Mahendra Singh Dhoni: నేను కూడా మనిషినే.. మైదానంలో అందుకే కోపం రాదు..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahendra Singh Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడు మైదానంలో ఎంత కూల్గా ఉంటాడో అందరికీ తెలుసు. బౌలర్ ఎక్కువ పరుగులు ఇచ్చినా.. ఫీల్డర్ క్యాచ్ డ్రాప్ చేసినా ధోనీ ఎప్పుడూ అసహనం వ్యక్తం చేసినట్లు కనిపించదు. అందుకే ధోనీని అందరూ కెప్టెన్ కూల్ అని అభివర్ణిస్తారు. అయితే తనకు మైదానంలో ఎందుకు కోపం రాదో.. తన కూల్నెస్కు కారణాలేంటో తాజాగా ధోనీ వెల్లడించాడు. తాను మనిషినేనని.. తనకు కూడా కోపం వస్తుందని.. కానీ చివరి క్షణంలో తన భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి ప్రయత్నిస్తానని ఓ కంపెనీ ఈవెంట్లో మీడియా అడిగిన ప్రశ్నకు ధోనీ వివరించాడు. నిజాయితీగా చెప్పాలంటే.. తాము గ్రౌండ్లో ఉన్నప్పుడు.. మిస్ ఫీల్డింగ్, క్యాచ్లు వదిలివేయడం లేదా ఇతర తప్పులు చేయకూడదు అని భావిస్తామని ధోనీ తెలిపాడు.
Read Also:Death Certificate: నా డెత్ సర్టిఫికెట్ పోయింది.. వైరల్ అవుతున్న పేపర్ ప్రకటన
Also Read
- Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
- Kapil Dev: "బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి".. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
- IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
అయితే ఆటగాడు ఎందుకు క్యాచ్ డ్రాప్ చేశాడో.. ఎందుకు తప్పుగా ఫీల్డింగ్ చేశాడో గుర్తించడానికి తాను ప్రయత్నిస్తానని ధోనీ వ్యాఖ్యానించాడు. వారి స్థానాల్లో ఉండి తాను ఆలోచిస్తానని… కోపం తెచ్చుకోవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని గ్రహిస్తానని పేర్కొన్నాడు. తమను ఎంతో మంది ప్రేక్షకులు స్టాండ్లలో కూర్చుని ప్రత్యక్షంగా చూస్తుంటారని.. అంతేకాకుండా కోట్లాది మంది ప్రజలు మ్యాచ్ను టీవీల్లో చూస్తుంటారని.. తాను జాతీయ జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్నాననే విషయాన్ని నిరంతరం గుర్తుతెచ్చుకుంటూ భావోద్వేగాలను నియంత్రించుకుంటానని ధోనీ వివరించాడు. అయితే ఫీల్డర్ తప్పుకు కారణమేమిటో తప్పకుండా తర్వాత తెలుసుకుంటానని తెలిపాడు.
ఓ ఆటగాడు 100 శాతం అంకితభావంతో ఆడుతూ ఓ క్యాచ్ వదిలేస్తే అదేమంత సమస్యగా తాను భావించనని ధోనీ స్పష్టం చేశాడు. ప్రాక్టీస్ సందర్భంగా సదరు ఆటగాడు ఎన్ని క్యాచ్లు పట్టాడన్నది ఆలోచిస్తానని, క్యాచింగ్లో ఏదైనా సమస్య ఉంటే దాన్ని అధిగమించడానికి అతడు ప్రయత్నం చేశాడా లేదా అనేది గమనిస్తానని చెప్పాడు. తనకు కూడా అందరిలాగే భావోద్వేగాలు ఉంటాయని.. కానీ బయట కూర్చుని, ఇలా ఆడాలి, అలా ఆడాలి అని చాలా మంది చెబుతుంటారని.. కానీ మైదానంలో దిగిన తర్వాత అంచనాలకు తగినట్టుగా ఆడడం ఎంతో కష్టమని ధోనీ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Preity Mukhundhan: ఈ ముద్దుగుమ్మ రామానుజన్ మునిమనవరాలా? అసలు నిజం ఇదే!
-
Samsung గెలాక్సీ డబుల్ ధమాకా.. ఫోల్డబుల్ ఫోన్లు, స్మార్ట్ గ్లాసెస్ లాంచ్కు ముహూర్తం ఖరారు..
-
Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
-
Rohit Sharma Retirement: బిగ్ షాక్.. సెలక్టర్లకు ఎదురుతిరిగిన రోహిత్ శర్మ.. జైస్వాల్ కోసం గిల్ త్యాగం!
-
Nandini : “ఆమె నా కోడలు కాదు.. కూతురు.. భట్టి సతీమణి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!