ఐపీఎల్ 2021 లో టైటిల్ ను అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ఈ జట్టుకు న్యాయకత్వం వహిస్తున్నాడు భారత మాజీ కెప్టెన్ ధోని. అయితే ధోని త్వరలోనే అభిమానులకు ఓ శుభవార్త చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదేంటంటే… ధోని రెండోసారి తండ్రి కాబోతున్నాడు అని సమాచారం. అయితే ధోని భార్య సాక్షి ప్రస్తుతం నాలుగు నెలల గర్భవతి అని నేటింట్లో ప్రచారం జరుగుతుంది. అయితే ఐపీఎల్ కప్ అందుకున్న తర్వాత ధోనిని సాక్షి గ్రౌండ్ లో కలుసుకుంది. అక్కడ సాక్షిని చుసిన తర్వాత నుండే ఈ ప్రచారం ప్రారంభమైంది. అయితే ఈ జంట తమ రెండో సంతానానికి వచ్చే ఏడాది జన్మ నీవనున్నట్లు తెలుస్తుంది. కానీ ఈ విషయం ధోని, సాక్షి అధికారికంగా ప్రకటించలేదు. ఇక ప్రస్తుతం వీరువురికి జివా అనే కూతురు ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఇదిలా ఉంటె ఐపీఎల్ ముగిసిన తర్వాత కూడా ధోని యూఏఈ లోనే భారత జట్టులో మెంటార్ గా ఉన్నాడు.