Common Wealth Games 2022: భారత్ ఖాతాలో మరో స్వర్ణం.. లక్ష్యాన్ని ఛేదించిన లక్ష్యసేన్
Common Wealth Games 2022: ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో స్వర్ణం వచ్చి చేరింది. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్ బంగారు పతకాన్ని సాధించాడు. మలేషియా షట్లర్పై 19-21, 21-9, 21-16 తేడాతో విజయాన్ని సాధించాడు. పురుషుల సింగిల్స్ విభాగంలో మలేషియాకు చెందిన ఎన్జీ జే యోంగ్ను ఓడించి భారత షట్లర్ లక్ష్య సేన్ దేశ రెండో బ్యాడ్మింటన్ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. మొదటి గేమ్లో వెనుకంజ వేసిన ఈ భారత షట్లర్.. అనంతరం పుంజుకుని మిగతా వరుస గేమ్ల్లో చెలరేగిపోయాడు. ప్రత్యర్థి గట్టి పోటీనిచ్చినా ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. దీంతో గొప్పగా పోరాడి భారత్కు మరో పసిడి అందించాడు. ఈ పతకంతో భారత ఖాతాలో 57 పతకాలు (20 స్వర్ణాలు, 15 రజతాలు, 22 కాంస్యాలు) ఉన్నాయి. అంతకుముందు మహిళల సింగిల్స్ విభాగంలో పీవీ సింధు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
Common Wealth Games 2022: భారత్కు మరో స్వర్ణం.. ఫైనల్లో అదరగొట్టిన పీవీ సింధు
Also Read
- IPL 2026: వరుస పరాజయాలు.. Mumbai Indians ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఇలా ఆడాల్సిందే.!
- SRH vs RR: బుడ్డోడు వైభవ్ vs ప్రఫుల్ హింగే.. రేపు రాజస్థాన్ సొంత గడ్డపై అసలైన 'ప్రతీకార' పోరు!
- Sanju Samson: "నా విజయ రహస్యం ఇదే".. సెంచరీ వీరుడు సంజూ శామ్సన్ ఆసక్తికర వ్యాఖ్యలు
- Sanju Samson Century: ఇది కదా కావాల్సింది.. సంజూను అభినందించిన హార్దిక్ పాండ్యా, బుమ్రా, స్కై.. వీడియో వైరల్
లక్ష్యసేన్, అతని మలేషియా ప్రత్యర్థి ఓపెనింగ్ గేమ్ను చాలా వరకు సమానంగా ప్రారంభించారు. సేన్ 5-4 ఆధిక్యంతో స్వల్ప ప్రయోజనం పొందాడు. కానీ జే యోంగ్ మాత్రం గేమ్పై పట్టు వదులుకోలేదు, అతను పాయింట్లు సాధించడమే కాకుండా, సేన్ తన సొంత పాయింట్ల కోసం కష్టపడేలా చేశాడు. సేన్ పోరాడుతూనే చివరికి 19-19తో నిలిచాడు. కానీ 19-21తో భారత ఆటగాడిని అధిగమించిన తర్వాత జే యోంగ్ మొదటి గేమ్ను దక్కించుకున్నాడు. తదుపరి గేమ్ కూడా సమాన పోటీగా ప్రారంభమైంది. మొదటి జే యోంగ్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ.. తర్వాత లక్ష్యసేన్ పట్టుదల వల్ల 11-9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. లక్ష్యసేన్ రెండో గేమ్ను 21-9 తేడాతో గెలిచి ఉత్కంఠను నెలకొల్పాడు. డిసైడర్ గేమ్ కూడా ఉత్తేజకరమైన రీతిలో ప్రారంభమైంది, ఇద్దరు ఆటగాళ్లు పాయింట్ల కోసం తీవ్రంగా శ్రమించారు. సేన్ ఈసారి మెరుగ్గా ఉన్నాడు. గేమ్ సగం వరకు అతను 11-7 ఆధిక్యాన్ని కలిగి ఉన్నాడు. అనంతరం అది 15-11కి పెరిగింది. సేన్ చివరికి మూడో గేమ్లో 21-16 తేడాతో తన విజయాన్ని సొంతం ృచేసుకున్నాడు. వరుస రెండు గేమ్లను గెలిచి స్వర్ణాన్ని సాధించాడు.
ఇదిలా ఉండగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు స్వర్ణం సాధించి.. బ్యాడ్మింటన్లో భారత్కు తొలి బంగారు పతకాన్ని అందించింది. కెనడాకు చెందిన మిచెల్ లీతో మహిళల సింగిల్స్లో గోల్డ్ మెడల్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. దీనితో పీవీ సింధు తన కెరీర్లో మొట్టమొదటి కామన్వెల్త్ మహిళల సింగిల్స్ స్వర్ణాన్ని అందుకుంది. ప్రత్యర్థి గట్టిగా పోటీ ఇచ్చినప్పటికీ.. సింధు మ్యాచ్లో ఆధిపత్యం ప్రదర్శించింది. మిచెల్ లీపై 21-15, 21-13 తేడాతో వరుసగా రెండు గేమ్లలో విజయం సాధించి ఫైనల్లో బంగారు పతకాన్ని పీవీ సింధు కైవసం చేసుకుంది.
తాజావార్తలు
-
BMW F 450 GS: భారత్ లో కొత్త BMW F 450 GS విడుదల.. పూర్తి స్పెసిఫికేషన్స్, ఫీచర్లు & ధరలు
-
MLC Anantha Babu Arrest: బిగ్ బ్రేకింగ్.. ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్ట్..
-
IRS Officer Daughter Murder: బాధితురాలిని నిందితుడి ఏమని పిలిచేవాడంటే..! పోలీసుల రిపోర్ట్లో సంచలన విషయాలు
-
IPL 2026: వరుస పరాజయాలు.. Mumbai Indians ప్లేఆఫ్స్ ఆశలు నిలబెట్టుకోవాలంటే ఇలా ఆడాల్సిందే.!
-
CSK History: సరికొత్త చరిత్ర సృష్టించిన సీఎస్కే.. ఐపీఎల్ చరిత్రలోనే..!
ట్రెండింగ్
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!