Irfan Pathan: అత్యుత్తమ ఐపీఎల్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరో తెలుసా?
ఏదైనా టోర్నీ జరుగుతున్నప్పుడు లేదా ముగిసిన తర్వాత.. మాజీలందరూ తమతమ ఉత్తమ ఆటగాళ్ళని ఎంపిక చేసుకొని, ఒక బెస్ట్ టీమ్ని ప్రకటిస్తుంటారు. ఇప్పుడు ఐపీఎల్-2022 ముగియడంతో.. మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన బెస్ట్ ఎలెవన్ను అనౌన్స్ చేశాడు. ఇతను హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా ఎంపిక చేయడం విశేషం. హార్దిక్ సారథ్యం వహించిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్-2022 ఛాంపియన్స్గా నిలిచిన సంగతి తెలిసిందే! ఈ ఏడాది సీజన్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు.. తొలి సీజన్లోనే కప్ నెగ్గడంతో సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. ముఖ్యంగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథిగా తన జట్టుని సమర్థవంతంగా నడిపించాడంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇర్ఫాన్ తను ఎంపిక చేసిన జట్టుకి హార్దిక్ని కెప్టెన్గా నియమించినట్టు తెలుస్తోంది. ఓపెనర్లుగా జోస్ బట్లర్, కేఎల్ రాహుల్ను ఎంపిక చేసిన ఆయన.. మూడు, నాలుగు స్థానాల్లో సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యాకు చోటు ఇచ్చాడు. అలాగే ఐదు, ఆరు స్థానాల్లో లాయమ్ లివింగ్ స్టోన్, డేవిడ్ మిల్లర్కు చోటు దక్కింది. ఇక బౌలింగ్ ఆల్ రౌండర్లుగా రషీద్ ఖాన్,హార్షల్ పటేల్ను సెలెక్ట్ చేశాడు. కేవలం బౌలర్ల కోటాలో మహ్మద్ షమీ, యజువేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్కు అవకాశం ఇచ్చాడు. అంతేకాదు.. ఈ జట్టులో 12వ ఆటగాడిగా స్పిన్నర్ కుల్ధీప్ యాదవ్ ఎంపిక చేశాడు. ఈ సీజన్లో ఈ వెటరన్ క్రికెటర్ మెరవడంతో.. ఇర్ఫాన్ అతడికీ తన జట్టులో చోటిచ్చినట్టు స్పష్టమవుతోంది.
Also Read
- RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
- Muttiah Muralitharan: "ఐపీఎల్ అంటేనే వ్యాపారం.. క్రికెట్ ఎక్కడుంది?".. SRH కోచ్ షాకింగ్ కామెంట్స్!
- RCB Vs GT: ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ.. మరో రికార్డు బద్దలు కొట్టిన విరాట్..
- Jasprit Bumrah: బుమ్రా బౌలింగ్లో పస తగ్గిందా..? ఈ IPL లో విఫలం అవ్వడానికి కారణం ఇదే..
ఇర్ఫాన్ ఎంపిక చేసిన బెస్ట్ ఎలెవన్: జోస్ బట్లర్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్ (12వ ఆటగాడు- కుల్దీప్ యాదవ్). కాగా.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 130 పరుగులు మాత్రమే చేయగా, గుజరాత్ టైటాన్స్ ఇంకా 11 బంతులు మిగిలుండగానే 3 వికెట్ల నష్టంతో లక్ష్యాన్ని చేధించింది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!