MI vs RCB: ముగిసిన ముంబై బ్యాటింగ్.. చీల్చిచెండాడిన తిలక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Indians Batting Innings Completed Against RCB: ఎమ్. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై జట్టు ఏడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. యువ ఆటగాడు తిలక్ వర్మ విజృంభణతోనే ముంబై జట్టు ఈ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఐదో స్థానంలో వచ్చిన ఈ ఆటగాడు.. ఆచితూచి ఆడుతూనే, బంతులు దొరికినప్పుడల్లా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా.. తిలక్ మాత్రం ఒత్తిడికి గురవ్వకుండా, చాలా కూల్గా తన ఇన్నింగ్స్ కొనసాగించాడు. 46 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సుల సహకారంతో 84 పరుగులు సాధించాడు. ఒంటరి పోరాటం చేస్తూ.. తన జట్టుకి మంచి స్కోరుని అందించాడు.
Donald Trump: కేసులు ఉన్నా తగ్గని ఆదరణ.. ట్రంపుకు ఒకే రోజు భారీ విరాళం..
Also Read
- Joe Root: రిక్కీ పాంటింగ్ రికార్డు చెల్లాచెదురు.. జో రూట్ అరుదైన ఘనత..
- Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
- Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
- Mithali Raj: 'నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు'.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
నిజానికి.. టాపార్డర్ ఘోరంగా విఫలం కావడం, అంచనాలు పెట్టుకున్న ప్లేయర్లందరూ చేతులెత్తేయడం చూసి, ముంబై జట్టు 120 పరుగుల మార్క్ని అందుకోవడం కూడా కష్టమేనని అనిపించింది. మొదటి 10 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 55 పరుగులే చేయడంతో.. ఇక ముంబై పని అయిపోయినట్టేనని అంతా ఫిక్స్ అయ్యారు. ఆర్సీబీ బౌలర్ల ధాటికి హేమాహేమీలే వికెట్లు కోల్పోవడంతో.. స్వల్ప స్కోరుకే ముంబై చాపచుట్టేస్తుందని భావించారు. కానీ.. ఆ ఊహాగానాల్ని తిలక్ వర్మ తిప్పికొట్టాడు. ముంబై జట్టుకి తానున్నానంటూ.. ఒంటరి పోరు సాగించాడు. ఆర్సీబీ బౌలింగ్ ఎటాక్ని స్టార్ ప్లేయర్లు ఎదుర్కోలేకపోతే.. ఇతడు మాత్రం తాండవం చేశాడు. అనవసరమైన టెంప్టింగ్ షాట్ల జోలికి వెళ్లకుండా.. ఎంతో శ్రద్ధగా పరుగుల వర్షం కురిపించాడు. అతడు సినిమాలో డైలాగ్ ఉన్నట్టు.. ఎవడైనా కోపంగా కొడతాడు లేదా బలంగా కొడతాడు, కానీ ఈ వీడు మాత్రం శ్రద్ధగా, ఏదో గోడ కడుతున్నట్టు, గులాబీ మొక్కకి అంటు కడుతున్నట్టుగా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడు. నిజంగా ఈ మ్యాచ్కి మాత్రం వీడు మగాడ్రా బుజ్జి.
China: 8 ఏళ్ల బాలుడిని చూసి భయపడుతున్న చైనా.. అసలేంటి ఆ స్టోరీ..?
ఇక ఆర్సీబీ బౌలర్ల విషయానికొస్తే.. కరణ్ శర్మ రెండు వికెట్లు తీయగా.. సిరాజ్, టోప్లే, ఆకాశ్, హర్షల్, బ్రేవ్వెల్ తలా వికెట్ తీసుకున్నారు. మొదట కట్టుదిట్టమైన బౌలింగ్ వేసిన ఆర్సీబీ.. చివర్లో మాత్రం ధారాళంగా పరుగులు సమర్పించుకుంది. యువ ఆటగాళ్లే కదా.. ఏం కొడతారులే అని లైట్ తీసుకున్నారో ఏమో గానీ.. చివర్లో మాత్రం వీళ్లు తేలిపోయారు. సిరాజ్ అయితే 19వ ఓవర్లో వైడ్ల వర్షం కురిపించాడు. ఇక చివరి బంతికి హెలికాప్టర్ షాట్తో సిక్స్ కొట్టి, తిలక్ ముగించిన తీరు మాత్రం.. ఈ మ్యాచ్కే హైలైట్ అని చెప్పుకోవాలి.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!