Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
- ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన
- 9 ఇన్నింగ్స్లలో 400 పరుగులు
- తొలి ఆటగాడిగా వైభవ్ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పవర్ హిట్టింగ్కు పేరుగాంచిన ఈ యువ ఆటగాడు.. ఈసారి నిలకడను తన బలంగా మార్చుకుని టోర్నమెంట్లో టాప్ రన్-స్కోరర్గా నిలిచాడు. ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్లలో 400 పరుగులు చేశాడు. అతడి సగటు 44.44 కాగా.. స్ట్రైక్రేట్ 238.09గా ఉంది. ఈ సీజన్లో 400 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ స్కోర్లు వరుసగా 52, 31, 39, 78, 0, 46, 8, 103, 43గా ఉన్నాయి. ఈ సీజన్లో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో తన నిలకడను చూపుతున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తరఫున పంజాబ్ కింగ్స్పై కేవలం 16 బంతుల్లో 43 పరుగులు చేసి మరోసారి తన దూకుడును చూపించాడు. మాజీ క్రికెటర్లు మురళి కార్తీక్, మోహిత్ శర్మలు సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొహిత్ మాట్లాడుతూ.. ‘ప్రతి స్టేడియంలో ఒకే స్థాయి ప్రేమ, ఆదరణ పొందిన ఆటగాడు ఎంఎస్ ధోనీ మాత్రమే. ఇప్పుడు అదే స్థాయి క్రేజ్ను సూర్యవంశీ పొందుతున్నాడు. వైభవ్ బాగా ఆడుతున్నాడు. అలవోకగా సిక్సులు బాదడం చూస్తుంటే.. చాలా ముచ్చటేస్తుంది’ అని పేర్కొన్నాడు. ధోనీతో పోలికలు రావడం అతని ప్రతిభకు మరో నిదర్శనం. వైభవ్ ప్రదర్శన ఐపీఎల్ 2026లో ఒక పెద్ద హైలైట్గా నిలుస్తోంది.
Also Read
- CSK: సంజూ కాదు.. ఆ యువ ఆటగాడి ఆట అమోఘం: బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ
- Nitish Rana Out: నితీష్ రాణా ఔట్పై వివాదం.. డెడ్ బాల్ ఇవ్వాలా?.. నిబంధనలు ఏమంటున్నాయి?
- IPL 2026 Final: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఫైనల్ మ్యాచ్ ఎక్కడో తెలుసా?
- Rajasthan Royals FIR: వైభవ్ సూర్యవంశీ వివాదం.. రాజస్తాన్ రాయల్స్ ఫ్రాంచైజీపై ఎఫ్ఐఆర్ నమోదు!
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఉత్కంఠ భరిత విజయం సాధించింది. చివరి 6 ఓవర్లలో 71 పరుగులు అవసరమైన సమయంలో డొనోవన్ ఫెరీరా (52 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. శుభమ్ దూబె (31 నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. మ్యాచ్ ప్రారంభంలో వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడి ఐదు సిక్సులతో బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. అలాగే యశస్వి జైస్వాల్ (51) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మధ్యలో చాహల్ (3/36) వికెట్లు తీసి మ్యాచ్ను మలుపుతిప్పాడు. అయినప్పటికీ ఫెరీరా, దూబె జోడి చివర్లో మ్యాచ్ను తమవైపు తిప్పుకున్నారు.
తాజావార్తలు
-
Corporation Chairmans: కాంగ్రెస్ లో పదవుల పండగ.. 18 మందికి కార్పొరేషన్ చైర్మన్లుగా నియామకం..
-
Esther Anil : మోహన్ లాల్’ను పొగడాలంటే వెంకీని తగ్గించాలా?
-
Pakistan Medicine Crisis: పిండి, గ్యాస్ తర్వాత పాకిస్తాన్లో మరో సంక్షోభం.. ప్రజల ప్రాణాలకు ముప్పు..
-
Maa Inti Bangaram: ఇట్స్ అఫీషియల్.. సమంత సినిమా వాయిదా
-
Ugly Story: మొన్న సైక్, ఇప్పుడు సైకో.. ఆసక్తికరంగా నందు ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!