ఐపీఎల్ 2024లో భాగంగా.. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో ఆర్సీబీ గెలుపొందింది. 148 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.4 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఒకానొక సమయంలో ఆర్సీబీ వికెట్లు పోతున్న సమయంలో గుజరాత్ వైపు మ్యాచ్ తిరిగింది. కానీ.. దినేశ్ కార్తీక్ క్రీజులోకి వచ్చి మ్యాచ్ను గెలిపించాడు. బెంగళూరు బ్యాటర్లలో కోహ్లీ (42), డుప్లెసిస్ (64) పరుగులు చేయడంతో ఆర్సీబీ అలవోకంగా విజయం సాధించింది.
Off The Record: ధర్మవరంలో మ్యూట్ మోడ్లో బీజేపీ వరదాపురం సూరి
ఈ మ్యాచ్లో డుప్లెసిస్ వీర విహరం చేశాడు. కేవలం 23 బంతుల్లోనే 64 రన్స్ చేశాడు. అతని ఇన్నింగ్స్లో 3 సిక్సులు, 10 ఫోర్లు ఉన్నాయి. డుప్లెసిస్ వికెట్ కోల్పోగానే ఆర్సీబీ బ్యాటర్లు వెంట వెంటనే పెవిలియన్ బాట పట్టారు. విల్ జాక్స్ (1), రజత్ పాటిదార్ (2), మ్యాక్స్ వెల్ (4), కెమెరాన్ గ్రీన్ (1) పరుగులు చేయడంతో మ్యాచ్ ఓడిపోతుందనే అనుకున్నారు. ఆ తర్వాత దినేశ్ కార్తీక్ (21*), స్వప్నిల్ సింగ్ (15*) పరుగులు చేసి మ్యాచ్ ను గెలిపించారు. గుజరాత్ బౌలింగ్లో జోష్ లిటిల్ 4 వికెట్లతో చెలరేగాడు. ఆ తర్వాత నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు.
Dadisetti Raja: సంక్షేమం, అభివృద్ధి అంటే ఏంటో జగన్ చూపించారు..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్.. 19.3 ఓవర్లలో 147 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ బ్యాటింగ్లో షారుఖ్ ఖాన్ (37) టాప్ స్కోరర్ కాగా.. రాహుల్ తెవాటియా (35), డేవిడ్ మిల్లర్ (30) పరుగులు చేశారు. సాహా (1), శుభమాన్ గిల్ (2), సాయి సుదర్శన్ (6), రషీద్ ఖాన్ (18), విజయ్ శంకర్ (10), మానవ్ సుతార్ (1) రన్స్ చేశారు. బెంగళూరు బౌలింగ్లో సిరాజ్, యష్ దయాల్, విజయ్ కుమార్ వైశాఖ్ తలో రెండు వికెట్లు సంపాదించారు. ఆ తర్వాత.. కెమెరాన్ గ్రీన్, కర్ణ్ శర్మ చెరో వికెట్ తీశారు.