ఉండటం మంచి వాతావరణాన్ని సృష్టిస్తుందని కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపారు. అలాగే నిర్థిష్ట ఫార్మాట్ లో ఆటగాళ్లకు అవకాశాలిచ్చి తీర్చిదిద్దడం ఎప్పుడూ ఉత్తేజకరంగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా, లంకతో జరిగిన తొలి టెస్టులో విలియమ్సన్ (121 నాటౌట్, 194 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్ ) అదిరిపోయే ప్రదర్శన చేశాడు. ఆఖరి బంతి వరకు పోరాడి న్యూజిలాండ్ ను విజయతీరాలకు చేర్చాడు. అతడు అద్భుత సెంచరీ కొట్టడంతో ఈ మ్యాచ్ లో శ్రీలంక రెండె వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో కివీస్ రెండు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో 1-0 ఆధిక్యం సంపాదించింది. ఈ మ్యాచ్ లో కివీస్ గెలవడంతో.. లంక ఓడిపోవడంతో భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరేందుకు మార్గం క్లీయరైంది.
తాజావార్తలు
-
NBK 111 : బాలయ్య సినిమా డిసెంబర్ లేదా సంక్రాంతి రిలీజ్ ఫిక్స్
-
WhatsApp New Feature: వాట్సాప్ వినియోగదారులకు గుడ్న్యూస్.. మరో స్మార్ట్ ఫీచర్.. మరింత భద్రత..
-
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ కు ‘నో’ చెప్పిన కీర్తి సురేశ్.. ‘బుజ్జి’ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
-
Lorcan Tucker: టీమిండియాపై టీ20 సిరీస్ గెలిచామా.. నేను ఇంకా నమ్మలేకపోతున్నా!
-
US Iran Talks: అమెరికా–ఇరాన్ మధ్య శాంతి దిశగా కీలక అడుగు..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!