Irfan Pathan: అత్యుత్తమ ఐపీఎల్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏదైనా టోర్నీ జరుగుతున్నప్పుడు లేదా ముగిసిన తర్వాత.. మాజీలందరూ తమతమ ఉత్తమ ఆటగాళ్ళని ఎంపిక చేసుకొని, ఒక బెస్ట్ టీమ్ని ప్రకటిస్తుంటారు. ఇప్పుడు ఐపీఎల్-2022 ముగియడంతో.. మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన బెస్ట్ ఎలెవన్ను అనౌన్స్ చేశాడు. ఇతను హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా ఎంపిక చేయడం విశేషం. హార్దిక్ సారథ్యం వహించిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఐపీఎల్-2022 ఛాంపియన్స్గా నిలిచిన సంగతి తెలిసిందే! ఈ ఏడాది సీజన్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ఈ జట్టు.. తొలి సీజన్లోనే కప్ నెగ్గడంతో సర్వత్రా ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. ముఖ్యంగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా సారథిగా తన జట్టుని సమర్థవంతంగా నడిపించాడంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇర్ఫాన్ తను ఎంపిక చేసిన జట్టుకి హార్దిక్ని కెప్టెన్గా నియమించినట్టు తెలుస్తోంది. ఓపెనర్లుగా జోస్ బట్లర్, కేఎల్ రాహుల్ను ఎంపిక చేసిన ఆయన.. మూడు, నాలుగు స్థానాల్లో సంజూ శాంసన్, హార్ధిక్ పాండ్యాకు చోటు ఇచ్చాడు. అలాగే ఐదు, ఆరు స్థానాల్లో లాయమ్ లివింగ్ స్టోన్, డేవిడ్ మిల్లర్కు చోటు దక్కింది. ఇక బౌలింగ్ ఆల్ రౌండర్లుగా రషీద్ ఖాన్,హార్షల్ పటేల్ను సెలెక్ట్ చేశాడు. కేవలం బౌలర్ల కోటాలో మహ్మద్ షమీ, యజువేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్కు అవకాశం ఇచ్చాడు. అంతేకాదు.. ఈ జట్టులో 12వ ఆటగాడిగా స్పిన్నర్ కుల్ధీప్ యాదవ్ ఎంపిక చేశాడు. ఈ సీజన్లో ఈ వెటరన్ క్రికెటర్ మెరవడంతో.. ఇర్ఫాన్ అతడికీ తన జట్టులో చోటిచ్చినట్టు స్పష్టమవుతోంది.
Also Read
- Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్కు ఓటమి తప్పదా?
- Guinness World Record: ముక్కు నేలకు తాకేలా హ్యాండ్స్టాండ్ పుష్అప్స్.. మహిళ గిన్నిస్ రికార్డు..
- India Test Cricket History: 94 ఏళ్ల టెస్ట్ ప్రయాణం.. 600వ మ్యాచ్కు చేరుకున్న టీమిండియా చరిత్ర ఇదే..!
- Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్మ్యాన్కు మరో అవకాశం
ఇర్ఫాన్ ఎంపిక చేసిన బెస్ట్ ఎలెవన్: జోస్ బట్లర్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), లియామ్ లివింగ్స్టోన్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, హర్షల్ పటేల్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్ (12వ ఆటగాడు- కుల్దీప్ యాదవ్). కాగా.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 130 పరుగులు మాత్రమే చేయగా, గుజరాత్ టైటాన్స్ ఇంకా 11 బంతులు మిగిలుండగానే 3 వికెట్ల నష్టంతో లక్ష్యాన్ని చేధించింది.
తాజావార్తలు
-
Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
-
Fuel Exports: కేంద్రం సంచలన నిర్ణయం.. పెట్రోల్, డీజిల్పై విండ్ఫాల్ ట్యాక్స్ జీరో
-
Aus vs Ban Test: గెలుపు ముంగిట బంగ్లాదేశ్.. ఆసీస్కు ఓటమి తప్పదా?
-
Comrade Kalyan Release Date:1992 బోర్డర్ కథతో శ్రీ విష్ణు డ్యూయల్ రోల్… ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ అవుట్
-
Mahindra BE 6 Formula E Freedom Edition: ‘Revive’ ఎమర్జెన్సీ ఫీచర్ తో.. మహీంద్రా BE 6 ఫార్ములా ఈ ఎడిషన్ రిలీజ్
ట్రెండింగ్
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!