Common Wealth Games 2022: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. లక్ష్యాన్ని ఛేదించిన లక్ష్యసేన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Common Wealth Games 2022: ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ బంగారు పతకాన్ని సాధించాడు. మలేషియా షట్లర్పై 19-21, 21-9, 21-16 తేడాతో విజయాన్ని సాధించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో మలేషియాకు చెందిన ఎన్జీ జే యోంగ్ను ఓడించి భారత షట్లర్ లక్ష్య సేన్ దేశ రెండో బ్యాడ్మింటన్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. మొదటి గేమ్లో వెనుకంజ వేసిన ఈ భారత షట్లర్.. అనంతరం పుంజుకుని మిగతా వరుస గేమ్ల్లో చెలరేగిపోయాడు. ప్రత్యర్థి గట్టి పోటీనిచ్చినా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. దీంతో గొప్పగా పోరాడి భారత్కు మరో పసిడి అందించాడు. ఈ పతకంతో భారత ఖాతాలో 57 పతకాలు (20 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు) ఉన్నాయి. అంతకుముందు మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
Common Wealth Games 2022: భారత్కు మరో స్వర్ణం.. ఫైనల్లో అదరగొట్టిన పీవీ సింధు
Also Read
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
- Vaibhav Sooryavanshi: టీమిండియాలోకి 15 ఏళ్ల వండర్ కిడ్.. వైభవ్ ఎంట్రీతో జట్టులో బలి అయ్యేది ఎవరు?
- Eng vs NZ: మొదటి రోజు 16, రెండో రోజు 17 వికెట్లు.. బ్యాటర్స్కు ముచ్చెమటలు పట్టిస్తున్న బౌలర్లు.!
- నేడు AFG vs IND ఏకైక టెస్ట్ మ్యాచ్.. టీమిండియా ప్లేయింగ్ XI ఇలా.!
లక్ష్యసేన్, అతని మలేషియా ప్రత్యర్థి ఓపెనింగ్ గేమ్ను చాలా వరకు సమానంగా ప్రారంభించారు. సేన్ 5-4 ఆధిక్యంతో స్వల్ప ప్రయోజనం పొందాడు. కానీ జే యోంగ్ మాత్రం గేమ్పై పట్టు వదులుకోలేదు, అతను పాయింట్లు సాధించడమే కాకుండా, సేన్ తన సొంత పాయింట్ల కోసం కష్టపడేలా చేశాడు. సేన్ పోరాడుతూనే చివరికి 19-19తో నిలిచాడు. కానీ 19-21తో భారత ఆటగాడిని అధిగమించిన తర్వాత జే యోంగ్ మొదటి గేమ్ను దక్కించుకున్నాడు. తదుపరి గేమ్ కూడా సమాన పోటీగా ప్రారంభమైంది. మొదటి జే యోంగ్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. తర్వాత లక్ష్యసేన్ పట్టుదల వల్ల 11-9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. లక్ష్యసేన్ రెండో గేమ్ను 21-9 తేడాతో గెలిచి ఉత్కంఠను నెలకొల్పాడు. డిసైడర్ గేమ్ కూడా ఉత్తేజకరమైన రీతిలో ప్రారంభమైంది, ఇద్దరు ఆటగాళ్లు పాయింట్ల కోసం తీవ్రంగా శ్రమించారు. సేన్ ఈసారి మెరుగ్గా ఉన్నాడు. గేమ్ సగం వరకు అతను 11-7 ఆధిక్యాన్ని కలిగి ఉన్నాడు. అనంతరం అది 15-11కి పెరిగింది. సేన్ చివరికి మూడో గేమ్లో 21-16 తేడాతో తన విజయాన్ని సొంతం ృచేసుకున్నాడు. వరుస రెండు గేమ్లను గెలిచి స్వర్ణాన్ని సాధించాడు.
ఇదిలా ఉండగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణం సాధించి.. బ్యాడ్మింటన్లో భారత్కు తొలి బంగారు పతకాన్ని అందించింది. కెనడాకు చెందిన మిచెల్ లీతో మహిళల సింగిల్స్లో గోల్డ్ మెడల్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. దీనితో పీవీ సింధు తన కెరీర్లో మొట్టమొదటి కామన్వెల్త్ మహిళల సింగిల్స్ స్వర్ణాన్ని అందుకుంది. ప్రత్యర్థి గట్టిగా పోటీ ఇచ్చినప్పటికీ.. సింధు మ్యాచ్లో ఆధిపత్యం ప్రదర్శించింది. మిచెల్ లీపై 21-15, 21-13 తేడాతో వరుసగా రెండు గేమ్లలో విజయం సాధించి ఫైనల్లో బంగారు పతకాన్ని పీవీ సింధు కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
Gunasekhar: అలా పుట్టిందే ‘ఒక్కడు’ సినిమా.. డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు.!
-
Ramcharan New Record : “పెద్ది”తో రామ్ చరణ్ సరికొత్త రికార్డు… ఆ ఘనత సాధించిన సౌత్ స్టార్స్ వీళ్ళే
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్కతా టు ఢిల్లీ.. పార్లమెంట్కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!