GT vs MI IPL 2025 Eliminator: క్వాలిఫయర్-2కి ముంబై.. ఇంటికి గుజరాత్..
- ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం..
- గుజరాత్పై గెలుపుతో క్వాలిఫయర్-2కి దూసుకెళ్లిన ముంబై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GT vs MI IPL 2025 Eliminator: ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది.. గుజరాత్పై గెలుపుతో క్వాలిఫయర్-2కి ముంబై దూసుకెళ్తే.. ఈ మ్యాచ్లో ఓటమి మూఠగట్టుకున్న గుజరాత్ టైటాన్స్ మాత్రం ఇంటిదారి పట్టింది.. ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసి.. గుజరాత్ టైటాన్స్ ముందు 229 పరుగుల విజయలక్ష్యాన్ని పెట్టగా.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పో్యిన జీటీ 208 పరుగులకే పరిమితం అయ్యింది.. దీంతో, 20 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న ముంబై.. ఐపీఎల్ క్వాలిఫయర్-2లో అడుగుపెట్టింది.. ఇక, ఆదివారం రోజు క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్తో తలబడబోతోంది ముంబై ఇండియన్స్..
Read Also: Off The Record: ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు.. జేసీ కామెంట్లతో టీడీపీ ఇరుకున పడుతుందా..?
Also Read
- Vaibhav-MS Dhoni: ఎంఎస్ ధోనీ కాదు బిహార్కు గుర్తింపు వైభవ్ వల్లే.. ప్రముఖ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంచలన వ్యాఖ్యలు!
- Surya Kumar Yadav: టీ20 వరల్డ్ కప్ తెచ్చాడన్న కనికరం కూడా లేదు.. పాపం సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి దారుణం..
- Vaibhav Sooryavanshi: ఏం మానియా క్రియేట్ చేశావ్ బుడ్డోడా.. నీ ఆట కోసం ప్రపంచ ప్రసార మాధ్యమాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నావ్గా..
- Venkatesh Iyer: రజత్ పాటిదార్ ఇక్కడ ఉండాల్సిన వాడు కాదు.. ఆర్సీబీ కెప్టెన్పై వెంకటేష్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు..
జీటీ కెప్టెన్ శుభ్మాన్ గిల్ మొదటి ఓవర్లోనే ఔట్ అయినప్పటికీ, కుశాల్ మెండిస్ హిట్ వికెట్గా ఔటైనా, సాయి సుదర్శన్ తన ఆశలను నిలుపుకుంటూ, తృటిలో సెంచరీని కోల్పోయాడు.. 49 బంతుల్లో 1 సిక్స్, 10 ఫోర్లుతో 80 పరుగులు చేశాడు.. అంతకుముందు, IPL 2025 ఎలిమినేటర్లో గుజరాత్ టైటాన్స్ పై మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 228/5 అద్భుతమైన స్కోర్ను నమోదు చేసింది. రోహిత్ శర్మ 50 బంతుల్లో 81 పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు.. జానీ బెయిర్స్టో 47, సూర్యకుమార్ యాదవ్ 33, తిలక్ వర్మ 25, హార్దిక్ పాండ్య 22 పరుగులతో ముంబై భారీ స్కోర్లో భాగస్వామ్యం అయ్యారు.. అయితే, సాయి సుదర్శన్ 49 బంతుల్లో 80 పరుగులు చేయగా.. వాషింగ్టన్ సుందర్ 48, కమిందు మెండిస్ 20, రూథర్ఫోర్డ్ 24, రాహుల్ తెవాతియా 16, షారుక్ ఖాన్ 13 పరుగులు చేసినా.. గుజరాత్ను గెలిపించలేకపోయారు..
Read Also: AP SSC 2025 Valuation: SSC వాల్యుయేషన్లో లోపాలు.. ఐదుగురిపై వేటు
ఇక, ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, బుమ్రా, రిచర్డ్ గ్లిసన్, శాంట్నర్, అశ్వని కుమార్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.. మరీ ముఖ్యంగా బుమ్రా.. జీటీ బ్యాటర్లను కట్టడి చేశాడు.. మరోవైపు.. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 2, సిరాజ్ ఒక వికెట్ తీశారు..
తాజావార్తలు
-
TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
-
Crime Thriller OTT : మనిషి శరీరానికి జంతువుల తలలను తగిలించే సైకో… ఓటీటీలో భయపెడుతున్న ఇంటెన్స్ థ్రిల్లర్
-
Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కు కోహ్లీ దూరం.!
-
Janhvi Kapoor: ‘పెద్ది’ అంటే అచ్చియమ్మకు ఇంత ప్రేమా? మెగా సక్సెస్ కోసం ఏడు కొండలు ఎక్కిన జాన్వీ కపూర్! వీడియో వైరల్
-
Lumio Vision 9 (2026): లూమియో నుంచి కొత్త 55-అంగుళాల స్మార్ట్ టీవీలు.. విజన్ 9 (2026), విజన్ 7 (2026) విడుదల
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!