SRH vs CSK Tickets: డబుల్ రేట్స్, అయినా ఎక్కడా దొరకని టికెట్స్.. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం సొమ్ము చేసుకుంటోందా?
- ఈరోజు ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్, సీఎస్కే మ్యాచ్
- డబుల్ రేట్స్, అయినా ఎక్కడా దొరకని టికెట్స్
- ఎస్ఆర్హెచ్ యాజమాన్యం సొమ్ము చేసుకుంటోందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SRH vs CSK Tickets Controversy: ఐపీఎల్ 2026లో భాగంగా ఈరోజు సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఉప్పల్ స్టేడియంలో రాత్రి 7.30కు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం హైదరాబాద్ ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మ్యాచ్ నేపథ్యంలో టికెట్ల వ్యవహారం మరోసారి తీవ్ర వివాదానికి దారితీసింది. మ్యాచ్పై భారీ క్రేజ్ ఉండటంతో అభిమానులు టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ.. అందుబాటులో లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ధరలను భారీగా పెంచడం కూడా అభిమానుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.
ఉప్పల్ స్టేడియంలో సౌత్ ఈస్ట్, వెస్ట్ టెర్రస్ టికెట్ల ధరలను రూ.1250 నుంచి రూ.2500కు పెంచారు. ఈస్ట్, వెస్ట్ ఫస్ట్ ఫ్లోర్ టికెట్ల ధరలను రూ.2250 నుంచి రూ.3500కు పెంచారు. ఇక కార్పొరేట్ బాక్స్ టికెట్ల ధరలను రూ.23,000 నుంచి ఏకంగా రూ.33,000కు పెంచడం విమర్శలకు దారితీసింది. బుకింగ్ చార్జీలు కూడా రూ.300 నుంచి రూ.2000 వరకు పెరగడం అభిమానులను మరింత అసహనానికి గురి చేస్తోంది. టికెట్లు ఆన్లైన్లో విడుదల చేసిన క్షణాల్లో అమ్ముడైపోతున్నాయి. డిస్ట్రిక్ట్ యాప్లో సరైన విధంగా అందుబాటులో ఉంచడం లేదని అభిమానులు ఆరోపిస్తున్నారు. టికెట్స్ కోసం ఆన్లైన్లో భారీ క్యూ ఉండడం, పేమెంట్ చేసే సమయంలో సోల్డ్ అవుట్ అని పడడంతో ఫాన్స్ నిరాశ చెందుతున్నారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
Also Read: IPL 2026-SRH: ఎస్ఆర్హెచ్ నుంచి కీలక అప్డేట్.. సన్రైజర్స్లోకి ముంబై ఇండియన్స్ పేసర్!
ఎస్ఆర్హెచ్, సీఎస్కే టికెట్లను ఉద్దేశపూర్వకంగా బ్లాక్ చేసి.. బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారన్న అనుమానాలు కూడా అభిమానుల్లో వ్యక్తమవుతున్నాయి. ఆశ్చర్యకరంగా బ్లాక్ మార్కెట్లో కూడా టికెట్లు దొరకడం లేదని కొందరు ఫాన్స్ అంటున్నారు. మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ హైదరాబాద్కు చేరుకోవడంతో ఈ మ్యాచ్పై క్రేజ్ మరింత పెరిగింది. ధోనీని ప్రత్యక్షంగా చూడాలనే ఆశతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్కు చేరుకున్నారు. టికెట్లు దొరకకపోవడంతో వారు నిరాశ చెందుతున్నారు. టికెట్లను పెద్ద మొత్తంలో చెన్నైకి తరలించారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్పై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ మార్కెట్లో టికెట్స్ అమ్ముకుని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం సొమ్ము చేసుకుంటోందా? అని ఫాన్స్ ఫైర్ అవుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో SIR ప్రక్రియ ఎలా నడుస్తోంది..? ఓటర్ల సాధకబాధకాలేంటి..?
-
OTR: ఒంగోలు వైసీపీలో వర్గ పోరు.. పార్టీ ఆఫీసులోనే రచ్చ, అధిష్టానం సీరియస్!
-
MHSRB: ANM మెరిట్ లిస్ట్ విడుదల.. అభ్యంతరాలకు ఛాన్స్
-
Asaduddin Owaisi: RSS అనుబంధ సంస్థ సమావేశానికి అస్సాం రైఫిల్స్.. ఓవైసీ ఆగ్రహం.
-
Donald Trump: ఇరాన్తో సీజ్ఫైర్ ముగిసింది, కానీ చర్చలు కొనసాగుతాయి..
ట్రెండింగ్
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!
-
8000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme NARZO 100x 5G జూలై 15న లాంచ్.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!