Virat Kohli Next Match: RCBకి ఐపీఎల్ 2026 టైటిల్ అందించిన విరాట్ కోహ్లీ.. మళ్లీ బరిలోకి దిగేది ఎప్పుడు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli Next Match: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు మరోసారి ఐపీఎల్ ట్రోఫీ అందించి, తన కలను నిజం చేసుకున్న స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీ తదుపరి ఎప్పుడు మైదానంలో కనిపిస్తాడనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఐపీఎల్ 2026 ఫైనల్లో గుజరాత్ టైటాన్స్పై అద్భుత ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీకి వరుసగా రెండో టైటిల్ అందించిన కోహ్లీ ప్రస్తుతం విజయోత్సాహంలో ఉన్నాడు. అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని ఆర్సీబీ ఐదు వికెట్ల తేడాతో ఛేదించింది. ఈ మ్యాచ్లో కోహ్లీ 43 బంతుల్లో 75 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. చివర్లో విజయం సాధించే సిక్స్ కొట్టిన కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు.
ఇక, మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ, “ఐపీఎల్ ట్రోఫీ గెలిచి, చివరి పరుగులు నేనే చేయాలని ఎన్నోసార్లు కలగన్నాను. ఈ రోజు అది నిజమైంది. ఇది నా కలల రోజు” అని ఆనందం వ్యక్తం చేశాడు. ఈ సీజన్లో ఆర్సీబీ విజయానికి కేవలం కోహ్లీ మాత్రమే కాకుండా జట్టులోని పలువురు ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా జోష్ హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, జేకబ్ డఫీ, కృనాల్ పాండ్యా, రసిఖ్ సలాందర్ వంటి బౌలర్లు జట్టుకు ఎన్నో కీలక విజయాలు అందించారు. జట్టులో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని మ్యాచ్లు గెలిపించడంతో తనపై ఒత్తిడి తగ్గిందని కోహ్లీ పేర్కొన్నాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
కోహ్లీ తదుపరి మ్యాచ్ ఎప్పుడు?
టీ20 అంతర్జాతీయాలు, టెస్టు క్రికెట్కు ఇప్పటికే వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ ప్రస్తుతం భారత జట్టుకు కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నాడు. ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత్ – ఆఫ్గానిస్థాన్ మధ్య జరగనున్న వన్డే సిరీస్లో కోహ్లీ మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు. భారత్, ఆఫ్గాన్ మధ్య ముందుగా జూన్ 6 నుంచి 10 వరకు ముల్లాన్పూర్ వేదికగా ఏకైక టెస్టు మ్యాచ్ జరగనుంది. అనంతరం మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ జూన్ 13న ప్రారంభం కానుంది. రెండో, మూడో వన్డేలు వరుసగా జూన్ 17, జూన్ 20 తేదీల్లో నిర్వహించనున్నారు. దీంతో ఐపీఎల్ 2026లో టైటిల్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ తదుపరి సారి జూన్ 13న ఆఫ్గానిస్థాన్తో జరిగే తొలి వన్డేలో భారత జెర్సీలో అభిమానులను అలరించనున్నాడు. అభిమానులు ఇప్పటికే ఆ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
-
Kangana Ranaut-Baba Ramdev: నా యవ్వనం గురించి మీకెందుకు బెంగ.. బాబా రామ్దేవ్పై కంగనా ఫైర్
-
School Holidays: కుక్కల బెడదతో స్కూళ్లకు సెలవులు.. 4 రోజులు ఆన్లైన్ క్లాసులే..
-
Telegram: టెలిగ్రామ్ యూజర్లకు బంపర్ ఆఫర్.. ఇక ప్రతి ఒక్కరికీ ఫ్రీ వెబ్సైట్, డొమైన్! CEO సంచలన ప్రకటన..
-
Amit shah: రేపు తమిళనాడులో దక్షిణాది ముఖ్యమంత్రులతో అమిత్ షా భేటీ.. ఆ 3 అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!