T20 World Cup: నెదర్లాండ్స్ సంచలనం.. ఇంటిదారి పట్టిన సౌతాఫ్రికా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netherlands Won Against South Africa In T20 World Cup: సౌతాఫ్రికా జట్టు దురదృష్టాన్ని జేబులో పెట్టుకుని తిరుగుతుందని మరోసారి రుజువైంది. తాడోపేడో తేల్చుకోవాల్సిన అత్యంత కీలకమైన మ్యాచ్లో ఈ జట్టు చెత్త ప్రదర్శన కనబర్చింది. చిన్న జట్టు అయిన నెదర్లాండ్స్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడడంతో.. సెమీస్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ టీ20 వరల్డ్కప్ టోర్నీ ప్రారంభమైన కొత్తలో.. విధ్వంసకరమైన జట్టుగా అవతరించింది. బంగ్లాదేశ్పై ఏకంగా 100 పరుగులకు పైగా తేడాతో గెలవడంతో.. ఈసారి సౌతాఫ్రికాకి తిరుగు ఉండదని అంతా భావించారు. కానీ.. క్రమంగా ఈ జట్టు డీలా పడుతూ వచ్చింది. ఇప్పుడు నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్టు చేతిలో కూడా ఓడిపోయింది. మెరుపులు మెరిపించే బ్యాటర్లు ఉన్నప్పటికీ.. ఆ జట్టు కుదిర్చిన 159 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా జట్టు చేధించలేకపోయింది. దీంతో.. ఈ జట్టు సెమీస్ నుంచి నిష్క్రమించింది.
తొలుత టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫీల్డింగ్ ఎంపిక చేసుకోగా.. బ్యాటింగ్ చేసేందుకు నెదర్లాండ్స్ బరిలోకి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. టాపార్డర్ బ్యాటర్లందరూ బాగా రాణించడంతో.. ఈ జట్టు గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. చివర్లో కాలిన్ అక్కర్మన్ సౌతాఫ్రికా బౌలర్లపై తాండవం చేశాడు. 26 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్సుల సహాయంతో 41 పరుగులు చేశాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ 2 వికెట్లు తీయగా.. నోర్ట్యే, మార్క్రమ్ చెరో వికెట్ తీశారు. ఇక 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మొదటి నుంచే తడబడింది. నెదర్లాండ్స్ బౌలర్ల ధాటికి ఒకదాని తర్వాత మరొక వికెట్ కోల్పోతూ వచ్చింది. ఏ ఒక్కరూ నిలకడగా రాణించలేదు. రుస్సో ఒక్కడే 25 పరుగులతో జట్టులో హయ్యస్ట్ స్కోరర్గా నిలిచాడు. దీన్ని బట్టి.. నెదర్లాండ్ బౌలర్లు ఎంత కట్టుదిట్టమైన బౌలింగ్ వేశారో అర్థం చేసుకోవచ్చు. నెదర్లాండ్స్ జట్టు ఇంటికి పోతూపోతూ.. తనతో పాటు సౌతాఫ్రికాని కూడా ఇంటిదారి పట్టించింది.
Also Read
- Women's T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
- Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
- Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
- Tilak Varma: అతడు క్రీజులో ఉన్నంత సేపు నమ్మకం లేదు.. ఓటమి తప్పదనుకున్నా: తిలక్ వర్మ
సౌతాఫ్రికా ఇంటి దారి పట్టడంతో.. భారత్ అధికారికంగా సెమీ ఫైనల్స్కి చేరింది. ఇక జింబాబ్వేతో జరిగే మ్యాచ్ ఫలితంతో ఎలాంటి సంబంధం ఉండదు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లకు సెమీస్ ఆశలు సజీవం అయ్యాయి. ఆ రెండు జట్లకి ఈరోజు మ్యాచ్ ఉంది. ఏ జట్టు గెలుస్తుందో.. అది సెమీస్కి చేరుకుంటుంది. మరి, ఈ కీలకమైన పోరులో ఎవరు నెగ్గుతారో చూడాలి.
తాజావార్తలు
-
Parama Ekadashi: జూన్ 11న పరమ ఏకాదశి.. విష్ణుమూర్తి కటాక్షం పొందాలంటే ఈ నియమాలు తప్పక పాటించాలి.
-
Jeethu Joseph: ‘దృశ్యం-3’ తెలుగులో ఎందుకు రీమేక్ కాలేదు? అసలు రీజన్ చెప్పేసిన డైరెక్టర్ జీతూ జోసెఫ్!
-
Janvi Kapoor: ‘పెద్ది’ దెబ్బకైనా జాన్వీ తీరు మారుతుందా?
-
MLA Thomas: నన్ను గెలకొద్దు.. గెలికితే ఏ రాత్రో హార్ట్ ఎటాక్ వచ్చి పోతావ్.. మాజీ డిప్యూటీ సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు
-
Modi-Meloni: ఇటీవల రోమ్లో కలవడం ఆనందంగా ఉంది.. మోడీ రికార్డ్పై మెలోని అభినందనలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!