Vaibhav Sooryavanshi Record: మెగా మైలురాయి.. తొలి ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు!
- ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన
- 9 ఇన్నింగ్స్లలో 400 పరుగులు
- తొలి ఆటగాడిగా వైభవ్ రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 సీజన్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. పవర్ హిట్టింగ్కు పేరుగాంచిన ఈ యువ ఆటగాడు.. ఈసారి నిలకడను తన బలంగా మార్చుకుని టోర్నమెంట్లో టాప్ రన్-స్కోరర్గా నిలిచాడు. ఇప్పటివరకు 9 ఇన్నింగ్స్లలో 400 పరుగులు చేశాడు. అతడి సగటు 44.44 కాగా.. స్ట్రైక్రేట్ 238.09గా ఉంది. ఈ సీజన్లో 400 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా వైభవ్ రికార్డు సృష్టించాడు.
ఐపీఎల్ 2026లో వైభవ్ సూర్యవంశీ స్కోర్లు వరుసగా 52, 31, 39, 78, 0, 46, 8, 103, 43గా ఉన్నాయి. ఈ సీజన్లో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలతో తన నిలకడను చూపుతున్నాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తరఫున పంజాబ్ కింగ్స్పై కేవలం 16 బంతుల్లో 43 పరుగులు చేసి మరోసారి తన దూకుడును చూపించాడు. మాజీ క్రికెటర్లు మురళి కార్తీక్, మోహిత్ శర్మలు సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొహిత్ మాట్లాడుతూ.. ‘ప్రతి స్టేడియంలో ఒకే స్థాయి ప్రేమ, ఆదరణ పొందిన ఆటగాడు ఎంఎస్ ధోనీ మాత్రమే. ఇప్పుడు అదే స్థాయి క్రేజ్ను సూర్యవంశీ పొందుతున్నాడు. వైభవ్ బాగా ఆడుతున్నాడు. అలవోకగా సిక్సులు బాదడం చూస్తుంటే.. చాలా ముచ్చటేస్తుంది’ అని పేర్కొన్నాడు. ధోనీతో పోలికలు రావడం అతని ప్రతిభకు మరో నిదర్శనం. వైభవ్ ప్రదర్శన ఐపీఎల్ 2026లో ఒక పెద్ద హైలైట్గా నిలుస్తోంది.
Also Read
- IPL 2027: కోహ్లీ, రోహిత్తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
- రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
- Hardik Pandya: ఐపీఎల్ ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్యా ఢిల్లీకా? చెన్నైకా? భారత మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేజ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఉత్కంఠ భరిత విజయం సాధించింది. చివరి 6 ఓవర్లలో 71 పరుగులు అవసరమైన సమయంలో డొనోవన్ ఫెరీరా (52 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. శుభమ్ దూబె (31 నాటౌట్) అతనికి అండగా నిలిచాడు. మ్యాచ్ ప్రారంభంలో వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడి ఐదు సిక్సులతో బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. అలాగే యశస్వి జైస్వాల్ (51) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మధ్యలో చాహల్ (3/36) వికెట్లు తీసి మ్యాచ్ను మలుపుతిప్పాడు. అయినప్పటికీ ఫెరీరా, దూబె జోడి చివర్లో మ్యాచ్ను తమవైపు తిప్పుకున్నారు.
తాజావార్తలు
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
-
Israel-Turkey: ఇజ్రాయెల్ నెక్ట్స్ టార్గెట్ టర్కీనేనా? గ్రీస్లో శక్తివంతమైన క్షిపణి ఏర్పాట్లు!
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!